కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
On
కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఏప్రిల్ 23వరకు జైల్లోనే
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 09:
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు గత నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో ఈరోజు హాజరుపరిచారు.
ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించింది. మరో 14 రోజులు జ్యుడి షియల్ కస్టడీ పొడిగించాలని కోరింది.
మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Tags