ఇక కరోనా కథ కంచికి చేరినట్టేనా...?
ఎండమిక్ దశకు చేరుకున్నట్లు నిపుణుల అభిప్రాయం
* ప్రస్తుతం ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్
*గతంలో మాదిరిగా గ్లోబల్ గా ఒకే వేరియంట్ విస్తరించని వైనం
సికింద్రాబాద్ మే25 (ప్రజామంటలు)::
గత ఐదు ఏండ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించి, లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా భూతం ఇక అంతిమ దశకు చేరుకుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 2019 లో ఆల్ఫా వేరియంట్ తో ప్రపంచానికి భయం రుచి చూపించిన కోవిడ్ వైరస్ 2025 వరకు ఎన్నో వేరియంట్ లతో ఆయా దేశాల్లో వ్యాప్తి చెందుతునే ఉంది. ప్రస్తుతం జేఎన్ 1 వేరియంట్ చాలా తక్కువ వ్యాప్తిలో ఉందని, బహుశా గ్లోబల్ గా ఇదే కోవిడ్ వేరియంట్ చివరి దశ అవుతుందని గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కిరన్ మాదాల అభిప్రాయ పడ్డారు. ఆయన ఆదివారం వెలుగుతో మాట్లాడుతూ...గత ఐదేండ్లలో కోవిడ్ మొదట్లో పాండమిక్ దశలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తూ, కోట్లాది మంది ఆరోగ్యాలపై ప్రభావం చూపిందన్నారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం సగం వరకు తగ్గి, కొన్ని దేశాలకే పరిమితమవుతూ, దాని ప్రభావం మద్యస్థ స్థాయి (ఎపిడమిక్) కి పడిపోయిందన్నారు. ఇప్పడు ప్రపంచంలోని ఒక దేశంలో వెలుగు చూసిన వేరియంట్ మరో దేశంలో కనిపించడం లేదన్నారు. దీనిని బట్టి కరోనా ఎండమిక్ దశకు చేరుకుందని భావిస్తున్నామన్నారు. ఏదేని వైరస్ వ్యాప్తికి సాధారణంగా మూడు దశలు 1. పాండమిక్, 2. ఎపిడమిక్,3.ఎండమిక్ దశలు ఉంటాయన్నారు.
ప్రస్తుతం సింగపూర్ దేశంలో వెలుగు చూసిన ఎన్బీ1.8.1 వేరియంట్ మరే దేశంలో లేదని, మనదేశంలో ప్రస్తుతం ఉన్న ఎక్స్ ఎఫ్ జీ వేరియంట్ మరే దేశంలో లేదన్నారు. దీనిని బట్టి చూస్తే కరోనా వైరస్ బాగా బలహీనపడిపోయి, ఆయా దేశాలు, ప్రాంతాలలోని ప్రజల ఇమ్యూనిటీ పవర్ కు అనుగుణంగా అక్కడి వరకే పరిమితమవుతుందనే విషయం అర్థం అవుతుందన్నారు. ఒకవేళ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లయితే ఒకే మాదిరి వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా పాకేదన్నారు. ప్రతి వైరస్ కు ముగింపు దశలో ఎండమిక్ దశ ఉంటుందని, ప్రస్తుతం వేరియంట్ల వ్యాప్తి, వాటి తక్కువ తీవ్రతను లెక్కలోకి తీసుకుంటే ఇక కరోనా ముగింపు దశకు వచ్చిందని భావించవచ్చాన్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోదనలు చేస్తుందని, త్వరలో కరోన ఎండమిక్ పై ప్రకటన రావచ్చని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
