గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

On
గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

 ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద పొందు పర్చిన సూచనలు బొర్డు మీటింగ్‌లో ప్రతి పాదించాలని చాంద్ పాషా కోరారు.. 
1.    చాలా రిజిష్టర్డ్‌ మరియు నాన్‌ రిజిష్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఎజెన్సిలు వాళ్ల వాళ్ల సబ్‌ ఏజెంట్స్‌ ద్వారా పాస్‌ పోర్టులు సేకరించి వాళ్లకు వీరు స్కిల్‌ ట్రేయినింగ్‌ ఇప్పిస్లామని ఫేక్‌ ట్రేయినింగ్‌ సెంట్‌ర్‌ల నుండి సర్టిఫికేట్‌లు తెప్పించి వాల్లను స్కిల్డ్‌ వర్కర్‌లుగా పంపిస్తున్నారు. వీరు బయట దేశంలో కంపెనీలలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి రిజిష్టర్డ్‌ మరియు ఆన్‌ రిజిష్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఎజేన్సిస్‌ల పై ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్స్‌ వారు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. వీళ్లపై సరిjైున మానిటరింగ్‌ లేక ఈ ఫేక్‌ రిజిష్టరింగ్‌ ఎజెన్సిస్‌ రెచ్చి పోతున్నాయి. వీరిపై తరచుగా  సి.ఐ.డి డిపార్ట్‌మెంట్‌ ద్వారా మానిటరింగ్‌ చేపట్టాలి. 


2. చాలా ఎజెన్సీలు రకరకాల విసాలు, జాబ్‌ విసా, విసిట్‌ నుండి ఎంప్లయిమెంట్‌ విసా, ఆజాద్‌ విసా, ఫ్రీ విసా, ట్రాన్సిట్‌ విసా అని ఎమిగ్రెంట్‌ వర్కర్‌లను మొసాలకు గురిచేస్తున్నారు. ఇటువంటి రకరకాల విసాలు ఇస్లున్న ఎజెన్సిల లైసెన్స్‌లు త్వరగా రద్దు చేయాలి. ఇటువంటి ఎజెన్సిలపై ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్‌, రాష్ట్ర సి.ఐ.డి ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించాలి. 

IMG-20250618-WA0001
3. ఎందరో ఎజెంట్లు సరైన అర్హత మరియు రిక్రూట్‌మెంట్‌ అవగాహన లేకుండా వేరే డిగ్రీ హోల్డర్స్‌ పేరు మీద లైసెన్స్‌లు తీసుకొని (రిక్రూట్‌మెంట్‌ లైసెన్స్‌ పొందుటకు కొరకు డిగ్రీ తప్పనిసరి) రక రకాల మొసాలకు పాల్పడుచున్నారు. ఎందరో ముగిసిన (ఎక్సైర్‌) లైసెన్స్‌లపైన సస్పెండ్‌ లైసెన్స్‌ పైనా కూడా బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. వీరిపై కూడా ఎల్లప్పుడు రాష్ట్ర సి.ఐ.డి మానిటరింగ్‌, పోలీస్‌ వారి నిఘా ఉండాలి. 


4. రిక్రూట్‌మెంట్‌ ఎజెన్సీలు వారు పంపేముందు అభ్యర్తుల యొక్క అర్హతలను బట్టి వారికి ఇక్కడే ముందస్తు ట్రైనింగ్‌ ఇప్పించాలి. దీంతో ఎంప్లాయిమెంట్‌ వర్కర్‌లు ఎలాంటి ఇబ్బందులకు గురికారు. మరియు ప్రవాసి బారతీయ భీమా యోజన (పి.బి.బి.వై) ఇన్సూరెన్స్‌ పాలసి కవరేజ్‌ ప్రస్తుతం రూ॥ 10,00,000/` (రూపాయలు పది లక్షలు) గా వుంది. ఇప్పుడు లిబియా దేశంలో ప్రవాస భారతీయులకు రూ॥ 25,00,000/` (ప్రమాద భీమా) దీన్ని 2012 సం॥లో కేంద్ర ప్రభుత్వం అమోదించింది. అయితే ఇదే రూ॥ 25,00,000/` ప్రమాద భీమా సౌకర్యం అన్ని గల్ఫ్‌ దేశాలకు వర్తింపజేయాలి. 


5. 2006 సం॥లో యు.ఎ.ఇ ప్రభుత్వం ఆమ్నెస్టి ప్రకటిఆంచింది. దీని ప్రకారం ఎవరైతే ఇల్లిగల్‌గా వున్నారో వాల్లందరిని వారి వారి దేశాలకు పంపించింది. అప్పటి యు.పి.ఎ`1 ప్రభుత్వంలో వీరికి ఉచిత ప్రయాణ టికెట్లు పంపించింది. వీరందరికి 2007 సం॥లో అప్పటి శ్రీ డా॥ వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి ప్రభుత్వం ఒక లక్ష (రూ॥ 1,00,000/`) ఆర్తిక సహయం జి.ఒ నెం. 256 ద్వారా ప్రకటించి మొదటి విడతగా 29 మందికి ప్రభుత్వం 2009 లో లక్ష రూపాయల చెక్కును మొదటి అసెంబ్లీ సమావేశంలోనే పంపణీ చేయడం జరిగింది. ఇదే జి.ఒ 256 ను ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ లో 2014 వరకు కొనసాగించారు. మళ్లి 2019 ఎలక్షన్స్‌లో రూ॥ 5,00,000/` ఆర్థిక సహయం గల్ఫ్‌లో మృతి చెందిన కుటుంబాలకు ఇస్తామని హామి ఇచ్చారు. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్‌ కాంగ్రెస్‌ పార్టీ మానిఫెస్టోలో రూ॥ 5,00,000/` పరిహరం ఇస్తామని ప్రకటించారు. దీని ప్రకారం తేది: 07`12`2023 తర్వాత గల్ఫ్‌లో మరణించిన వారందరికి రూ॥ 5,00,000/` ఆర్థిక సహయం ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి రూ॥ 5,00,000/` పరిహరం కనీసం సగబాగం రూ॥ 2,50,000/` 2007 లో పాసైన జి.ఒ 256 వారికి కూడా వర్తింపచేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 


పైన పేర్కొనబడిన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ క్రింద పేర్కొనబడిన వ్యవస్థలను ఇప్పుడు మీ ఆద్వర్యంలో రూపొందించాలి. 
ఎన్‌.ఆర్‌.ఐ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇట్టి శాఖ డా॥ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాస ఆంధ్రుల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు  నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా అదే ఎన్‌.ఆర్‌.ఐ మంత్రిత్వ శాఖను కొనసాగించాలి. 
2006 లో అప్పటి డా॥ వైఎస్‌.ఆర్‌ ప్రభుత్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒ.ఎమ్‌.కాప్ అనే  సంస్థను స్థాపించి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిరుద్యోగ యువతకు అవగాహన సదస్తులు నిర్వహించి వారికి 3 నెలలు ఉచిత బోజన సౌకర్యం కల్పిస్తు స్కిల్డ్‌ ట్రైనింగ్‌ ఇప్పించి బయటకు పంపడం జరిగింది.

అప్పట్లో అన్‌ స్కిల్డ్‌ లేబర్‌ విసా మరియు మజ్రా (గొర్రెల కాపలి) మరియు విసిట్‌ విసాలు బ్యాన్‌ చేయడం జరిగింది. ఇదే విదానం ఇప్పుడూ కొనసాగించాలి. ప్రస్తుత ప్రభుత్వ ఆద్వర్యంలో టామ్‌కామ్‌ (ుూవీజూవీ) నడుస్తుంది. ఇది అనుకున్న స్థాయిలో పనిచేయక నిరుద్యోగులకు ఎలాంటి శిక్షణలు ఇవ్వక రిక్రూట్‌మెంట్‌ ఎజెన్సీలతో కుమ్మక్కైనారు. కాబట్టి ుూవీజూవీ గత 10 సం॥ల కార్యకలపాలపై సి.ఐ.డి ద్వారా విచారణ జరిపించి ఇక నుండి అయినా నిరుద్యోగులకు ఎలాంటి ఖర్చులు గాని డబ్బులు వసూలు చేయకుండా వారిని విదేశాలకు పంపించాలి. దీన్ని ఇప్పటి ఎన్‌.ఆర్‌.ఐ మంత్రిత్వ శాఖ పకడ్బందిగా అమలు చేయాలి. 
ుూవీజూవీ వ్యవహరాల్లో ఎన్‌.జి.ఒలు కాని ఇతర సంఘాలు కాని ఎలాంటి జోక్యం వుండకూడదు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అంటే జిల్లా కలెక్టర్‌లు మరియు మండల స్థాయిలో యం.డి.ఒ గారి ఆద్వర్యంలోనే నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గ ఎం.ఎల్‌.ఎ లకు కార్యక్రమాలపై దృష్టి సారించాలి.
గల్ఫ్‌లో ప్రమాదంలో మరణించేవారు అంటే రోడ్డు ప్రమాదాలలో, పని స్థలంలో ప్రమాదాలలో మరణించిన వారి ఇస్సూరెన్స్‌ క్లైం లు ఇవ్వకుండా సంవత్సరాలు గడుస్తున్నాయి. దీనిలో ఇండియన్‌ ఎంబసీ ఆధికారులకు అక్కడి ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఉదాహరణకు 5 కేసుల తమరి ముందు ఉంచుతున్నాను. 15 రోజుల క్రితం ప్రజావాణిలో 13 కేసులు కేస్‌ స్టడీ కొరకు ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయం మీతో చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా ఇట్టి విషయాన్ని మీ కమిటి మీటింగ్‌లో చర్చించగలరు. 
పైన పేర్కొన్న అంశాలను పకడ్బందీగా అమలు చేయాలంటే రాష్ట్ర స్థాయిలో ఎన్‌.ఆర్‌.ఐ కమిషన్‌ను స్థాపించి, దీనికి ఐ.పి.ఎస్‌ స్థాయి అధికారిని నియమించాలి. వీరి ఆద్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక ఎన్‌.ఆర్‌.ఐ పోలీస్‌ స్టేషన్‌, ఎన్‌.ఆర్‌.ఐ కోర్టు ప్రత్యేకంగా ఏర్పరచాలి. ఎమిగ్రేషన్‌ చట్టం 1983 రూల్స్‌ Ê రెగ్యులేషన్స్‌ క్రింద చట్టాలను ఉల్లంఘించిన ట్రావెల్‌ ఎజెన్సిలపై ఎన్‌.ఆర్‌.ఐ పోలీస్‌ శాఖ వాళ్లే చర్యలు చేపట్టాలి. ఇందులో సివిల్‌ పోలీస్‌ వాళ్లకు ఎలాంటి జోక్యం వుండకూడదను చాంద్ పాషా కోరారు.

 

Tags

More News...

Local News 

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక  జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసిన సందర్భంగా జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  మీడియా సమావేశం...
Read More...
National  State News 

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు): 13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు.  బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ...
Read More...
Local News 

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం కావు గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పేద బీద వ్యవసాయ కుటుంబాల భూ బాధితుల సమస్యలు పరిష్కారానికి ఒక మంచి దారి చూపించినాదాని, రేవంత్ రెడ్డి ఆలోచన ఒక చరిత్ర అని కొనియాడుతున్నారని జాతీయ బిసిసంక్షేమ...
Read More...
Local News 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో బుధవారం నాడు నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా మహాసభ కు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ . అనంతరం  టి డబ్ల్యూ...
Read More...
Local News 

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు. ముదిరాజ్ కుల బాంధవుల ఇంటి దైవం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పండుగ సందర్భంగా గురువారం నాడు హస్నాబాద్ లో గల ముదిరాజ్ ల కులదైవ పెద్దమ్మ తల్లి ఆలయానికి హాజరుకావాలని...
Read More...
Local News 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.  -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.   -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి  జగిత్యాల జూన్ బుధవారం 18 (ప్రజా మంటలు) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.  వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్...
Read More...
Local News 

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ  న్యాయం గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం  సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం  నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వo పది...
Read More...
State News 

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్ సహాయం కోసం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం సభ్యులు  హైదరాబాద్ జూన్ 18: బహరేన్ లోని ఆల్ మోయ్యాద్ కంపెనిలో డ్రైవర్లు గా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను ఇందనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన డ్రైవర్...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జగిత్యాల జూన్ 19 (ప్రజా మంటలు): బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు  భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ను నియమించారు. జగిత్యాల పట్టణంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పట్టణ కార్యవర్గంతో పాటు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసే రాబోయే మున్సిపల్...
Read More...
Local News 

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి.. ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకు ఫిర్యాదు    సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు):    హైదరాబాద్ సిటీలోని బోనాల జాతరకు సంబంధించి 150 డివిజన్లలోని ఆయా ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేష్ బుధవారం దేవాదాయ మంత్రి కొండ సురేఖను కలసి  వినతిపత్రం ఇచ్చారు. ఒకే ఆలయానికి కొందరు రెండేసి కమిటీల...
Read More...
Local News 

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) : ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్...
Read More...

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి  టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.   ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద1....
Read More...