ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్
జగిత్యాల జూన్ 6:
రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి సభ్య కమిటీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.ఉద్యోగులకు,పెన్షనర్లకు 2 డి.ఏ
లు ఒకటి తక్షణమే,రెండోది 6మాసాల్లో ఇవ్వనుందన్నారు.ఇదే కాకుండా ఉద్యోగుల,పెన్షనర్ల పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెలా రూ.700 కోట్లకు తక్కువ కాకుండా క్లియర్ చేసేందుకు అంగీకారాన్ని తెలిపిందన్నారు.ఉద్యోగుల,పెన్షనర్ల హెల్త్ స్కీం కోసం ట్రస్టు ను ఏర్పాటు చేయాలనే టీ.ఈ.జేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని,ఆ మేరకు మెరుగైన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించారన్నారు.
ఎన్నికల సమయంలో బదిలీ అయిన అధికారులను,తిరిగి సొంత జిల్లాలకు బదిలీలకు ఒప్పుకున్నారన్నారు.పెన్షనర్ల పెండింగ్ ప్రయోజనాల ను ముందస్తుగా వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ను కోరారు.ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు వేల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,కే.సత్యనారాయణ,నారాయణ,పబ్బా శివానందం,రాజ్ మోహన్,బి.రాజేశ్వర్,వి.ప్రభాకర్ రావు,దేవేందర్ రావు,విజయ లక్ష్మి,కరుణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
