పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత
రాచకొండ యాదగిరి బాబు,బిజెపి జిల్లా అధ్యక్షులు
గొల్లపల్లి జూన్ 05 (ప్రజా మంటలు ):
నానాటికి పెరిగిపోతున్న భూతాపం వల్ల తరచుగా అనావృష్టి అతివృష్టిలు ఏర్పడుతున్నాయని, అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రాచకొండ యాదగిరి బాబు కోరారు.
జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం విద్యానగర్ ఆవరణలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ అభియాన్ జిల్లా కన్వీనర్ కస్తూరి సత్యం, కో కన్వీనర్ సత్యనారాయణ తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాచకొండ యాదగిరి బాబు గారు మాట్లాడుతూ, అనంత కోటి విశ్వంలో జీవరాశులు మనుగడ సాధించేందుకు అనుకూలమైనది భూగ్రహం మాత్రమేనని అన్నారు.
ఆధునిక మానవుడు తన మనుగడ కోసం చేస్తున్న పారిశ్రామీకరణ ద్వారా కర్బన ఉద్గారాలు పెరిగి గ్లోబల్ వార్మింగ్ కు కారణం అవుతున్నాయని వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు
భూతాపం తగ్గించడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేసి ఎన్ని చర్యలు తీసుకున్నను స్వచ్ఛంద సంస్థలు దేశ పౌరుల ప్రమేయం లేకుండా వాటి ఫలితాలు సాధించలేమని అందుకే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పేర్కొన్నారు
పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీకు వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుందని వీటి ద్వారా, పరిమిత నీటి వినియోగం చెట్లు నాటడం విత్తన బంతులు విసరడం సాంప్రదాయేతర ఇంధన వరులను ఉపయోగించడం లాంటి విషయాలపై దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తామని పర్యావరణ పరిరక్షణ అభియాన్ జిల్లా కన్వీనర్ కస్తూరి సత్యం అన్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ నలవల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు అనుమల్ల క్రిష్ణహరి, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగారం, జిల్లా కోశాధికారి సుంకేటదశతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మరి పెళ్లి సత్యం, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల మండల అధ్యక్షులు ఇట్నేని రమేష్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, మాజీ కౌన్సిలర్ కాయితి శంకర్, జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు, ఓబీసీ జిల్లా కార్యదర్శి పుప్పాల ప్రభాకర్, జున్ను రాజేందర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, కందుకూరి నారాయణ సిరికొండ రాజన్న, పట్టణ ఉపాధ్యక్షులు బైరి రాజేందర్, పవన్ సింగ్, మహిళా నాయకురాల్లు పుష్ప రెడ్డి, మధురిమ, భానుప్రియ, సోమలక్ష్మి, మ్యాకల లక్ష్మి, ఇట్యాల రాము, తిరుపురం రామ్ రామచంద్రం, జున్ను సంతోష్, మరిపెళ్లి సాగర్, భారతపు లింగరెడ్డి, కల్లెడ జగన్, కిషోర్, ఉమాపతి, నారాయణ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత
