సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ
టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం - యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం
సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత
సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణిని అంతం చేయాలని చూస్తోంది
కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందజేయాలి
సింగరేణి డీఎంఎఫ్ టీ నిధులను ప్రభుత్వం కొడంగల్, మధిర నియోజకరవర్గాలకు తరలించింది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మే 27:
సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు.
సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తుంటే వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు.
సింగరేణి స్కూళ్లను పునరుద్దరించి సీబీఎస్ఈ సిలబస్ లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టుల్లో ఎస్ డీ ఎల్ వెహికిల్స్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్ల తో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్టుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు.
వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్ టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ గారి నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 వేల కోట్లతో ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే రూ.9 వేల కోట్లకు పెంచిందని అంటే సంస్థను తమ అవినీతితో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో దెబ్బతీయాలని చూస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఎక్స్ ప్లోజివ్స్ టెండర్లలోనూ భారీ అక్రమాలకు పాల్పడ్డారని, ఏకంగా టెండర్ ను మూడు రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు జీఎం స్థాయిలో చేస్తారని.. సీఎం తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్ కు పిలిపించి అపాయింట్ మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న మారు పేర్ల సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి తరుపున సింగరేణి జాగృతి ఉద్యమిస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు సింగరేణి అంటే తమ ప్రయోజనాలు మాత్రమేనని.. కార్మికులకు ఆ సంస్థే జీవితమని అన్నారు. వారందరి తరుపున తాము పని చేస్తామన్నారు. కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల వరకు వచ్చి కూర్చొంటానని హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
జాగృతి ఏరియా కో ఆర్డినేటర్ల నియామకం
1) బెల్లంపల్లి – కిరణ్ ఓరం
2) శ్రీరాంపూర్ – కుర్మ వికాస్
3) మందమర్రి – ఎస్. భువన్
4) రామగుండం1 – బొగ్గుల సాయికృష్ణ
5) రామగుండం 2 – కె. రత్నాకర్ రెడ్డి
6) రామగుండం 3 – దాసరి మల్లేశ్
7) భూపాలపల్లి – నరేశ్ నేత
8) మణుగూరు – అజ్మీరా అశోక్ కుమార్
9) కొత్తగూడెం – వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్
10) కార్పొరేట్ – వసికర్ల కిరణ్ కుమార్
11) ఎస్ టీపీపీ పవర్ ప్లాంట్ – కె. రామ్మోహన్ చారి
More News...
<%- node_title %>
<%- node_title %>
పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన పాల్గొన్న జిల్లా కలెక్టర్
