భద్రతకు భాగస్వాములు కావాలి – నిఘా నేత్రాలకు దాతల సహకారం కావాలి*
కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి పిలుపు
భీమదేవరపల్లి జూన్ 9 (ప్రజామంటలు) :
మండలాన్ని నేరాల నుండి నేర రహిత మండలంగా చేయాలంటే పోలీసులపై మాత్రమే భద్రత భారం మోపడం కాకుండా, ప్రజల సహకారం అవసరమని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, వంగర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 40 గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. "ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమైన పని చేస్తుంది. ఇవి నేరాలను అరికట్టడంలో, నిందితుల గుర్తింపులో కీలకంగా మారతాయి. ప్రతి గ్రామంలోనూ కనీసం కొన్ని కెమెరాలు ఏర్పాటు అయితే, మన ప్రాంతాన్ని క్రిమినల్ రహిత మండలంగా మార్చవచ్చు," అని ఆయన పేర్కొన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, స్వచ్చంద దాతలు కలిసి ఈ భద్రతా కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో స్వయంగా ప్రజలు నిధులు సమకూర్చి కెమెరాలు ఏర్పాటు చేసిన ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు.
*సమాజ భద్రత మన బాధ్యత*
ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చెప్పిన విధంగా – "పోలీసులు చేస్తున్న కృషికి తోడు ప్రజలు కూడా ముందుకు వచ్చినపుడే సమాజ భద్రత బలపడుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం, మన గ్రామాల్లో శాంతి కోసం ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు చేయూతనివ్వాలి." ఈ కార్యక్రమంలో పులి రమేష్, ముల్కనూర్ వంగర ఎస్సైలు సాయిబాబు, దివ్య, ప్రొబేషనరీ ఎస్సై శ్రావణ్ కుమార్, ఏఎస్ఐ సంపత్, మల్లెల నాగేశ్వరరావు, రైటర్ మోహన్ బాబు, రాజు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.
