దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జూన్ 07:
తెలంగాణ సోయి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోంది
దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే జాగృతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
వానాకాలం వచ్చినా వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయరా
రేషన్ షాపుల్లో ప్రజలు పడుతోన్న వెతలను తీర్చాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం, స్వాతంత్ర్య సమరయోధుడు దాశరథిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సోయి ఏమాత్రం లేని ప్రభుత్వం తెలంగాణ ను పాలిస్తుండటం విచారకరమన్నారు.
శుక్రవారం దాశరథి ని నిర్బంధించిన ఖిల్లా రామాలయం ను ఆమె సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని రేపటి తరాలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని తాను పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరామన్నారు. అయినా దున్నపోతు మీద వానపడ్డట్టుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు.
జులై 22న దాశరథి గారి శత జయంతి ఉందని.. ఈ రోజు నుంచి ఆయన జయంతి రోజు వరకైనా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాశరథి స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. దాశరథి శత జయంతి ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందో జూలై మొదటి వారం వరకు వేచి చూస్తామన్నారు.
ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే జులై 21, 22 తేదీల్లో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున దాశరథి శత జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు, ఉద్యమకారులను పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి సందర్భంగా దాశరథి గారిని ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుందని.. తాము మరోసారి ఇదే డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని అన్నారు.చరిత్ర హీనులుగా మిగల వద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు.
వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయలేదని, రైతుల అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రేషన్ షాపుల్లో బియ్యం కోసం ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని విస్మరించిందన్నారు.
ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రేషన్ షాపుల్లో పేదలు పడుతోన్న ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు.
దాశరథి గారు నిజాం రాజ్యంలో జరుగుతోన్న అకృత్యాలను ఎండగడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి అని, తన కలం ద్వారా ప్రజలను జాగృతం చేసిన గొప్ప మనిషి అని గుర్తు చేశారు. వట్టికోట అళ్వార్ స్వామి, డాశరథి గారిని ఒకే బరాక్ లో బంధిస్తే "నా తెలంగాణ కోటి రతనాల వీణ " అని దాశరథి, ఇదే ఖిల్లా రామాలయం జైలు నుంచి నినదించారని గుర్తు చేశారు.
ఆ రోజు ఉద్యమ ఆకాంక్షను రగిల్చిన ఈ ప్రాంతాన్ని భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకంగా తీర్చిదిద్దడానికి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని.. ఎమ్మెల్సీ గా తన నిధులు రూ.40 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాశరథి గారి శత జయంతిని గొప్పగా నిర్వహించాలని పలుమార్లు కోరానని.. ఆయన తెలంగాణ వారసత్వ సంపద అని.. ఆయన పోరాట పటిమను, రచనలను గుర్తు చేసుకోవాలని శాసన మండలిలో పదే పదే చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్టుగా ఈ ప్రభుత్వం తీరు ఉన్నది. బిరుదురాజు రామరాజు గారి శత జయంతిని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ జిల్లాకు దాశరథి గారితో ప్రత్యేక అనుబంధం ఉందని.. ఆయనను విస్మరిస్తోన్న ఈ ప్రభుత్వం తీరు తమను కలచి వేస్తోందని అన్నారు.
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలోని సీతారామాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్
