గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం
బీర్పూర్ మే 27 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఎస్పీ ఆదేశాల మేరకు యువతలో గంజాయి నిర్మూలన అవగాహనలో భాగంగా బీర్పూర్ మండలం తుంగూరు లోని ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న యువకులకు గంజాయి అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా బీర్పూర్ ట్రైనీ ఎస్సై రాజు మాట్లాడుతూ...
గంజాయి ఇతర డ్రగ్స్ త్రాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, దాని ద్వారా బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని యువకులకు తెలియజేశారు. సెలవులలో దొరికిన సమయాన్ని కంప్యూటర్ శిక్షణ కోసం వినియోగిస్తున్నందుకు వారిని అభినందించారు. మరియు మంచి అలవాట్లతో మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తెలియజేశారు.
యువతపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తారని వారికి తెలియజేసి ఎవరు కూడా వారి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెడు అలవాట్లు కు గురికాకుండా ఉండాలని తెలియజేశారు.
ఎవరైనా గంజాయి కి అలవాటు పడిన, గంజాయి అమ్మిన, కొన్న, పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పారు. బీర్పూర్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656828 కి తెలియపరచాలని చెప్పారు. యువత ముఖ్యంగా ధూమపానం మద్యం గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ఘంటా పథంగా చెప్పారు.గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
