ఘనంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348421113)
జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ....., విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసి, రానున్న పోటీ పరీక్షలలో విజయదుందుభి మ్రోగించి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని, అలాగే ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి అనుభవాలను నేర్చుకోవాలని సూచించారు.
కళాశాల సాధించిన గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రగతిని ప్రభుత్వ నివేదించారు.
దీనిలో పీఎం ఉష కింద కళాశాలకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, 12 తరగతి గదులను, రెండు కంప్యూటర్ ల్యాబ్ లను, 100 కంప్యూటర్లను కళాశాలకు కేటాయించినందుకు కళాశాల ఉన్నత విద్యా కమిషనకు ధన్యవాదాలు తెలియజేశారు.
కళాశాలలో అత్యున్నతమైన ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేసే మానవ వనరులైన కళాశాల అధ్యాపకులు, నిష్ణాతులైన అధ్యాపకులు, విద్యార్థులకు అనునిత్యం విద్యా బోధనతోపాటు, సమాజ బాధ్యతను, పోటీ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, కళాశాలలో అన్ని రకాల కరికలర్, కోకరిక్యులర్, ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్ జరుగుతున్నాయని, ఎన్ఎస్ఎస్ 3 యూనిట్ల వాలంటీర్లు మల్లన్న స్వామి జాతర, పెద్దాపూర్. కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారని కళాశాలలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారని, కళాశాల నుంచి ఎన్నికల విధుల్లో అందరూ అధ్యాపకులు సెక్టోరల్ ఆఫీసర్లుగా పాల్గొంటున్నారని, అదేవిధంగా కళాశాల నుంచి రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ గా డాక్టర్ పడాల తిరుపతి ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ హరిజోత్ కౌర్ ఎంపికయ్యారని అదేవిధంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జంతు శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కే కిరణ్మయి తో పాటుగా జిల్లా ఉత్తమ అధ్యాపకులుగా డాక్టర్ పడాల తిరుపతి ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. అనంతరం కళాశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, మంచి విందు భోజనం ఆరగించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురు సుల్తానా, అకాడమిక్ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ అంబాల శంకరయ్య, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ హరి జ్యోతికౌర్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ కే కిరణ్ మై, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా జాతీయ ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, రాపర్తి శ్రీనివాస్, గణిత శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి తాటి స్వరూప రాణి, ఏ రజిని, వి జమున, డి సునీత, శ్రీమతి ఈ జ్యోత్స్న, ఎస్ సత్యం, ఆర్ మాధవి, సంగీత, సాయి, కొండ సంతోష్, గొల్లపల్లి తిరుపతి, సలీం, నరసయ్య, ఎదునూరి నవీన్, రశ్మిత, సురేష్, ఇర్ఫాన్ ఆ బేగం, యాస్మిన్ సుల్తానా, వాలంటీర్లు, విద్యార్థులు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
శతాధిక ఆచార్యుని పరమపదం
లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు.
ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు... హైదరాబాద్లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్కు చెందిన చేట్పల్లి సంజయ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్కు బయలుదేరాడు. అయితే... కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.
గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ... చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి... ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి... పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం
స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం
యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.
పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146... ఇండియా టుడే రౌండ్టేబుల్లో అన్నామలై–కార్తీ చిదంబరం
మర్యాదకు, రాజకీయ పరిణితకు అద్దం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
ఇండియా టుడే నిర్వహించిన రౌండ్టేబుల్ చర్చలో తమిళనాడు రాజకీయాలకు చెందిన ప్రముఖ నాయకులు అన్నామలై కుప్పుస్వామి మరియు కార్తీ చిదంబరం పాల్గొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణంగా టెలివిజన్ డిబేట్లలో కనిపించేలా అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలు... ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్
వాషింగ్టన్ ఫిబ్రవరి 12:
:వైట్ హౌస్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.... మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
(శ్రీధర గణపతి జగిత్యాల)జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియా ముందు సంకేతాన్ని ప్రదర్శించారు.
39వ వార్డుకు చెందిన గోలి... డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది?
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
జనవరి నెలలో అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడింది. అయితే సాధారణంగా ఒక కరెన్సీ బలహీనపడితే, దాని ఎదురు కరెన్సీలు బలపడటం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనత కనిపించిన సమయంలోనే భారత రూపాయి మరింత క్షీణించింది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి.
1️⃣ ... RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది.
1. RBI తెలిపిన... మధ్యప్రదేశ్పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి
భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం... 