వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు
మెట్పల్లి జూన్ 11 (ప్రజా మంటలు)
అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్ పర్సన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగారుల సమస్యను లోతుగా పరిశీలించి వెనువెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, ఉపేక్షిస్తే, అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులపై కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు.
వినియోగదారుల పట్ల జవాబుదారీ తనంతో ఉండాలని, అన్ని విధ్యుత్ కార్యాలయాల ముందర పౌర సేవా పత్రం అతికించాలని, ఇంజనీర్లు, సిబ్బంది చరవాణి నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు.
రైతులు, వినియోగారులు విద్యుత్ ఆదా కొరకు తమ వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, ప్రమాదాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోకల్ కోర్టు లో ఒక్క పిర్యాదు కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో సిజిఆర్ఎఫ్ లోకల్ కోర్టు ల గురించి వినియోగదారుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, జగిత్యాల ఎస్ఈ షాలియా నాయక్, మెటుపల్లి డిఈ గంగారాం, ఏడీఈ లు మనోహర్, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్, మెటుపల్లి సబ్ డివిజన్ పరిధిలోని మూడు సెక్షన్ల వినియోగదారులు, రైతులు హాజరైనారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు
.jpeg)
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..
.jpg)
ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం -హరి ఆశోక్ కుమార్

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత

అమ్మ మాట అంగన్వాడి బాట సిడిపిఓ వీరలక్ష్మి ఆధ్వర్యంలో
.jpg)
మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
