విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి
జగిత్యాల జూన్ 12
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు సంజయ్ కుమార్ ను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.
విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలను ఇంటింటికి అందజేస్తున్న కేబుల్ ఆపరేటర్ల నుండి విద్యుత్ శాఖ వారు గ్రామ పంచాయతీస్థాయిలో 15 రూపాయలు ,మున్సిపాలిటీ పరిధిలో 20 రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లులతో వసూలు చేస్తున్నారని అన్నారు .విద్యుత్ స్తంభాల ఫీజు రద్దుచేసి తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు . సొంత పెట్టుబడితో గత 30 సంవత్సరాలుగా కేబుల్ టీవీ నిర్వహించుకుంటున్నామని అన్నారు.
ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవనం కొనసాగిస్తున్నామని కాగా కొందరు విద్యుత్ శాఖ అధికారులు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ వ్యవస్థ లేకుండా చేసి పేద ప్రజల వినోదాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఈ చర్యల వల్ల ఆపరేటర్ల జీవనోపాధి కోల్పోవడమే కాకుండా పేద ప్రజలకు వినోదం భారమవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆపరేటర్ల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించాలని అధికారులకు సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)