జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

On
జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్
 ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు...

సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):

 జీహెచ్ఎంసీ  సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్  పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.  సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు  రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు  శుక్రవారం  ఆయన కార్యాలయం, ఇంటిపై ఒక కాలంలో దాడులు నిర్వహించారు.

 ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన  వెంకట్ రావు అనే వ్యక్తి   జీహెచ్ఎంసీ అనుమతి పొంది రెండు బిల్డింగుల నిర్మాణం చేశాడు. అయితే  ఈ బిల్డింగులకు ఎన్ఓసీ కోసం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్  సిటీ ప్లానర్  విఠల్ రావు కు దరఖాస్తు పెట్టకున్నాడు. దీనిపై విఠల్ రావు ఈ రెండు భవనాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి బిల్డింగు నిర్మాణంలో చిన్న చిన్న డీవియేషన్లు ఉన్నాయి... వాటిని సరిచేసుకుని వస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఒక్కో బిల్డింగుకు రూ.4లక్షల చొప్పున రూ.8లక్షలు ఇస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పాడు. దీంతో అంత  డబ్బు తాను ఇచ్చుకోలేనని, రూ.4 లక్షలు  ఇస్తానని  వెంకట్ రావు చెప్పాడు.

IMG-20250523-WA0002

అదేమీ కుదరదు రూ.8లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే ఎన్ఓసీ ఇవ్వడం కుదరదని విఠల్ రావు తేగేసి చెప్పాడు. దీంతో వెంకట్రావు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. మల్కాజిగిరి సఫిల్ గూడ  చెరువు వద్దకు ప్రభుత్వ వాహనంలో వచ్చిన విఠల్ రావు అందులోనే కూర్చుని రూ.4లక్షలు తీసుకున్నాడు. తరువాత ఎన్ఓసీ ఇవ్వకుండా తిప్పుకోవడం మొదలు పెట్టాడు. మిగిలిన రూ.4 లక్షల కోసం  వెంకటరావు పై ఒత్తిడి తీసుకువచ్చాడు.అయితే మిగతా డబ్బులు  ఇవ్వకపోవడంతో వెంకటరావు భవన నిర్మాణ అనుమతుల ఎన్ఓసీ ఫైళ్లను తిరస్కరించాడు. దీంతో వెంకట్ రావు  ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అసిస్టెంట్ ప్లానర్ విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు.

 సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విఠల్ రావు చాంబర్ లో  సోదాలు నిర్వహించారు. మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు కోఠి సుల్తాన్ బజారులో విఠల్ రావు  ప్రైవేట్ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఈ మూడు ప్రాంతాలల్లో సోదాలు చేపట్టారు.రెండు భవన నిర్మాణాల అనుమతుల కోసం   రూ. 8 లక్షలు డిమాండ్ చేసి  రూ.4క్షలు తీసుకున్నట్లు నిర్దారణ అయిందని ఏసీబీ డీఎస్సీ  శ్రీధర్ తెలిపారు. విఠల్ రావు సంపాదనకు మించి  అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. విఠల్ రావు  సంపాదించిన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి విలువ  ఎంత .? తదితర విషయాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ  అధికారులు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు లంచం అడిగితే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags

More News...

National  International  

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ ఆందోళనలో ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలు న్యూ ఢిల్లీ జూలై 30: సుంకాల ఆందోళనలపై రూపాయి విలువ 87/USD కంటే తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకునే అవకాశం ఉందిభారత ఎగుమతులపై అమెరికా అధిక సుంకాల రేటు విధించే అవకాశం ఉందనే ఆందోళనలతో భారత రూపాయి బుధవారం మార్చి మధ్యకాలం నుండి దాని బలహీన స్థాయికి...
Read More...
Local News 

వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

వానాకాలం  స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్.. పద్మారావునగర్ పార్కులో దోమల వ్యాప్తిపై అవేర్నెస్   సికింద్రాబాద్, జూలై 30 (ప్రజామంటలు): దోమల వ్యాప్తి, కాటు వలన కలుగు ఆనారోగ్య సమస్యలు, దోమల నివారణ అంశాలపై పద్మారావునగర్ పార్కులో వాకర్స్ కు జీహెచ్ఎమ్సీ ఎంటమాలజీ సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం...
Read More...
Local News 

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో, మున్సిపాలిటి అనేది ఒకటి ఉన్నదని ప్రజలు మర్చిపోయే పరిస్థితి, జగిత్యాల మున్సిపాలిటీలో కమీషనర్, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆఫీసులో మూమెంట్ రిజిష్టర్ ఎక్కడుందో తెలియదని,. ఉన్న దాంట్లో...
Read More...
Local News 

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు): జాతీయ లీగల్ సెల్ ఆధ్వర్యంలో, దేశంలో మారుతున్న రాజ్యాంగ విలువలు, వాటిపై జరుగుతున్నా దాడి, రాజ్యాంగం  పరిరక్షణ,  ఏ విధంగా దేశ ప్రజలకు న్యాయం జరగాలనే దానిపై ఆగస్టు 2 న ఢిల్లీలో జరిగే న్యాయవాదుల సదస్సుకు, జగిత్యాలలో నిజామాబాదు లీగల్ సెల్  కోఆర్డినేటర్ గుంటి జగదీశ్వర్ టీపీసీసీ...
Read More...
Local News  State News 

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారుల జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని రోడ్లుభవనాల శాఖలో పనిచేస్తున్న సీ అనీల్ కుమార్ కాంట్రాక్టర్ నుండి 7 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం చేసిన...
Read More...
Local News 

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు  నగదు రివార్డు ప్రకటించి, జిల్లా పోలీసులకు అభినందించిన  తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య  జగిత్యాల జులై 30 (ప్రజా మంటలు) గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీస్ చేపట్టిన చర్యలు, గంజాయి రవాణాదారులపై నిర్వహించిన ఆకస్మిక దాడులు, వారి అరెస్టులు మరియు మాదకద్రవ్యాల స్వాధీనం లో కఠిన చర్యలు తీసుకున్న  జిల్లా...
Read More...
Local News 

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్      గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలిజగిత్యాల జులై 30 (ప్రజా మంటలు)రాబోవు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు*హఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జిల్లా పోలీస్...
Read More...
Local News 

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి     జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు)   జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం తరఫున ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి  రాజ్ కుమార్ ని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ2024 - 25  విద్యా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్ జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు)రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 23 లక్షల బిల్లు కోసం 18 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్… కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంతో 10 వేల రూపాయలకు ఒప్పందం… మొదటగా 3 వేల రూపాయలు తీసుకున్న AEE… మిగతా 7...
Read More...
Local News 

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం      ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు * భీమారం జులై 30 (ప్రజా మంటలు)త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం కానున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం మేడిపల్లి కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు. 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు.  సికింద్రాబాద్, జూలై 30 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని న్యూ బోలక్ పూర్ మెయిన్ రోడ్డు పైన పాత లారీ ధర్మకాంట సమీపములో ఇటీవల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ నిమిత్తము రోడ్డును తవ్వారు. పని  ముగిసిన తర్వాత అక్కడి మట్టి రాళ్లను తీసి వేయకుండ.. అక్కడే...
Read More...
Local News 

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం    ధర్మపురి జూలై 30 ( ప్రజా మంటలు) పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ...
Read More...