రాష్ట్ర మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబరాలు 

On
రాష్ట్ర మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబరాలు 

ధర్మపురి /గొల్లపల్లి జూన్ 08 (ప్రజా మంటలు):


కాంగ్రెస్ పార్టీలో1986 లో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఎదిగి సోమవారం రాష్ట్ర గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేయడం చూస్తుంటే ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం క్యాబినెట్ విస్తరణ జరిపిన నేపథ్యంలో రాష్ట్రం మంత్రివర్గంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, సీనియర్ కాంగ్రెస్ నేత, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వరించింది.సోమవారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ చే మంత్రిగా లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను అంటూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు.విద్యార్థి దశలో 1986-1994 ఎన్ ఎస్ యు ఐ నాయకుడిగా,1996 -2001వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా పని చేసిన  లక్ష్మణ్ కుమార్ 2006లో ధర్మారం జెడ్పీటీసీ గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ గా,ఉమ్మడి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు.2009 నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉప ఎన్నికల్లో  పోటీ చేశారు.2014 స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2018 ఎన్నికల్లో  టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను ఓటమి అంచుల వరకు తీసుకువెళ్లి విజయం సాధించినా,నాటి అధికార ప్రభుత్వ ఒత్తిడికి అధికార యంత్రాంగం సాంకేతిక  తదితర కారణాలు చూపెడితే లక్ష్మణ్ కుమార్ ఓడినట్టు ప్రకటించారు.

తమ ఓటమిని సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాలతో ఈవీఏంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి ఆదేశించింది.నాటి ప్రభుత్వ యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ తాళం కీ లేవు అనడంతో హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు.ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు అందులో ఉండాల్సిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో అప్పటి కలెక్టర్ ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధి ఈ సంఘటనపై విచారణ జరిపారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి, కొప్పుల ఈశ్వర్ పై ఇరవై రెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు.లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కొనసాగుతుండగా అనూహ్యంగా రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Tags

More News...

Local News 

ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జగిత్యాల జూన్ 11( ప్రజా మంటలు) జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా ముగిశాయి. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశక,  కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం వేణుగోపాల ఆచార్య భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయాలు...
Read More...
Local News 

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్ వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) : “లోక్ అదాలత్ కోర్టు కాదు... రాజీ ద్వారా న్యాయం”, “కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు” అంటూ ప్రజలకు వినూత్నంగా సందేశం ఇచ్చింది వేలేరు పోలీస్ శాఖ. ఈ నెల 14న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా, ప్రజలు – ముఖ్యంగా కేసులున్న...
Read More...
Local News 

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ   జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు)  పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళ భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడే లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారము తాళాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులను అమ్మవారికి చెందిన పలు పుస్తెలు మట్టెలు అపహరించారు. హుండీ తాళం తెరువ...
Read More...
Local News 

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన సికింద్రాబాద్, జూన్ 11 ( ప్రజామంటలు): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-కూకట్పల్లి విభాగ్, సికింద్రాబాద్ జిల్లా, ఎస్ ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు...
Read More...
Local News 

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్ కార్పొరేటర్ కంది శైలజ సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు): క్రమశిక్షణతో కూడిన చదువు పిల్లల భవిష్యత్ను ఉజ్వల మయం చేస్తుందని, రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాద్యాయుల పాత్ర ఎంతో గొప్పదని సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ అన్నారు. బుధవారం వారాసిగూడ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ ఇండో...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ పలు అభివృద్ది పనుల పరిశీలన సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి,గాంధీ మెడికల్ కాలేజీ లో బుధవారం డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ పర్యటించారు. శనివారం గాంధీ ఆసుపత్రిలో నీటి పంపింగ్ నిలిచిపోవడం వల్ల రోగులకు కలిగిన ఇబ్బందులను తెలుసుకుని, దాని పరిష్కారం కోసం చేపట్టిన అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు పనులను...
Read More...
Local News 

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య. గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి 500 టాయిలెట్స్    సికింద్రాబాద్ జూర్ 11 (ప్రజామంటలు) : గత కొంతకాలంగా గాంధీ ఆసుపత్రి లో ప్రధాన సమస్యగా ఉన్న పేషంట్లు, వారి సహాయకుల టాయిలెట్స్ సమస్య ఎట్టకేలకు  తీరింది. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్ పేషంట్ వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. నిరుపేద రోగులకు మరింత...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాల జిల్లా కేంద్రానికి  విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్  జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు మొదటిసారి రాగా మొక్కను అందజేసి,గజమాల తో ఘన స్వాగతం పలికిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  పాల్గొన్న కోరుట్ల...
Read More...
Local News 

వినియోగదారుల సమస్యల  సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

వినియోగదారుల సమస్యల  సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు మెట్పల్లి జూన్ 11 (ప్రజా మంటలు) అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్...
Read More...
Local News 

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం 

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం  గొల్లపల్లి జూన్ 11 (ప్రజా మంటలు) : గొల్లపల్లి మండల కేంద్రంలోని  ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు గొల్లపల్లి మండలంకు సంబంధించిన 389 మందికి మంజూరు పత్రాల పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్,జిల్లా ఆర్డీవో తో కలిసి పాల్గొని...
Read More...
Local News 

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు గొల్లపల్లి, జూన్ 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివిధ సిబ్బందికి వేరువేరు రకాల ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.గొల్లపల్లి మండల కేంద్రంలో వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (స్కావెంజర్) లకు ఒక రోజు ఓరియంటేషన్...
Read More...
Local News 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.  

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.   జగిత్యాల జూన్ 11: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధించిన శాఖలకు నోట్ జారీ చేయాలని కోరుతూ  తెలంగాణ ఉద్యోగుల జేఏసీ  బృందం  రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్  ఆధ్వర్యంలో  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,కోమటి వెంకట్ రెడ్డి లను  హైదరాబాద్ లో కలిసి కోరినట్లు తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్...
Read More...