దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

On
 దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్  జూన్ 07:
తెలంగాణ సోయి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోంది
దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే జాగృతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

వానాకాలం వచ్చినా వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయరా
రేషన్ షాపుల్లో ప్రజలు పడుతోన్న వెతలను తీర్చాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం, స్వాతంత్ర్య సమరయోధుడు దాశరథిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సోయి ఏమాత్రం లేని ప్రభుత్వం తెలంగాణ ను పాలిస్తుండటం విచారకరమన్నారు.

శుక్రవారం దాశరథి ని నిర్బంధించిన ఖిల్లా రామాలయం ను ఆమె సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని రేపటి తరాలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని తాను పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరామన్నారు. అయినా దున్నపోతు మీద వానపడ్డట్టుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. 

జులై 22న దాశరథి గారి శత జయంతి ఉందని.. ఈ రోజు నుంచి ఆయన జయంతి రోజు వరకైనా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాశరథి స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. దాశరథి శత జయంతి ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందో జూలై మొదటి వారం వరకు వేచి చూస్తామన్నారు.IMG-20250606-WA0016 

ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే జులై 21, 22 తేదీల్లో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున దాశరథి శత జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు, ఉద్యమకారులను పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి సందర్భంగా దాశరథి గారిని ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుందని.. తాము మరోసారి ఇదే డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని అన్నారు.చరిత్ర హీనులుగా మిగల వద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు. 

వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ  వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయలేదని, రైతుల అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రేషన్ షాపుల్లో బియ్యం కోసం ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని విస్మరించిందన్నారు.

ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రేషన్ షాపుల్లో పేదలు పడుతోన్న ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు.IMG-20250606-WA0014

దాశరథి గారు నిజాం రాజ్యంలో జరుగుతోన్న అకృత్యాలను ఎండగడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి అని, తన కలం ద్వారా ప్రజలను జాగృతం చేసిన గొప్ప మనిషి అని గుర్తు చేశారు. వట్టికోట అళ్వార్ స్వామి, డాశరథి గారిని ఒకే బరాక్ లో బంధిస్తే "నా తెలంగాణ కోటి రతనాల వీణ " అని దాశరథి, ఇదే ఖిల్లా రామాలయం జైలు నుంచి నినదించారని గుర్తు చేశారు.

ఆ రోజు ఉద్యమ ఆకాంక్షను రగిల్చిన ఈ ప్రాంతాన్ని భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకంగా తీర్చిదిద్దడానికి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని.. ఎమ్మెల్సీ గా తన నిధులు రూ.40 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాశరథి గారి శత జయంతిని గొప్పగా నిర్వహించాలని పలుమార్లు కోరానని.. ఆయన తెలంగాణ వారసత్వ సంపద అని.. ఆయన పోరాట పటిమను, రచనలను గుర్తు చేసుకోవాలని శాసన మండలిలో పదే పదే చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్టుగా ఈ ప్రభుత్వం తీరు ఉన్నది. బిరుదురాజు రామరాజు గారి శత జయంతిని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ జిల్లాకు దాశరథి గారితో ప్రత్యేక అనుబంధం ఉందని.. ఆయనను విస్మరిస్తోన్న ఈ ప్రభుత్వం తీరు తమను కలచి వేస్తోందని అన్నారు.

రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలోని సీతారామాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద  ఔషధం

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద  ఔషధం సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు): పద్మారావునగర్‌లోని డా. సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో రేపు  ఆదివారం మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధి ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాల నుంచి  ప్రజలకు ఆస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు....
Read More...
Local News 

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి 

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి  గొల్లపల్లి జూన్ 07 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని భీమ్ రాజుపల్లె లో  చిన్నారులు చదువుతో పాటు ఇతర క్రీడారంగాల్లోనూ రాణించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని బి బి కే ఫౌండర్ బొమ్మన కుమార్  ఆధ్వర్యంలో యువతకు సీజన్ 2, మహిళలకు ఆట పాటల పోటీలు నిర్వహించడంతోపాటు, చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపు తల్లిదండ్రులు...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా ఇబ్బందులు పడ్డ పేషంట్లు    విద్యుత్ సమస్య కారణమన్న అధికారులు సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రిలో నీటి సరఫరా నిలిచిపోవడంతో పేషంట్లు, వారి సహాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిలిచిపోయిన నీటి సరఫరా శనివారం సాయంత్రం వరకు ఇంకా పునరుద్దరించబడలేదు. గాంధీలోని పంపుహౌజ్ కు సంబందించిన విద్యుత్ లైన్ లో...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత 

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత  ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జగిత్యాల జూన్ 07 (ప్రజా మంటలు) : ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని,ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందని, వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు....
Read More...
Local News 

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది సికింద్రాబాద్ జూన్ 07 (ప్రజామంటలు) :   నిర్బంధంగా కాకుండా చిన్నారులకు ఆట, పాటలతో చదువును చెబితే , చక్కటి ఫలితాలు వస్తాయని కృష్ణవేణి గ్రూప్ చైర్మన్ సంగని రాజు అన్నారు. శనివారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేటీఎస్–కిడ్జ్ ప్లే స్కూల్ ను ఆయన ప్రారంభించారు. అధునాతన
Read More...
Local News 

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 6: రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి...
Read More...
Local News  State News 

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే...
Read More...
Local News 

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం...
Read More...
Local News 

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి  త్వరితగతిన ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్యపద్ధతులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభం అయ్యాయి. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్‌ క్లినిక్‌లో  శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్‌వెన్షన్‌ ప్రొసీడర్స్‌ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఎన్‌...
Read More...
Local News 

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.    రాయికల్  జూన్ 6 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్  బాలికను నిందితుడు  సామల్ల అరవింద్ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు అధికారులు  ఆధారాలు సమర్పించగా పి.పి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను...
Read More...
Local News 

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్              జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు  )                                                                                      జిల్లాలో గల ఈ వీ ఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. అందువలన ఈవీఎం గోడౌన్  సందర్శించడం జరిగిందని తెలిపారు.             కలెక్టర్ వెంట...
Read More...
Local News 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్ జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు) మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు మహిళలను కోటశ్వరులుగా తీర్చి దిద్దే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆయా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్ తెలిపారు. జగిత్యాల రూరల్...
Read More...