ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు
డాక్టర్ ను కలిసే లోపే గుండెపోటుతో క్యూలైన్ లోనే కుప్పకూలి మృతి
గాంధీ ఆసుపత్రిలో విషాద ఘటన
సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు) :
ఏ క్షణాన ఏమీ జరుగుతుందో తెలియని రోజులు ఇవి...చాతీలో నొప్పి ఉందంటూ ఓ యువకుడు ఒక్కడే దవఖానకు వచ్చి డాక్టర్ కు చూపించుకునే లోపునే ప్రాణాలు వదిలాడు..వివరాలు ఇవి... బన్సీలాల్ పేట్ డివిజన్ లోని చాచానెహ్రూ నగర్ కు చెందిన జంగిటి నంద కిషోర్ ముదిరాజ్ (37) ప్రైవేట్ ఎంప్లాయి. ఇతడికి భార్య,ఒక కూతురు ఉంది. శుక్రవారం ఉదయం చాతిలో నొప్పి రావడంతో ఇంటి నుంచి బైక్ పై ఒంటరిగా గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఓపి చిట్టి తీసుకున్నాడు.
ఓపీ బిల్డింగ్ లోని ఫస్ట్ ప్లోర్ లోని కార్డియాలజీ వైద్యుడిని సంప్రదించగా అతనికి ఈసీజీ తీసుకొని రమ్మని చెప్పాడు. ఈసీజీ చేయించుకొని, రిపోర్ట్ తీసుకొని తిరిగి డాక్టర్ వద్దకు వచ్చేసరికి క్యూలో చాలా మంది వేచి ఉన్నారు. అప్పటికే విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన నందకిషోర్ తల్లి, భార్య, తమ్ముడు, అతడికి ఛాతి నొప్పి ఎక్కువ కావడం గమనించారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామని వారు అనగా, ఇప్పటికే ఈసీజీ తీసుకున్నానని, డాక్టర్ కు చూపించి, తర్వాత వెళ్దామని చెప్పిన నందకిషోర్ అకస్మాత్తుగా క్యూలైన్ లో నిల్చున్న చోటే కుప్పకూలాడు.
వెంటనే డాక్టర్ వచ్చి పరిక్షించి అప్పటికే అతను మృతి చెందాడని వెల్లడించారు. తీవ్రమైన గుండె నొప్పితో వచ్చిన యువకుడిని ముందుగా పరిశీలించి వెంటనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందించి ఉంటే, అతడు బతికి ఉండేవాడని మృతుడి తల్లి, భార్య విలపించారు. ఈ సంఘటనపై తాము గాంధీ దవాఖాన ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుడు వై శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
