కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత
ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల జూన్ 07 (ప్రజా మంటలు) :
ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని,
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందని, వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం జగిత్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు.
ఉద్యోగుల కు పెండింగ్ లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డీఏ విదిల్చారని.. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
