మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి
జీవకోటి మనుగడ కోసం ప్రకృతిని సంరక్షించాలి
*గాంధీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు..
సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు) :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని గుడ్డ సంచులను ఉపయోగించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారణకు కృషి, చేయాలి అని కోరారు.
ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో, ఇతర ప్రదేశాల లో మొక్కలు నాటడం తప్పకుండ నిర్వహించాలని సూచించారు.ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు క్యాన్సరు చర్మం , లివర్ సంబంధిత వ్యాధులు రావద్దు అనుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో సాధారణ జీవనశైలిలో గాని శుభకార్యంలో గాని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ కార్యక్రమాల నిర్వహించుకోవాలని కోరారు . మానవాళి మనుగడ కోసం పూర్తి ఆరోగ్యంతో మనం ఉండాలంటే మనం మొక్కలు నాటాలని అందుకే పెద్దలు వృక్షో రక్షతి రక్షితః అని పేర్కొన్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఆసుపత్రి ఆవరణలో వైద్యులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రజని, ఆర్ యం. ఓ లు డా. కళ్యాణ్ చక్రవర్తి, డా.యోగి, డా. సరిత, డా.శ్రీనివాస్, డా.బ్రహ్మ, డా.వంశీ, డా. నాజిం డా.నవీన్, డా.సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
