గాంధీలో తాగునీటి ప్లాంట్ ప్రారంభం
సికింద్రాబాద్, జూన్ 09 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రిలో పేషంట్ల కోసం మంచుకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధి చేసిన మంచినీటి ప్లాంట్ ను సోమవారం సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, మంచుకొండ ఫౌండేషన్ ట్రస్టీ ఎం.వరుణ్ కుమార్ లు ప్రారంభించారు. ఆరు 300 లీటర్ల ప్లాంట్ లు, ఇరవై వంద లీటర్ల వాటర్ కూలర్లను తమ ఫౌండేషన్ ద్వారా సమకూర్చినట్టు మంచుకొండ వరుణ్ కుమార్ తెలిపారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా తమ ఫౌండేషన్ తీసుకున్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. రోగులకు శుద్ధిచేసిన మంచినీటి వసతి కల్పించిన మంచుకొండ ఫౌండేషన్ సంస్థ సేవాభావాన్ని అభినందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి శేఖర్ రావు, ఆర్ఎంఓ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ నవీన్, అడ్మిన్ మేనేజర్ శివరామి రెడ్డి, మంచుకొండ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, సిబ్బంది మల్లేష్, సతీష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా డా.కోట నీలిమ నియామకం

గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో

గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం

బల్కంపేట అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు

ప్రజల రుణం తీర్చుకుంటా - రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి జీవిత ఖైదు మరియు రూ 17000 /- జరిమాన. బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.

ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ సభ్యుల చే ఎమ్మెల్యేకు వినతి

మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్

ప్రపంచ వ్యాప్తంగా ChatGPT సేవలకు అంతరాయం
.jpeg)
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ - బస్సు పాస్ ధరల పెంపుకు నిరసనగా మెరుపు ధర్నా

ఇందిరమ్మ ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులచే స్మశాన వాటిక స్థలానికై ఎమ్మెల్యేకు వినతి

40 వార్డులో బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్
