చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

On
చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

 జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)

*ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్*

 యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ  వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే.రామ కృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ లతో కలిసి ధాన్యం కొనుగోలు పై    జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
 రైతులు పండించిన ప్రతి గింజ మద్దతు ధర పై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని,  మన దగ్గర రికార్డ్ స్థాయిలో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు జరిగిందని, ప్రభుత్వం దాదాపు 17 వేల కోట్ల ఖర్చు చేస్తూ 70 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తుందని , వీటికి అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని అన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసిన 48 గంటల్లో రైతులకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని అన్నారు.  భారీ స్థాయిలో కొనుగోలు జరుగుతున్నప్పటికీ మీడియా లో సరిగ్గా కవర్ కావడం లేదని అన్నారు. పత్రికలలో వచ్చే నెగటీవ్ వార్తల స్పందించాలని, తప్పుడు వార్తలను తీప్పికొట్టాలని సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని అన్నారు. 

రాబోయే 15 రోజులలో కొనుగోలు కేంద్రాలకు  ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 


జనవరి 26, 2025 తరువాత మన రాష్ట్రంలో నూతనంగా 1,57, 467 రేషన్ కార్డులను పంపిణీ చేశామని, వీటి ద్వారా 16 లక్షల 67 వేల 936 మంది ప్రజలకు అదనంగా రేషన్ అందుతుందని మంత్రి తెలిపారు.  మీసేవ కేంద్రాలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయాలని మంత్రి తెలిపారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని,  ప్రభుత్వా నిబంధనల ప్రకారం కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా యాసంగి పంట కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెగ్యులర్ గా కలెక్టర్లు తనిఖీ చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ, 
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 70 వేల 477 మంది రైతుల నుంచి  49 .53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8 వేల 42 కోట్లు మద్దతు ధర కింద చెల్లించామని అన్నారు.

ప్రతి రోజు అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను 
పర్యవేక్షిస్తున్నామని అన్నారు. మే నెలాఖరు నాటికి పకడ్బందిగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. వార్తా పత్రికలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. 

ధాన్యం రవాణా కు వాహనాల ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఆర్.టి.ఓ , పోలీస్ అధికారులు సమన్వయంతో ఖాళీగా ఉన్న లారీలను పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలుకు కేటాయించాలని అన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్ లోడింగ్ ఆలస్యం కాకుండా చూడాలని, హమాలీల కొరత ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు. 

గత ఆరు నెలల కాలంలో రేషన్ తీసుకోకపోవడం, ఇతర రాష్ట్రాలకు చెందిన డూప్లికేట్ బెనిఫిషరీ, చనిపోయిన వారి పేర్లు ఉండటం వంటి వివిధ కారణాల వల్ల భారత ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 96 వేల 240 రేషన్ కార్డుల పరిధిలోని లక్షా 62 వేల 777 మందు లబ్ధిదారులు అనుమానాస్పదంగా ఉన్నారని, జిల్లాల వారీగా సంబంధిత జాబితా అందించామని, వీటిపై విచారణ చేసి వివరాలు సమర్పించాలని కలెక్టర్ లకు సూచించారు. 

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, కోపరేటివ్ అధికారులు  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో  పుణ్యశ్లోక లోకమాత రాణి  అహల్యబాయి హోల్కర్  300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు...
Read More...
Local News 

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు...
Read More...
State News  Spiritual  

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి    ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు  (రామకిష్టయ్య సంగనభట్ల...          9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి...
Read More...
Local News  State News 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. .(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో   జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి తెలంగాణ...
Read More...
Local News 

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు* *   తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు డి. దుర్గ ప్రసాద్ జగిత్యాల మే 16(ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు. జగిత్యాల అర్బన్...
Read More...
Local News 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు *ఈరోజు వేడుకలు ప్రారంభం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ  విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో  దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా...
Read More...
Local News 

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ సికింద్రాబాద్ మే16 (ప్రజామంటలు): జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఎంటమాలాజీ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ బోయిగూడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచుకోవద్దని, డెంగ్యూ దోమలతో కలుగు ప్రాణాంతకమైన జబ్బుల గురించి స్థానికులకు వివరించారు. ప్రతివారం ఒకరోజు డ్రై డేగా పాటించి ఇంటి పరిసరాల్లో ఉన్న నిల్వ నీటిని...
Read More...
Local News 

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు - భోలక్ పూర్ లో ఉచిత వైద్య శిభిరం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా వైద్యం పొందాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు అన్నారు. శుక్రవారం జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, కిమ్స్...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం అభా ఐడి తో రోగుల రికార్డులు డిజిటల్ నమోదుపై అధ్యయనంస్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపి పై ఆరా... సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ఆయుష్మాన్ భారత్(అభా) డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో భాగంగా, 18 రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రల  నోడల్ అధికారులు శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.సికింద్రాబాద్ గాంధీ...
Read More...
Local News 

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల మే 16  (ప్రజా మంటలు)2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను SC/ST/BC/OC/MINORITY విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (ఉపకార వేతనములు) లకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025. 2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి SC/ST/BC/OC/MINORITY విద్యార్థులు అన్ లైన్...
Read More...
Local News 

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి      జగిత్యాల మే 16 (ప్రజా మంటలు) *ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్*   యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ  వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శుక్రవారం...
Read More...
Local News 

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)   బుగ్గారం మండల కేంద్రంలో శనివారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జరుగనున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జిల్లా ఎస్పీ అశోక్...
Read More...