ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ
ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి
లీగల్ నోటీసులు జారీ చేసినా స్పందించని రెవెన్యూ అధికారులు
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ
జగిత్యాల / రాయికల్ ఏప్రిల్ 27: :
అన్యాయంగా గత ప్రభుత్వ, రాజకీయ నాయకుల అండదండలతో ఆదివాసి భూములు కాజేయాలని దొంగ తనంగా భూ మార్పిడి చేసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు,
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన బాధితులను కలిసిన అనంతరం జగిత్యాలలో విలేఖరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో మండల స్థాయి నాయకుని ఆధ్వర్యంలో రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో 176 సర్వే నంబర్ యందు జాడి భీమయ్య ( ఆదివాసీ ) భూమిని (7.13 ఎకరాలు ) అదే గ్రామానికి చెందిన గుడిగిల్లా సత్తయ్య అక్రమంగా రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని భూ మార్పిడి చేసుకున్నాడు అని ఆరోపించారు.
2018 లో ధరణి యందు ఇట్టి భూమిని తన పేరున నమోదు చేయించు కున్నారని అన్నారు. అట్టి విషయం తెలిసి బాధితులు తుడుం దెబ్బ నాయకుల సహాయంతో మండల స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేసినా లాభం లేక పోయిందన్నారు. ఇప్పటి ప్రభుత్వం అయినా అట్టి అక్రమార్కులని చట్టపరంగా కఠినంగా శిక్షించి సంబందింత ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. ఇట్టి విషయంపై లీగల్ గా అడ్వకేట్ కిరణ్ కుమార్ చెక్రపాటితో నోటీసులు కూడ పంపడం జరిగిందన్నారు. అయినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం రావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మా అదివాసిలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో హై కోర్టు ను ఆశ్రయిస్తామని గుర్రాల రవీందర్ హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
