హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన
అధిక ధ్వనుల నియంత్రణ చర్యలకు కదిలిన యంత్రాoగం
సికింద్రాబాద్ జూన్14 (ప్రజామంటలు)::
న్యూ బోయిగూడ మెట్రో పిల్లర్ నెం. బీ 1006 మలుపు వద్ద మెట్రో రైళ్లు రాత్రింబవళ్ళు చేస్తున్న అధిక ధ్వనులవల్ల స్థానికులు అనేక ఇబ్బందులకు, ఆరోగ్యసమస్యలకు గురవుతున్నట్లు ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. హనుమాన్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో కంప్లైంట్ దాఖలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశితాల ప్రకారం నివాస ప్రాంతాల్లో డే టైములో 55 డెసిబెల్స్, రాత్రి సమయంలో 45 డెసిబెల్స్ కు మించిన ధ్వని ఉండకూడదని, అధిక సౌండ్ లెవల్స్ వినికిడి, గుండె, హై బ్లడ్ ప్రెషర్, నిద్రలేమి తదితర సీరియస్ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్ హనుమాన్లు తెలిపారు.
హైదరాబాదులో మెట్రో రైళ్ల ధ్వని కాలుష్యం సమస్యను తప్పుదోవ పట్టించేందుకు గతంలో హైదరాబాదు మెట్రో రైల్ అధికారులు అమెరికన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారం నివాస ప్రాంతాల్లో 80 డెసిబెల్స్ సౌండ్ లెవల్స్ నార్మల్ అని ఉటంకిస్తూ ప్రజావాణి అధికారులను బురిడీ కొట్టించినట్లు ఆయన ప్రజావాణి అధికారులకు, ముఖ్యమంత్రికి లేఖ వ్రాయగా ఈ విషయంలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. వారంలోగా విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ సెక్రటరీని, మెట్రో రైల్ అధికారులను గత నెల 23 తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఎలాంటి విచారణ జరుపలేదని ఆయన వాపోయారు.
ఇది ఇలా ఉండగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సమయంలో మెట్రో పిల్లర్ నెం. బీ 1006 మలుపు వద్ద సౌండ్ లెవెల్సును రికార్డు చేసి ధ్వని కాలుష్యంపై వాస్తవిక వివరణలతో కూడిన రిపోర్టును హైకోర్టుకు సమర్పించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను హై కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు ఎన్విరాన్మెంటల్ సహాయ సైంటిస్ట్ విద్యుల్లత హైదరాబాదు మెట్రో రైల్ లిమిటెడ్ ప్రతినిధి శివకుమార్, ఎం ఎన్ కే అపార్టుమెంటు వాసుల సమక్షంలో సౌండ్ లెవెల్సు రికార్డు చేశారు. అత్యధికంగా 97 డెసిబెల్స్ సౌండ్ రికార్డు అయినట్లు తెలిసింది. మెట్రో రైళ్ల వల్ల కలుగుతున్న ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికార యంత్రాoగం ఉపక్రమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)
నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్.

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.- ఆర్డీవో పి.మధుసూదన్.

రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆవాసంతోపాటు పని కల్పించండి- స్కై ఫౌండేషన్

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.

ట్రస్మా ముషీరాబాద్ శాఖ ప్రెసిడెంట్ గా సందీప్ కుమార్ గుప్తా

సఖి అవగాహనా కార్యక్రమం
