గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా
ఇబ్బందులు పడ్డ పేషంట్లు
విద్యుత్ సమస్య కారణమన్న అధికారులు
సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు):
గాంధీ ఆసుపత్రిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో పేషంట్లు, వారి సహాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిలిచిపోయిన నీటి సరఫరా శనివారం సాయంత్రం వరకు ఇంకా పునరుద్దరించబడలేదు. గాంధీలోని పంపుహౌజ్ కు సంబందించిన విద్యుత్ లైన్ లో సమస్యలు ఏర్పడటంతో నీరు ఉన్నప్పటికీ ఆసుపత్రి వార్డుల్లోకి నీటి సరఫరా జరగలేదు. దాంతో వార్డుల్లోని వాష్రూమ్స్ లో నీరు లేక పేషంట్లు, వారి సహాయకులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగడానికి కూడ నీరు లేకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోని తాగునీటి కేంద్రాలతో పాటు ఆసుపత్రి బయటకు వెళ్ళి నీరు కొనుక్కున్నారు.
శనివారం బక్రీద్ సెలవు కావడంతో నీటి సరఫరా పునరుద్దరణ పనులు నత్తనడకనా నడిచాయని పలువురు పేషంట్లు, వారి సహాయకులు పేర్కొన్నారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో నీటి సమస్యను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని వారు వాపోయారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
