గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం
బీర్పూర్ మే 27 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఎస్పీ ఆదేశాల మేరకు యువతలో గంజాయి నిర్మూలన అవగాహనలో భాగంగా బీర్పూర్ మండలం తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకులకు గంజాయి అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు మాట్లాడుతూ...
గంజాయి ఇతర డ్రగ్స్ త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, దాని ద్వారా బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని యువకులకు తెలియజేశారు. సెలవులలో దొరికిన సమయాన్ని కంప్యూటర్ శిక్షణ కోసం వినియోగిస్తున్నందుకు వారిని అభినందించారు. మరియు మంచి అలవాట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తెలియజేశారు.
యువతపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తారని వారికి తెలియజేసి ఎవరు కూడా వారి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెడు అలవాట్లు కు గురికాకుండా ఉండాలని తెలియజేశారు.
ఎవరైనా గంజాయి కి అలవాటు పడిన, గంజాయి అమ్మిన, కొన్న, పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పారు. బీర్పూర్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656828 కి తెలియపరచాలని చెప్పారు. యువత ముఖ్యంగా ధూమపానం మద్యం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ఘంటా పథంగా చెప్పారు.గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
