వికసిత కృషి సంకల్ప్ అభియాన్
గొల్లపల్లి జూన్ 09 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం, రాపల్లి గ్రామంలో "వికసిత కృషి సంకల్ప్ అభియాన్ - రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం నిర్వహించారు. ఉత్సాహంగా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా సరైన వినియోగం,వ్యవసాయంలో నీటి యాజమాన్యం వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా" జి. వేణుగోపాల్ మాట్లాడుతూ, యూరియా వాడకాన్ని మోతాదుకు మించి వాడకూడదని రైతులకు సూచించారు. నేల పరీక్షల ఆవశ్యకతను మరియు సమగ్ర పోషక యాజమాన్యం గురించి ఆయన వివరించారు. సహాయ అధ్యాపకులు డా" వి. రత్నాకర్ మాట్లాడుతూ, సమగ్ర సస్యరక్షణ ఆవశ్యకతను తెలియజేశారు. రైతులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతులు తమ అనుభవాలను, సమస్యలను శాస్త్రవేత్తలతో పంచుకున్నారు. 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీని ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులు తెలుసుకొని తమ దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బుర్ర భూమయ్య గౌడ్, గండ్ర రామారావు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా డా.కోట నీలిమ నియామకం

గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో

గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం

బల్కంపేట అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు

ప్రజల రుణం తీర్చుకుంటా - రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి జీవిత ఖైదు మరియు రూ 17000 /- జరిమాన. బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.

ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ సభ్యుల చే ఎమ్మెల్యేకు వినతి

మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్

ప్రపంచ వ్యాప్తంగా ChatGPT సేవలకు అంతరాయం
.jpeg)
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ - బస్సు పాస్ ధరల పెంపుకు నిరసనగా మెరుపు ధర్నా

ఇందిరమ్మ ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులచే స్మశాన వాటిక స్థలానికై ఎమ్మెల్యేకు వినతి

40 వార్డులో బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్
