ఘనంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348421113)
జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ....., విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసి, రానున్న పోటీ పరీక్షలలో విజయదుందుభి మ్రోగించి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని, అలాగే ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి అనుభవాలను నేర్చుకోవాలని సూచించారు.
కళాశాల సాధించిన గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రగతిని ప్రభుత్వ నివేదించారు.
దీనిలో పీఎం ఉష కింద కళాశాలకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, 12 తరగతి గదులను, రెండు కంప్యూటర్ ల్యాబ్ లను, 100 కంప్యూటర్లను కళాశాలకు కేటాయించినందుకు కళాశాల ఉన్నత విద్యా కమిషనకు ధన్యవాదాలు తెలియజేశారు.
కళాశాలలో అత్యున్నతమైన ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేసే మానవ వనరులైన కళాశాల అధ్యాపకులు, నిష్ణాతులైన అధ్యాపకులు, విద్యార్థులకు అనునిత్యం విద్యా బోధనతోపాటు, సమాజ బాధ్యతను, పోటీ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, కళాశాలలో అన్ని రకాల కరికలర్, కోకరిక్యులర్, ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్ జరుగుతున్నాయని, ఎన్ఎస్ఎస్ 3 యూనిట్ల వాలంటీర్లు మల్లన్న స్వామి జాతర, పెద్దాపూర్. కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారని కళాశాలలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారని, కళాశాల నుంచి ఎన్నికల విధుల్లో అందరూ అధ్యాపకులు సెక్టోరల్ ఆఫీసర్లుగా పాల్గొంటున్నారని, అదేవిధంగా కళాశాల నుంచి రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ గా డాక్టర్ పడాల తిరుపతి ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ హరిజోత్ కౌర్ ఎంపికయ్యారని అదేవిధంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జంతు శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కే కిరణ్మయి తో పాటుగా జిల్లా ఉత్తమ అధ్యాపకులుగా డాక్టర్ పడాల తిరుపతి ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. అనంతరం కళాశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, మంచి విందు భోజనం ఆరగించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురు సుల్తానా, అకాడమిక్ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ అంబాల శంకరయ్య, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ హరి జ్యోతికౌర్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ కే కిరణ్ మై, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా జాతీయ ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, రాపర్తి శ్రీనివాస్, గణిత శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి తాటి స్వరూప రాణి, ఏ రజిని, వి జమున, డి సునీత, శ్రీమతి ఈ జ్యోత్స్న, ఎస్ సత్యం, ఆర్ మాధవి, సంగీత, సాయి, కొండ సంతోష్, గొల్లపల్లి తిరుపతి, సలీం, నరసయ్య, ఎదునూరి నవీన్, రశ్మిత, సురేష్, ఇర్ఫాన్ ఆ బేగం, యాస్మిన్ సుల్తానా, వాలంటీర్లు, విద్యార్థులు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత... రాయికల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... 