ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..?   గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

On
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..?   గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

డాక్టర్ ను కలిసే లోపే  గుండెపోటుతో క్యూలైన్ లోనే కుప్పకూలి మృతి 
  గాంధీ ఆసుపత్రిలో విషాద ఘటన

సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు) :

ఏ క్షణాన ఏమీ జరుగుతుందో తెలియని రోజులు ఇవి...చాతీలో నొప్పి ఉందంటూ ఓ యువకుడు ఒక్కడే దవఖానకు వచ్చి డాక్టర్ కు చూపించుకునే లోపునే ప్రాణాలు వదిలాడు..వివరాలు ఇవి... బన్సీలాల్ పేట్ డివిజన్ లోని చాచానెహ్రూ నగర్ కు చెందిన జంగిటి నంద కిషోర్ ముదిరాజ్ (37) ప్రైవేట్ ఎంప్లాయి. ఇతడికి భార్య,ఒక కూతురు ఉంది.  శుక్రవారం ఉదయం చాతిలో నొప్పి రావడంతో  ఇంటి నుంచి బైక్ పై ఒంటరిగా గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఓపి చిట్టి తీసుకున్నాడు.

ఓపీ బిల్డింగ్ లోని ఫస్ట్ ప్లోర్ లోని కార్డియాలజీ వైద్యుడిని సంప్రదించగా అతనికి ఈసీజీ తీసుకొని రమ్మని చెప్పాడు. ఈసీజీ చేయించుకొని,  రిపోర్ట్ తీసుకొని తిరిగి డాక్టర్ వద్దకు వచ్చేసరికి క్యూలో చాలా మంది వేచి ఉన్నారు. అప్పటికే విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన నందకిషోర్ తల్లి, భార్య, తమ్ముడు, అతడికి ఛాతి నొప్పి ఎక్కువ కావడం గమనించారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామని వారు అనగా, ఇప్పటికే ఈసీజీ తీసుకున్నానని, డాక్టర్ కు చూపించి, తర్వాత వెళ్దామని చెప్పిన నందకిషోర్ అకస్మాత్తుగా క్యూలైన్ లో నిల్చున్న చోటే కుప్పకూలాడు.

 వెంటనే డాక్టర్ వచ్చి పరిక్షించి  అప్పటికే  అతను మృతి చెందాడని వెల్లడించారు. తీవ్రమైన గుండె నొప్పితో వచ్చిన యువకుడిని ముందుగా పరిశీలించి వెంటనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందించి ఉంటే, అతడు బతికి ఉండేవాడని మృతుడి తల్లి, భార్య  విలపించారు. ఈ సంఘటనపై తాము గాంధీ దవాఖాన ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకుడు వై శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

Tags

More News...

Local News 

ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..?   గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..?   గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు డాక్టర్ ను కలిసే లోపే  గుండెపోటుతో క్యూలైన్ లోనే కుప్పకూలి మృతి     గాంధీ ఆసుపత్రిలో విషాద ఘటన సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు) : ఏ క్షణాన ఏమీ జరుగుతుందో తెలియని రోజులు ఇవి...చాతీలో నొప్పి ఉందంటూ ఓ యువకుడు ఒక్కడే దవఖానకు వచ్చి డాక్టర్ కు చూపించుకునే లోపునే ప్రాణాలు వదిలాడు..వివరాలు ఇవి... బన్సీలాల్...
Read More...
Local News  State News 

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ... రైలు ఎక్కబోయి జారి పడి...నవ వరుడు మృతి    విషాదంగా ముగిసిన గోవా టూర్... సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు) : మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ప్రస్తుత రోజుల్లో అయితే రాత్రి పడుకున్న మనిషి, ఉదయం లేస్తాడో లేడో కూడా నమ్మకం లేదు. ఇలానే కొత్తగా పెళ్లైన ఓ జంట రైలులో హనుమూన్ కు...
Read More...
Local News 

మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి    సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజా మంటలు):  ఖమ్మం జిల్లాలో కల్లూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న హరితపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని ఇట్టి సంఘటనను ప్రతి ఒక్కరు ఖండించాలని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు. మెట్టుగూడలో  ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్  -  ఈద్గాలు, మసీదుల  వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్   -  ఈద్గాలు, మసీదుల  వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  జగిత్యాల జూన్ 7 ( ప్రజా మంటలు) జిల్లాలో ఈద్గాలు, మసీదుల  వద్ద  బక్రీద్ ప్రార్థనలు  ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   తెలిపారు. జిల్లా కేంద్రం తో పాటు కోరుట్ల ,మెట్ పల్లి లో గల పలు ఈద్గా ల వద్ద  జరుగుతున్న ప్రార్థనలు  ఎస్పి  స్వయంగా పరిశీలించారు. ఈద్గా, మసీదుల...
Read More...
Local News 

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద  ఔషధం

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద  ఔషధం సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు): పద్మారావునగర్‌లోని డా. సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో రేపు  ఆదివారం మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధి ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాల నుంచి  ప్రజలకు ఆస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు....
Read More...
Local News 

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి 

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి  గొల్లపల్లి జూన్ 07 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె లో  చిన్నారులు చదువుతో పాటు ఇతర క్రీడారంగాల్లోనూ రాణించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని బి బి కే ఫౌండర్ బొమ్మన కుమార్  ఆధ్వర్యంలో యువతకు సీజన్ 2, మహిళలకు ఆట పాటల పోటీలు నిర్వహించడంతోపాటు, చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపు తల్లిదండ్రులు...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా ఇబ్బందులు పడ్డ పేషంట్లు    విద్యుత్ సమస్య కారణమన్న అధికారులు సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో పేషంట్లు, వారి సహాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిలిచిపోయిన నీటి సరఫరా శనివారం సాయంత్రం వరకు ఇంకా పునరుద్దరించబడలేదు. గాంధీలోని పంపుహౌజ్ కు సంబందించిన విద్యుత్ లైన్ లో...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత  ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జగిత్యాల జూన్ 07 (ప్రజా మంటలు) : ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని,ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందని, వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు....
Read More...
Local News 

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది సికింద్రాబాద్ జూన్ 07 (ప్రజామంటలు) :   నిర్బంధంగా కాకుండా చిన్నారులకు ఆట, పాటలతో చదువును చెబితే , చక్కటి ఫలితాలు వస్తాయని కృష్ణవేణి గ్రూప్ చైర్మన్ సంగని రాజు అన్నారు. శనివారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేటీఎస్–కిడ్జ్ ప్లే స్కూల్ ను ఆయన ప్రారంభించారు. అధునాతన
Read More...
Local News 

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 6: రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి...
Read More...
Local News  State News 

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే...
Read More...
Local News 

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం...
Read More...