దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు
సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) :
దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి త్వరితగతిన ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్యపద్ధతులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభం అయ్యాయి. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్ క్లినిక్లో శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్వెన్షన్ ప్రొసీడర్స్ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్ఎన్ రాజకుమారి, అనస్టీషియా హెచ్ఓడీ ప్రొఫెసర్ ఆవుల మురళీధర్లు తెలిపారు. అడ్వాన్స్డ్ వైద్య యంత్రాలైన ఆల్ట్రాసౌండ్, రేడియోఫ్రీక్వెన్సీ మెషిన్ల ద్వారా వైద్యసేవలు అందించగా బాధితులు కోలుకుంటున్నారని వివరించారు.
ఒకరు తీవ్రమైన భుజం నొప్పి(ప్రొజన్ షోల్డర్), మరో ఇద్దరు కీళ్ల నొప్పులు ( క్రానిక్ నీ ఆర్ధరైటీస్)తో కొన్నేళ్లుగా బాధపడుతున్నారని, గాంధీ పెయిన్ క్లినిక్కు రాగా ఇంటర్వెన్షన్ ప్రొసీడర్స్ ద్వారా వైద్యచికిత్సలు అందించామని, ఈ వైద్యవిధానంలో కేవలం ఇంజక్షన్లు మాత్రమే వినియోగిస్తామని, ఆపరేషన్లు ఉండవని వివరించారు. దీర్ఘకాల, మొండి నొప్పులకు ఈ వైద్యవిధానం ఎంతో ఉపయుక్తమన్నారు. ఈ రకమైన చికిత్సలకు ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు వసూలు చేస్తారని, గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామని తెలిపారు.
గాంధీ ఓపీ విభాగంలో సోమవారం నుంచి శనివారం వరకు పెయిన్ క్లినిక్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అనస్టీషియా వైద్యులు, వైద్యవిద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్
