జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.
బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్
ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు...
సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆయన కార్యాలయం, ఇంటిపై ఒక కాలంలో దాడులు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వెంకట్ రావు అనే వ్యక్తి జీహెచ్ఎంసీ అనుమతి పొంది రెండు బిల్డింగుల నిర్మాణం చేశాడు. అయితే ఈ బిల్డింగులకు ఎన్ఓసీ కోసం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు కు దరఖాస్తు పెట్టకున్నాడు. దీనిపై విఠల్ రావు ఈ రెండు భవనాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి బిల్డింగు నిర్మాణంలో చిన్న చిన్న డీవియేషన్లు ఉన్నాయి... వాటిని సరిచేసుకుని వస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఒక్కో బిల్డింగుకు రూ.4లక్షల చొప్పున రూ.8లక్షలు ఇస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పాడు. దీంతో అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని, రూ.4 లక్షలు ఇస్తానని వెంకట్ రావు చెప్పాడు.

అదేమీ కుదరదు రూ.8లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే ఎన్ఓసీ ఇవ్వడం కుదరదని విఠల్ రావు తేగేసి చెప్పాడు. దీంతో వెంకట్రావు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. మల్కాజిగిరి సఫిల్ గూడ చెరువు వద్దకు ప్రభుత్వ వాహనంలో వచ్చిన విఠల్ రావు అందులోనే కూర్చుని రూ.4లక్షలు తీసుకున్నాడు. తరువాత ఎన్ఓసీ ఇవ్వకుండా తిప్పుకోవడం మొదలు పెట్టాడు. మిగిలిన రూ.4 లక్షల కోసం వెంకటరావు పై ఒత్తిడి తీసుకువచ్చాడు.అయితే మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో వెంకటరావు భవన నిర్మాణ అనుమతుల ఎన్ఓసీ ఫైళ్లను తిరస్కరించాడు. దీంతో వెంకట్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అసిస్టెంట్ ప్లానర్ విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విఠల్ రావు చాంబర్ లో సోదాలు నిర్వహించారు. మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు కోఠి సుల్తాన్ బజారులో విఠల్ రావు ప్రైవేట్ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఈ మూడు ప్రాంతాలల్లో సోదాలు చేపట్టారు.రెండు భవన నిర్మాణాల అనుమతుల కోసం రూ. 8 లక్షలు డిమాండ్ చేసి రూ.4క్షలు తీసుకున్నట్లు నిర్దారణ అయిందని ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపారు. విఠల్ రావు సంపాదనకు మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. విఠల్ రావు సంపాదించిన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి విలువ ఎంత .? తదితర విషయాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు లంచం అడిగితే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలం నంబి వేణుగోపాల ఆచార్య
జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలమని నంబి వేణుగోపాలఆచార్య కౌశిక అన్నారు .శుక్రవారం పోచమ్మ బస్తీలోని గీతా భవన్ లో సాయంత్రం హిందూ సమ్మేళన సమితి వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న నంబి వేణుగోపాల ఆచార్య అనుగ్రహ భాషణం చేస్తూ మానవులు ప్రకృతిని ధ్వంసం... అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)బీట్ చౌరస్తా లో నిర్వహించిన అమావాస్య అన్నపూర్ణ మాత సేవ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ హాజరై భక్తులకు స్వయంగా వడ్డించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమములో... ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక , పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం (తేది: 07-04-2026) లో తీసుకున్న తీర్మానాల మేరకు జెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ... సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ
జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి... ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం
ఆవిర్భావ సభ వివరాలు:*
📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):
తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని... మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత... జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ
రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ కొలకనూరి ఇనాక్ , జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక... ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ
జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని శ్రీ శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ అన్నారు.ఈ భూమిపై పుట్టిన వారికి ఇద్దరు తల్లులు ఒకరు కన్నతల్లి ఆమెకు పుట్టిన వారిని పోషిస్తుంది మరొకరు భూమాత ఆమె భారత మాత పుట్టిన నుండి గిట్టిన తర్వాత... అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం
జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ
ఈ... కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు
ఈ నెల 20 తేదీన కెసిఆర్ బహిరంగ సభలో సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం లో నిర్వహించనున్న బహిరంగ సభకు స్టేజి నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ధర్మపురి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు... ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మేడిపల్లి ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా... జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం
జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని తెలంగాణ మైనారిటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటి మైనారిటీ గురుకులం విద్యార్థులను అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) శ్రీ. బి.రాజ గౌడ్ ఇంటర్ ఫలితాలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు.
కుమారి. నేల్లెంకుల నందిత అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (ఏం.పి.సి.) వార్షిక పరీక్షల ఫలితాల్లో 470... 