ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల జూన్ 12 ( ప్రజా మంటలు)
విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో “పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత” వినూత్న కార్యక్రమం
“ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చుఅనే ఉద్దేశంతో *“పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత”* అనే ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ గురువారం స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... “పిల్లలు మన భవిష్యత్తు. వారికి ఇప్పుడు సరైన అవగాహన కల్పిస్తే, రేపటి సమాజం మరింత భద్రమవుతుంది అనే ఉద్దేశంతో *“పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత”* కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమ౦ యొక్క ప్రధాన లక్ష్యం
చిన్నారుల్లో రోడ్డు నియమాల పట్ల చైతన్యం పెంపొందించడం.
విద్యార్థులపై జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడం
విద్యార్థులను వారి ఇంట్లో, సమాజంలో “ట్రాఫిక్ భద్రత వారియర్స్ గా ” మారేందుకు ప్రోత్సహించడం.
పోలీసు మరియు విద్యార్థుల మధ్య స్నేహపూరిత సంబంధాన్ని ఏర్పరచడం
ఈ కార్యక్రమ౦ ద్వార నేటి ను౦డి ప్రతి వారం జిల్లాలోని ఒక్కో పాఠశాలకి పోలీసులు వెళ్లి విద్యార్థులతో ప్రత్యక్షంగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు సురక్షిత ప్రయాణ పద్ధతులు ,రోడ్డు పై ఎలా సురక్షితంగా నడవాలి, రోడ్డు దాటేటపుడు పాటించవలసిన నియమాలు ,సైకిల్ నడిపేటప్పుడు, కుటుంబ సభ్యులతో కారు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలు,హెల్మెట్, సీటుబెల్ట్ వాడక ప్రాముఖ్యత,రోడ్ల పై మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలు,రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక యాక్సిడెంట్ సంభవిస్తుందని ఈ యొక్క ప్రమాదాల ద్వారా చాలా మంది చనిపోవడం జరుగుతుందని ఈ ప్రమాదాలను నివారించడానికి విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి వివరించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వారియర్స్ గా పని చేయాలని కోరారు.
ఈ యొక్క కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఐటికోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)