మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులచే ఘన స్వాగతం

On
మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులచే ఘన స్వాగతం


జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు)

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చిన అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కి మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. 

 ఈ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. 

జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జెండాల ఏర్పాటు తో పండుగ వాతావరణం నెలకొంది.

బైక్ ర్యాలీ

స్థానిక ఇందిరా భవన్ నుండీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో పట్టణంలోని టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. 

కార్యకర్తలు టపాసులు  పేల్చి, సంబురాలు నిర్వహించారు.

డీజె పాటలు. కార్యకర్తల నినాదాలు. వందలాది బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆడ్లూరీ లక్ష్మణ్ కుమార్ రాజీవ్ గాంధీ విగ్రహానికి, పాత బస్టాండ్ లోని ఇంద్రమ్మ విగ్రహానికి ,తహశీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

 ఓపెన్ టాప్ జీప్ లో జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సింగ్ రావుపాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి, ప్రజలకు అభివాదం చేస్తూ, ర్యాలీ లో పాల్గొన్నారు.

అనంతరం టౌన్ హాల్ లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చి, లక్ష్మణ కుమార్ ను శాలువాలతో సన్మానించారు.

మొదటి సరిగా జగిత్యాలకు వచ్చిన కేబినెట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సన్మానించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడ్డారు.

పదేళ్ల నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని నాయకులు కోరారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి  జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ సమర్ధవంతముగా పని చేశారని, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు.

సామాజిక న్యాయం పాటించడంలో 
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం  తీర్మానం చేసిందని గుర్తు చేశారు.

రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించాలని అన్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని కోరారు.

కాంగ్రెస్ క్రమ శిక్షణ గల కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగిన లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలకు ఆదర్శం అన్నారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.

రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

అందరి కృషి ఆశీర్వాదం తో మంత్రి పదవి దక్కిందన్నారు.

పనిలో నిజాయితీ గా ఉండాలి..పార్టీ కోసం పనిచేయాలి.
రాహుల్ గాంధీ ఆలోచన విధానం తో  సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన  చేసి, 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారు.

కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారం తో ముందుకు సాగుతానని,జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తామని అన్నారు.

ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ, అందరి సమస్యలు పరిష్కరిస్తారని లక్ష్మణ కుమార్ హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు,  ఆకుల లింగా రెడ్డి, కరం చాంద్,
బండ శంకర్, షాకీర్, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కళ్లేపల్లి దుర్గయ్య, రమేష్ రావు,జలపతి రెడ్డి,
మసర్తి రమేష్,  చాంద్ పాషా, కొయ్యడ మహిపాల్, మ్యకల రమేష్, మన్సూర్, నిశాంత్ రెడ్డి, శైలేంద్ర రెడ్డి నేహాల్, భూక్యా సరళ, గోపి మాధవి,ధర రమేష్ బాబు, గోపి రాజిరెడ్డి, బీరం రాజేష్, నల్లా స్వామి రెడ్డి, బో గ సందీప్ పాల్గొన్నారు.

Tags

More News...

National  International  

అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు అహ్మదాబాద్ జూన్ 12: గురువారం అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌ను పునర్నిర్మించడంతో పాటు, గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా...
Read More...
Local News 

విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి 

విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి  జగిత్యాల జూన్ 12  విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు సంజయ్ కుమార్ ను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలను ఇంటింటికి అందజేస్తున్న కేబుల్...
Read More...
National  International  

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది వాషింగ్టన్ జూన్ 12: అమెరికా సైనిక కుటుంబాలు మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలను విడిచిపెట్టవచ్చని డోనాల్డ్ ట్రంప్ అన్నారుఅమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి భౌగోళిక రాజకీయ ఆందోళనలు ప్రపంచ వస్తువుల మార్కెట్‌ను అస్థిరపరిచిన తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల మొదలైంది.అమెరికా సైనిక...
Read More...
Local News 

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల జూన్12(ప్రజా మంటలు) ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి తెలిపారు . గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సివిల్ తగాదాలు, రాజీ పడే కేసులు ఉన్నట్లయితే తక్కువ...
Read More...
Local News 

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు.. జూలై 13న బోనాలు    14న రంగం( భవిష్యవాణి ) సికింద్రాబాద్, జూన్ 12 (ప్రజామంటలు) : ఆషాడ మాస బోనాల జాతర–2025 కు సికింద్రాబాద్ లోని శ్రీఉజ్జయిని మహాకాళి దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయాన్ని శుభ్రపరచి, రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి. ఈనెల 20 లోగా ఆలయానికి రంగులు వేసే పనులు పూర్తి చేయాలని ఆలయ ఈవో...
Read More...
Local News 

ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి

ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి సికింద్రాబాద్, జూన్ 12 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాద్యక్షురాలిగా ఇటీవల నియమితులైన సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమ గురువారం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ర్టంలో చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్ళి...
Read More...
Local News 

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  మల్యాల జూన్ 12(ప్రజా మంటలు) మండలంలోని నూకపల్లి శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి ఆలయం (ఏకాదశ) 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై సరస్వతీ దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల ను జగిత్యాల...
Read More...
Local News 

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం  -హరి ఆశోక్ కుమార్

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం  -హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 12 (ప్రజా మంటలు): హైదరాబాద్, కాచిగూడ లో ఉన్న మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లో జిల్లాల నుంచి వచ్చే మున్నూరు కాపు విద్యార్థులు  వసతి సౌకర్యం పొందవచ్చని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర  సెక్రటరీ జెనెరల్ హరి అశోక్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తగు ధ్రువపత్రాలతో...
Read More...
Local News 

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత    జగిత్యాల జూన్ 12 (ప్రజా మంటలు) *జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్ గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.*
Read More...
Local News 

అమ్మ మాట అంగన్వాడి బాట సిడిపిఓ  వీరలక్ష్మి ఆధ్వర్యంలో

అమ్మ మాట అంగన్వాడి బాట సిడిపిఓ  వీరలక్ష్మి ఆధ్వర్యంలో గొల్లపల్లి జూన్ 12 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని బీబీ రాజు పల్లె, దట్నూరు అంగన్వాడీ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడి బాట ప్రోగ్రాంలో గురువారం  అంగన్వాడి సెంటర్లలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు.రెండు సెక్టార్లలో కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం వల్ల లాభాలను, ప్రాముఖ్యతను తల్లులకు ధరించారు మూడు నుండి ఏడు సంవత్సరాల పిల్లల...
Read More...
Local News 

మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.   ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.    ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల జూన్ 12 (ప్రజా మంటలు) గడిచిన ఐదు నెలల్లో  జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు  నడుపుతూ 3200 మంది వ్యక్తులకు పట్టుకోవడం జరిగిందని వీరికి కోర్టు ద్వారా జరిమానలు  విధించడం జరిగిందని ఇందులో 7  గురు( 5 రోజులు ఇద్దరికి, 4 రోజులు నలుగురికి , 2...
Read More...
Local News 

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల జూన్ 12 ( ప్రజా మంటలు)    విద్యార్థులకు  ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో “పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత” వినూత్న కార్యక్రమం    “ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చుఅనే ఉద్దేశంతో  *“పోలీస్...
Read More...