గాంధీ లో డైట్ క్యాంటీన్ నిర్వహణపై అధికారుల సమీక్ష
నాణ్యమైన ఫుడ్ సప్లయి పై అధికారుల సంతృప్తి
మరింత మెరుగైన సేవలకై సూచనలు, సలహాలు..
సికింద్రాబాద్ జూన్ 04 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్గాంధీఆస్పత్రిలోని పేషంట్లు, డ్యూటీ డాక్టర్లకు డైట్క్యాంటిన్ద్వారా క్వాలిటీతో కూడిన పరిశుభ్రమైన ఆహార పదార్ధాలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్.సీహెచ్.ఎన్ రాజకుమారి తెలిపారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కలుషిత ఆహారంతో ఓ రోగి మృతి, మరికొంతమంది అస్వస్థతకు గురైన నేపధ్యంలో గాంధీఆస్పత్రి అధికారులు అప్రమత్తమై, సిబ్బందితో సమావేశమయ్యారు. డైట్క్యాంటిన్తోపాటు ఆహార పదార్ధాల సరఫరా, సిబ్బంది పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు సలహాలు, సూచనలు అందించారు. గతంలో గాంధీ ప్రధాన భవనం సెల్లార్లో డైట్కిచెన్ఏర్పాటు చేయగా, మురుగు, పందికొక్కులు, బొద్ధింకలతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటి వైద్యమంత్రులు, ఉన్నత వైద్యశాఖాధికారులు, జిల్లా కలెక్టర్లు పలుమార్లు సందర్శించి నూతన డైట్భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపగా, గత ప్రభుత్వం సుమారు రూ. 1.50 కోట్ల నిధులు కేటాయించడంతో గాంధీ అత్యవసర విభాగం వెనుక నూతన డైట్భవన నిర్మాణాన్ని చేపట్టి అందుబాటులోకి తేవడంతో దశాబ్ధాల సమస్య పరిష్కారమైంది. గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్. రాజకుమారి, చీఫ్ డైటీషియన్రమేష్, ఆర్ఎంఓ–1 శేషాద్రిల నేతృత్వంలో డైట్ నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.
డైట్కిచెన్లో మరెక్కడా లేని విధంగా లక్షలాది రూపాయల వ్యయంతో డైట్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వహకులు తామే సొంతంగా రైస్ కుక్కర్స్, రోటీ మేకర్, బ్రెడ్మేకర్, బ్రెడ్కట్టర్, పల్లిపట్టి మేకర్, హైజెనిక్బాయిలర్రైస్వెజల్స్వంటి అత్యాధునిక యంత్ర పరికరాలను సమకూర్చడం గమనార్హం. కూరగాయలు, ఇతర నిత్యవసర వస్తువులు పాడవకుండా భధ్రపరిచేందుకు కోల్డ్స్టోరేజీ నిర్మించారు. పేషంట్లకు త్వరితగతిన కోలుకునే అంశంలో భుజించే ఆహార పదార్ధాలు కీలకమని గాంధీ చీఫ్డైటీషియన్రమేష్స్పష్టం చేశారు. నిరుపేద రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని డైట్నిర్వహణ సంస్థ శ్రీ వెంకటేశ్వర అసోషియేషన్ప్రతినిధి రవికుమార్తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
