లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్
కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు”
వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :
“లోక్ అదాలత్ కోర్టు కాదు... రాజీ ద్వారా న్యాయం”, “కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు” అంటూ ప్రజలకు వినూత్నంగా సందేశం ఇచ్చింది వేలేరు పోలీస్ శాఖ.
ఈ నెల 14న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా, ప్రజలు – ముఖ్యంగా కేసులున్న కక్షిదారులు – ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.తేలికపాటి కేసులు, సామాజిక తగాదాలు, కుటుంబ వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకుండా రాజీ ద్వారా శాశ్వత పరిష్కారాన్ని సాధించవచ్చని తెలిపారు.
ఈ లోక్ అదాలత్లో రాజీ పర్చగలిగే కేసులు:
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు
సివిల్ తగాదాలు
ఆస్తి విభజన, కుటుంబ నిర్వహణ కేసులు
రోడ్డు ప్రమాద పరిహార కేసులు
చిన్నచిన్న దొంగతనాలు
వైవాహిక వివాదాలు
డ్రంక్ అండ్ డ్రైవ్
బ్యాంకు రికవరీలు
టెలిఫోన్, విద్యుత్ బిల్లుల తగాదాలు
చెక్ బౌన్స్ కేసుల
“రాజీ మార్గం... రాజమార్గం” అంటూ, ఇద్దరూ గెలిచే మార్గమే రాజీ మార్గమని, చిన్నపాటి విషయాల్లో కక్షలు పెంచుకోకుండా శాంతి పూర్వకంగా పరిష్కారానికి వస్తే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఎస్సై వేలేరు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు
.jpeg)
విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..
.jpg)
ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం -హరి ఆశోక్ కుమార్

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత
