మాజీ ఎంపిపి, ఎంపీటీసీ సుగుణాకర్ రావు, పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా
మాజీ ఎంపిపి, ఎంపీటీసీ సుగుణాకర్ రావు, పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా
మెటుపల్లి ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :
ఇబ్రాహీం పట్నం మండలానికి చెందిన మాజీ ఎం పీపీ, ఎం పీటీసీ వెల్ముల సుగుణాకర్ రావు వెల్ముల పుష్పలతాదేవి లు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నా పార్టీ నాయాఉయ్యకులు, ఎమ్మెల్యే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మండలంలో పర్యటించడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వల్ల మనస్తాపం చెంది, పారీలో ఉన్నా ఎలాంటి లాభం లేదని ఆరోపిస్తూ, జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు లేఖ రాసారు.
ఈలేఖలో, జెడ్పిటిసి నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచే వరకు మరియు మీ కొడుకు సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచే వరకు మేము మా కుటుంబం రాత్రి పగలు కష్టపడి మీ విజయానికి కృషి చేశాము. మేము ఎంత కష్టపడ్డా గాని మీ దగ్గర తగిన గుర్తింపు లేకపోవడం వల్ల, కనీస సమాచారం ఇవ్వకుండా మండల్లో పర్యటిస్తూ, చిన్న సమాచారం ఇవ్వకుండా మీకోసం కష్టపడ్డ మాలాంటి కుటుంబాలకు మీరు తీరని నష్టం కలిగించారని ఆరోపినహారు. మీ కన్నా ముందు రాజకీయాల్లో వెల్ముల పుష్పలత దేవి సుగుణాకర్ రావు అనే మేము మండల ప్రెసిడెంట్ గా, మూడుసార్లు ఎంపీటీసీగా, ఒకసారి సిడిసి చైర్మన్ గా ఉన్నాము. ఒకసారి జడ్పిటిసి గా పోటీ చేసి ఓడిపోయాం. మేము రాజకీయాల్లో ఉంటూ, ఇంకొకరికి శ్రేయస్సు కోరాము ఇంకొకరు ఎదుగుదలకు కృషి చేశాము. కానీ మీలాగా మీ రాజకీయ భవిష్యత్తు కొరకు ఇతరులను వాడుకొని వారి రాజకీయ భవిష్యత్తును కక్షగట్టి ఎవరిని నాశనం చేయలేదు. మీరు ప్రతిసారి కుటుంబం కుటుంబం అనుకుంటూ మా కుమారుడు వెల్ముల శ్రీనివాసరావును కూడా పూర్తిగా మీ రాజకీయ జీవితానికి , ఆయన జీవితాన్ని కూడా నాశనం చేశారు. కార్యకర్తల్లో ప్రజల్లో ఎవరు మా వెంట తిరిగిన, వారిని ఫాలోఅప్ చేసుకుంటూ తిరగకుండా చేయడం మరియు మా రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి కట్టారు. మా కుటుంబం ప్రజలు మీద అభిమానంతో మేము ఇప్పటివరకు ఓపిక పట్టినాము మాకు పార్టీ మారే ఉద్దేశం లేదు మా కుటుంబం ఇప్పటికీ ప్రజలతోనే ఉంది చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటాం ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మాకు ప్రజలకు సేవ చేయాలని భావంతోనే మీతో ఉంటే ప్రజలకు సేవ చేయలేమని మీరు డబ్బు ఉన్నవారికి తప్ప మిగతా వారిని గుర్తించరని, మాకు మీ దగ్గర ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదు అని మేము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామనీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు బియరెస్ జిల్లా అధ్యక్షకుని కన్నా ముందు నుండే తెలుగుదేశం పార్టీలో అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్
మెట్పల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి మున్సిపల్ చైర్మన్ పదవి సాధించేందుకు ప్రయత్నించలేదని, కౌన్సిలర్లకు విప్ కూడా జారీ చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై దాడికి దిగినట్లు సమాచారం.
ఈ... తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్
హైదరాబాద్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనోహర్ కుమార్కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.
మనోహర్ కుమార్తో పాటు... కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన... జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి…
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలో సినీ హీరో అర్జున్ సందడి చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో అర్జున్ మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతా పయనం చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మ్యాట్నీ షో సమయంలో థియేటర్ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ,... గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల దుర్బర జీవితం…
సికింద్రాబాద్, ఫిబ్రవరి 16 ( ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఆశ్రయం లేక జీవనం సాగిస్తున్న నిరాశ్రయుల జీవితాలు గుండెల్ని పిండేసే దృశ్యాలుగా మారుతున్నాయి. ఎవరి ఆదరణ లేక, కనీస సౌకర్యాలు లేక కొందరు ఫుట్పాత్లనే ఇంటిగా మార్చుకుని రోజులు గడుపుతున్నారు. అన్నదానాల కోసం చేరిన వారు, కాలక్రమేణా అక్కడే జీవితం గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.అనారోగ్యంతో... న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి
మెట్టుపల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు యండి. ఖాదీర్పై దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మెట్టుపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సోమవారం మెట్టుపల్లి కోర్టులో న్యాయవాదులు ఖాదీర్ హత్యకు... హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య
హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్యను హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా, 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ను వైస్ చైర్పర్సన్గా... రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా
ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.
▪️ మున్సిపల్ చైర్మన్గా కట్కం రవీందర్ ఎన్నిక▪️ వైస్ చైర్మన్గా... ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక
ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు
ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా వేముల నాగలక్ష్మిను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్గా ఇందారపు రామన్నను తిరిగి నియమించారు.
▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా కొత్త అభ్యర్థికి... జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా?
జగిత్యాల రాజకీయాల్లో సంచలన మార్పు: కొత్త సమీకరణలు ?
(ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం)
జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక కావడం కేవలం స్థానిక పదవి మార్పు కాదు. ఇది కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాల్లో ఒక కీలక మలుపు.
బయటికి చూస్తే ఇది👉 సంజయ్ కుమార్ వర్గ విజయం... బ్రేకింగ్ న్యూస్: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నికఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం పట్టు సాధించింది
▪️ మాజీ మంత్రి వర్గానికి మొండిచేయి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
▪️ వైస్ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన జీనత్ పర్వీన్ (మున్నా) ఎంపిక▪️ మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్కు నిరాశ▪️... కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర
కరీంనగర్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 66 డివిజన్లలో
భారతీయ జనతా... 