సీఎం గారూ...బడి బాట సరే...మా బడికి దారేది....?
*స్కూల్ దారి కోసం బడిపంతులు ధర్నా
*బస్తీలోని పేద, దళిత విద్యార్థుల స్కూల్ పై వివక్ష
*స్కూల్ కు అడ్డంగా నిర్మించిన గోడ తొలగించాలని సీపీఐ నాయకులతో కలిసి నిరసన
సికింద్రాబాద్ మే 26 (ప్రజామంటలు) :
బడికి దారి కోసం బడిపంతులు ఆందోళనకు దిగారు. పేద పిల్లలు చదివే పాఠశాలకు కొందరు దారికి అడ్డంగా గోడ నిర్మించి దారిలేకుండా చేశారని, సీఎం గారూ..మాబడికి దారేది..అంటూ ప్లెక్సీతో నిరసన చేపట్టారు.పంతులు చేస్తున్న ఆందోళనకు సీపీఐ నాయకులు సంఘీభావం ప్రకటించి ఆయనతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ పాఠశాల కు అడ్డంగా అక్రమంగా నిర్మించిన గోడను తొలగించి బడికి బాట ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి , సీపీఐ నాయకులుతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ..పేద,దళిత వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలకు అడ్డంగా ప్రహరీగోడ నిర్మించారని, దీంతో విద్యార్థులకు స్కూల్లోని వెల్లడానికి దారి లేకుండా చేశారని అన్నారు.
ఈ విషయమై పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించినా కోర్టు కేసును సాకుగా చూపి ఏడాది కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు బస్తీలకు చెందిన దళిత, పేద విద్యార్థులను మా కాలానికి రావొద్దు అంటూ వివక్షకు గురి చేస్తూ అడ్డంగా అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించి బడికి బాట ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు బడిబాట పేరుతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలోకి చేర్చాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు బడికి దారి లేక ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారని అన్నారు.
సంవత్సర కాలం నుండి కలెక్టర్ నుండి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ కింది స్థాయి అధికారి వరకు తిరిగినా పట్టించుకోవట్లేదని, జోనల్, కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ను టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.ఈ విషయంలో అధికారులు స్పందించి గోడను కూల్చివేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
