జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

On
జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్
 ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు...

సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):

 జీహెచ్ఎంసీ  సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్  పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.  సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు  రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు  శుక్రవారం  ఆయన కార్యాలయం, ఇంటిపై ఒక కాలంలో దాడులు నిర్వహించారు.

 ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన  వెంకట్ రావు అనే వ్యక్తి   జీహెచ్ఎంసీ అనుమతి పొంది రెండు బిల్డింగుల నిర్మాణం చేశాడు. అయితే  ఈ బిల్డింగులకు ఎన్ఓసీ కోసం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్  సిటీ ప్లానర్  విఠల్ రావు కు దరఖాస్తు పెట్టకున్నాడు. దీనిపై విఠల్ రావు ఈ రెండు భవనాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి బిల్డింగు నిర్మాణంలో చిన్న చిన్న డీవియేషన్లు ఉన్నాయి... వాటిని సరిచేసుకుని వస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఒక్కో బిల్డింగుకు రూ.4లక్షల చొప్పున రూ.8లక్షలు ఇస్తే ఎన్ఓసీ ఇస్తానని చెప్పాడు. దీంతో అంత  డబ్బు తాను ఇచ్చుకోలేనని, రూ.4 లక్షలు  ఇస్తానని  వెంకట్ రావు చెప్పాడు.

IMG-20250523-WA0002

అదేమీ కుదరదు రూ.8లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే ఎన్ఓసీ ఇవ్వడం కుదరదని విఠల్ రావు తేగేసి చెప్పాడు. దీంతో వెంకట్రావు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. మల్కాజిగిరి సఫిల్ గూడ  చెరువు వద్దకు ప్రభుత్వ వాహనంలో వచ్చిన విఠల్ రావు అందులోనే కూర్చుని రూ.4లక్షలు తీసుకున్నాడు. తరువాత ఎన్ఓసీ ఇవ్వకుండా తిప్పుకోవడం మొదలు పెట్టాడు. మిగిలిన రూ.4 లక్షల కోసం  వెంకటరావు పై ఒత్తిడి తీసుకువచ్చాడు.అయితే మిగతా డబ్బులు  ఇవ్వకపోవడంతో వెంకటరావు భవన నిర్మాణ అనుమతుల ఎన్ఓసీ ఫైళ్లను తిరస్కరించాడు. దీంతో వెంకట్ రావు  ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అసిస్టెంట్ ప్లానర్ విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు.

 సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విఠల్ రావు చాంబర్ లో  సోదాలు నిర్వహించారు. మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు కోఠి సుల్తాన్ బజారులో విఠల్ రావు  ప్రైవేట్ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఈ మూడు ప్రాంతాలల్లో సోదాలు చేపట్టారు.రెండు భవన నిర్మాణాల అనుమతుల కోసం   రూ. 8 లక్షలు డిమాండ్ చేసి  రూ.4క్షలు తీసుకున్నట్లు నిర్దారణ అయిందని ఏసీబీ డీఎస్సీ  శ్రీధర్ తెలిపారు. విఠల్ రావు సంపాదనకు మించి  అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. విఠల్ రావు  సంపాదించిన అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి విలువ  ఎంత .? తదితర విషయాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ  అధికారులు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు లంచం అడిగితే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags

More News...

Local News  State News 

బోయిన్ పల్లి  పీఎస్ పరిధిలో  కలకలం  - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

బోయిన్ పల్లి  పీఎస్ పరిధిలో  కలకలం  - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం సికింద్రాబాద్, మే 23 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో ఒకే  కుటుంబం లో నలుగురు అదృశ్యం కావడం  కలకలం రెపింది. తల్లి తో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఫ్యామిలి మెంబర్స్ బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బృందావన్ కాలనీలో భార్యభర్తలు చెంచయ్య  అనిత లు...
Read More...
Local News 

జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు. బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్  ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు... సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):   జీహెచ్ఎంసీ  సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్  పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.  సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో   అదేమీ...
Read More...
Local News 

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి 

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా విద్యాధికారి రాము నాయక్  గొల్లపల్లి మే 23 (ప్రజా మంటలు): ఉపాధ్యాయ వృత్తి విద్య నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము నాయక్ ,రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు .శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శిక్షణ...
Read More...
State News 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి ప్రజాదర్బార్ లో తెలంగాణ రాష్ట్ర  ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మెన్ కు  వినతి పత్రం  సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అరవై సంవత్సరాల పైబడి అలుపెరగని సుదీర్ఘమైన పోరాటం, ఎందరో మహానుభావులు ఆత్మార్పణ త్యాగాలు చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2న రాష్ర్టంలో మద్యం...
Read More...
Local News 

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్, శ్రీనివాస్  గొల్లపల్లి మే 23  (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం శేకల్ల  గ్రామంలో శుక్రవారం క్షయ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జ్వరం తదితర లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని
Read More...
Local News 

జగిత్యాల పురపాలక కార్యాలయములో  రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు

జగిత్యాల పురపాలక కార్యాలయములో  రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు ఈనెల 24 25 26 తేదీలలోజగిత్యాల మే 25  (ప్రజా మంటలు) మున్సిపల్ పరిధిలో గల రాజీవ్ యువ వికాసం పదకం 2024-25 సం.నకు గాను కేటాయించబడిన బ్యాంకు అనుసంధాన స్వయం ఉపాధి పథకాలకు వ్యక్తిగత రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు తేది: 24.05.2025 నుండి 26.05.2025 వరకు నిర్వహించబడును...
Read More...
Local News 

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్     రాయికల్ మే 23 (ప్రజా మంటలు)    మండలంలోని  రాంనగర్ మరియు సింగర్ రావు పెట్ గ్రామాలలో అకాల వర్షాలతో తడిచిన వరి ధాన్యాన్ని  రైతులు మరియు నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు మద్దతుగా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలియజేసిన జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......
Read More...
Local News 

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 23 (ప్రజా మంటలు)    జగిత్యాల జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ కు సరియైన పార్కింగ్ స్థలం లేక   బ్యాంక్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు వినియోగదారులు బ్యాంకు ఎదుట తమ వాహనాలను ఉంచి వెళ్ళడము తిరిగి వెళ్ళేటప్పుడు అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించ ప్రయత్నిస్తే వాటికి హ్యాండిల్...
Read More...
Local News 

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్                                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల రూరల్ మే 23( ప్రజా మంటలు)    మండలంలోని  చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో మరియు కోనాపూర్, తిప్పన్నపేట గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి,రైతులు అధైర్య పడవద్దు అని,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకున్నాం అని,అధికారులతో మాట్లాడానని తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  తడిసిన ధాన్యం కొనుగోలు...
Read More...
Local News 

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మల్యాల మే 23(ప్రజా మంటలు)    నిరంతరం అధికారులకు, సిబ్బందికి వైర్లెస్  సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా మాల విరమణ,దర్శనం అయ్యేలా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు జిల్లా ఎస్పీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, జిల్లా...
Read More...
Local News 

భూటాన్‌ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

భూటాన్‌ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు మండల వ్యాప్తంగా అభినందనల వెల్లువ
Read More...
National  Local News  State News  Spiritual  

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి   (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494) వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి, జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఏడాదిలో పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ప్రత్యేకతను కల్పిస్తూ... ఏడాది పొడవునా ఉండే ఒకో ఏకాదశికి ఒకో పేరు పెట్టడం జరిగింది....
Read More...