వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు
మెట్పల్లి జూన్ 11 (ప్రజా మంటలు)
అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్ పర్సన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగారుల సమస్యను లోతుగా పరిశీలించి వెనువెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, ఉపేక్షిస్తే, అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులపై కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు.
వినియోగదారుల పట్ల జవాబుదారీ తనంతో ఉండాలని, అన్ని విధ్యుత్ కార్యాలయాల ముందర పౌర సేవా పత్రం అతికించాలని, ఇంజనీర్లు, సిబ్బంది చరవాణి నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు.
రైతులు, వినియోగారులు విద్యుత్ ఆదా కొరకు తమ వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, ప్రమాదాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోకల్ కోర్టు లో ఒక్క పిర్యాదు కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో సిజిఆర్ఎఫ్ లోకల్ కోర్టు ల గురించి వినియోగదారుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, జగిత్యాల ఎస్ఈ షాలియా నాయక్, మెటుపల్లి డిఈ గంగారాం, ఏడీఈ లు మనోహర్, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్, మెటుపల్లి సబ్ డివిజన్ పరిధిలోని మూడు సెక్షన్ల వినియోగదారులు, రైతులు హాజరైనారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
