బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు)
బక్రీద్ పండగ ను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. ఈనేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ తరపున భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ,మసీదులు, మార్కెట్ ప్రాంతాలు,టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్స్ ను జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా పరిశీలించి భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండగను అందరూ కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని దీని కోసం పోలీస్ శాఖ అవసరమైన భద్రతాయపరమైన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ నందు పోలీసు సిబ్బంది తో 24 గంటలు వాహనాల తనిఖీలు చేపట్టి పశువుల అక్రమ రవాణా జరగకుండా విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలియజేశారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన ,ఫార్వార్డ్ చేసిన వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్. ఐ కిరణ్ కుమార్, మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
