పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది
మీడియా ప్రభావం - వార్త వేసిన 24 గంటల్లో....
దారికి అడ్డంగా ఉన్న గోడను కూల్చివేసిన హైడ్రా
*ఏడాదిగా దొరకని పరిష్కారం...24 గంటల్లో అయింది...
సికింద్రాబాద్ మే 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్లోని చిలకలగూడ దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దారికి అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. సోమవారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కార్యాలయం ఎదుట ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి సీఎం గారు....! మా బడికి బాట వేయించండి.. అంటూ ప్లకార్డు పట్టుకుని ధర్నాకు దిగిన వార్త మీడియాలో ప్రసారం కావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ ఆదిత్య క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ పాఠశాలకు వెళ్లే మార్గంలో అక్కడి నివాసితులు దారికి అడ్డంగా గోడను నిర్మించినట్లు, .దీంతో విద్యార్థులు స్కూల్ కు వెళ్లడానికి పక్కనే ఉన్నచిన్నపాటి గల్లి నుంచి వస్తున్నట్లు గుర్తించారు. విద్యార్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను దారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు. జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్రావుతో పాటు సిబ్బంది కూడా ఉండి అడ్డు గోడ తొలగింపు పనులను పర్యవేక్షించారు.
ప్రహరీ గోడతొలగించిన చోట గేటు కూడ ఏర్పాటు చేస్తామని జోనల్ కమిషనర్ రవి కిరణ్వెల్లడించారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి, స్కూల్ కు దారిని కల్పించిన ముఖ్యమంత్రి, హైడ్రా, జీహెచ్ఎమ్సీ అధికారులతో పాటు మీడియాకు హెడ్మాస్టర్ మల్లికార్జున్ రెడ్డి, స్డూటెంట్స్ పేరేంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
