29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్కౌంటర్ పై సిడిఆర్వో సంచలన ప్రకటన
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:
ఛత్తీస్గఢ్లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గర
ఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని
ప్రజా స్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ
( కో - ఆర్డినేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ - CDRO ) ఆరోపించింది.
మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలని సిడిఆర్ వో సూచించింది.
ప్రభుత్వ సంస్థలు ఈ మావోయిస్టుల హత్యను ఎన్కౌంటర్గా పేర్కొన్నప్పటికీ, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదా తీవ్రమైన గాయాలు కూడా లేకపోవడం, మరోవైపు 29 మంది మరణించడం చూస్తే ఇది ఏకపక్ష దాడి అని ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. సిడి ఆర్ వో సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2017 తరువాత జరిగిన అతిపెద్ద ‘నక్సల్ వ్యతిరేక చర్య’ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన నివేదికలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఇది ఎన్కౌంటర్ కాదని నిస్సందేహంగా నిరూపించాయని సిడీఆర్ ఓ పేర్కొంది. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారని వివిధ మీడియా పేర్కొందన్నారు. వీరిలో చాలా మంది గ్రామాల్లో నివసిస్తున్న మావోయిస్టుల కేడర్ అని, మావోయిస్టులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తూండవచ్చని పోలీసులు అంటున్నారు అయితే, నిరుపేద ఆదివాసీ మహిళలు భద్రతా బలగాల అకృత్యాలకు పదే పదే గురికావడాన్ని గతంలో చూసాం. ఉదాహరణకు, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 8 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో ఒకరు కమ్లీ కుంజమ్. కమ్లీకి చెవుడు వుందని, సరిగ్గా మాట్లాడలేదని ఆమె తల్లి సోమ్లీ చెబ్తున్నారు. ఆమె మాటల్లో, “నా కుమార్తె వినలేదు; ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా. మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది?.”
మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య దీర్ఘకాలంగా జరుగుతున్న ఘర్షణ బస్తర్లోని ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు భద్రతా బలగాలు పాల్పడ్డాయని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి:, రాజ్య పోలీసు సిబ్బందిపైన 16 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.
బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లోనే భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని 2018లో 23 ఏళ్ల ఆదివాసీ మహిళ చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పసికందు తుపాకీ గుండు తగిలి చనిపోయింది. మావోయిస్టులు ఆ శిశువుని హత్య చేశారని పోలీసులు అంటూంటే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న వారిపై పోలీసులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ మావోయిస్టులను శాంతిభద్రతల సమస్యగా చూస్తూ, గతంలో ఆపరేషన్ గ్రీన్హంట్ వంటి విభిన్న ప్రయత్నాల ద్వారా మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రయత్నించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ను ప్రారంభించింది.
ప్రస్తుత ఆపరేషన్ కగార్ను ఆపరేషన్ను సమాధాన్ - ప్రహార్కు పొడిగింపుగానే చూడాలి. 2023 డిసెంబరులో ఛత్తీస్గఢ్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమయ్యాయి - 2024లో, పోలీసు నివేదికల ప్రకారం, 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లో కంటే మూడు రెట్లు ఎక్కువ.
క్రోనీ క్యాపిటలిస్టుల, వారి సామ్రాజ్యవాద భాగస్వాముల పరిశ్రమల స్థాపనకు ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ భూమిని లాక్కోవడానికి వీలుగా చట్టాలలో తీసుకువచ్చిన మార్పులతో పాటు ఈ సైనిక చర్యలను చూడాలి. "అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023"ను పార్లమెంటులో సులభంగా ఆమోదించడం లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను కల్పించే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ (పెసా) చట్టం-1996 అమలు కాకపోవడం, ముఖ్యంగా సహజ వనరుల నిర్వహణ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల మెరుగుదల పట్ల ప్రభుత్వానికి సుముఖత లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మావోయిస్టులు సమాజంలోని అణగారిన వర్గాల తరపున సామాజిక కారణాలపై పోరాడుతూనే ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను లేవనెత్తుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలను, ముఖ్యంగా పేద ఆదివాసీలని గురించి పట్టించుకోవడం లేదని ఇది చూపిస్తుంది.
ప్రభుత్వ సైనిక చర్యలు పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు ప్రభుత్వాలను తమ పౌరులపై యుద్ధం చేయకుండా నిరోధిస్తాయి,
సాయుధ ప్రతిఘటనతో సహా తమ ప్రాణాలను, భద్రతను అన్ని విధాలుగా రక్షించుకునే హక్కును ఈ ఒప్పందాలు తిరుగుబాటుదారులకు ఇస్తాయి.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని సర్కేగూడ, కొత్తగూడ, రాజ్పెంట గ్రామాల్లో 2012లో ఎన్కౌంటర్ పేరుతో 17 మంది ఆదివాసీలను హత్య చేసిన ఘటనను సిడిఆర్ఓ నిజనిర్ధారణ బృందం వెలుగులోకి తెచ్చింది.
ఆ తరువాత మా బృందం పరిశోధనలను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఫలితాలు సమర్థించాయి. అలాగే, 2023లో, ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వం జరిపిన ఇంతకు ముందెన్నడూ ఎరుగని వైమానిక బాంబు దాడులు, పోలీసు క్యాంపుల ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత పైన, రోడ్ల నిర్మాణం కోసం జరిగిన అక్రమ, బలవంతపు భూ సేకరణకు సంబంధించి అనేక ఉదంతాలను, విషయాలను డాక్యుమెంట్ చేసాం.
పేద ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రస్తుతమూ, గతంలోనూ సైనిక, సాయుధ బలగాలతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మావోయిస్టు సమస్య సామాజిక రాజకీయ సమస్య అని, సైనిక పరిష్కారాల ద్వారా కాకుండా రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని దృఢంగా భావిస్తున్నాం. ఆపరేషన్ గ్రీన్హంట్, సమాధాన్-ప్రహార్ లేదా కగార్ లాంటి సైనిక పరిష్కారం ద్వారా కొంతమంది మావోయిస్టులను చంపగలరేమో కానీ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలి.
సిడిఆర్ వో డిమాండ్లు:
సామాజిక-ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం;
సాయుధ బలగాలను వెంటనే బ్యారక్లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మావోయిస్టులను నియంత్రించే పేరుతో ఆదివాసీల ఎన్కౌంటర్ హత్యలు, ఆదివాసీ మహిళల వేధింపులను ఆపివేయాలి.
బలగాల కార్యనిర్వహణ పద్ధతిపై దృష్టి సారించేందుకు కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి న్యాయ కమిషన్ను ఏర్పాటు చేయాలి.
మావోయిస్టు సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం షరతులు లేని సంభాషణను ప్రారంభించాలి: పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభించాలి; అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దోపిడీకోసం అటవీ, ఆదివాసీల భూముల సేకరణను ఆపాలి.
సిడిఆర్ఓ సమన్వయకర్తలు :
(ఆశిష్ గుప్తా)
(తపస్ చక్రవర్తి)
(క్రాంతి చైతన్య)
సిడిఆర్ఓ భాగస్వామ్య సంస్థలు:
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (పంజాబ్);
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (, హర్యానా),
అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (పశ్చిమ బెంగాల్);
అసన్సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్ (పశ్చిమ బెంగాల్);
బందీ ముక్తి కమిటీ (పశ్చిమ బెంగాల్);
పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్);
పౌర హక్కుల సంఘం (తెలంగాణ);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (మహారాష్ట్ర);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (తమిళనాడు);
కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్(మణిపూర్);
మానబ్ అధికార్ సంగ్రామ్ సమితి (అస్సాం);
నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్;
మానవ హక్కుల కోసం పీపుల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (జమ్మూ మరియు కాశ్మీర్);
పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరమ్ (కర్ణాటక);
జార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (జార్ఖండ్);
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఢిల్లీ);
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (హర్యానా),
కాంపెయిన్ ఫర్ పీస్ & డెమాక్రసీ ఇన్ మణిపూర్, ఢిల్లీ;
జానకీయ మనుష్యావకాశ ప్రస్థానం, కేరళ
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీనగర్లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం
శ్రీనగర్ జనవరి 23:
శ్రీనగర్ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
మంచు పరిస్థిత
శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం... కేటీఆర్, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్
హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు):
సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ... పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు. జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్
బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు?
జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే... భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ
భద్రాచలం, జనవరి 23 (ప్రజా మంటలు):
భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ షేక్ ఖాదీర్ను అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో భూ రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది.
ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ వై. రమేష్... మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు
మేడారం, జనవరి 23 (ప్రజా మంటలు):
మేడారంలొ, శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
జంపన్నవాగు–గడ్డెల రోడ్డులోని హరిత ‘వై’ జంక్షన్ వద్ద విద్యుత్ నేమ్ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్న... బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు
నిర్మల్, జనవరి 23 (ప్రజా మంటలు):
తెలంగాణలోని ప్రసిద్ధ విద్యాపీఠమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యాదేవత సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక హోమాలు,... కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు
కొండగట్టు, జనవరి 23 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ అర్చకులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగడంతో భక్తుల దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాదిమంది భక్తులు నిలిచిపోగా, కొందరు భక్తులు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగారు.... ఫోన్ ట్యాపింగ్ కేసు దృష్టి మళ్లింపు కుట్రే : కేటీఆర్
హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు):
ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ దురుద్దేశంతో రూపొందించిన దృష్టి మళ్లింపు కుట్రగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలు వైఫల్యం, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును ముందుకు... జైలులో ప్రేమ.. పెళ్లికి పరోల్ : రాజస్థాన్లో అరుదైన పరిణామం
జైపూర్, జనవరి 23:
రాజస్థాన్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలులో ప్రేమలో పడి, పెళ్లి చేసుకునేందుకు కోర్టు పరోల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
హైప్రొఫైల్ దుష్యంత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియ సెత్ (నేహా సెత్) కు... యుద్ధానికి ముగింపు కోసం పుతిన్తో భేటీ: ట్రంప్ ప్రకటన
డావోస్ | జనవరి 22 :
ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు తీసుకురావడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను త్వరలోనే కలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్లోని డావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్... బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా?
ముంబై జనవరి 22:
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త మేయర్గా బీజేపీ నేత తేజస్వి గోసాల్కర్ ఎన్నిక కావడంతో ముంబై రాజకీయాల్లోనే కాదు, బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ చర్చలు, అసంతృప్తి మొదలైంది. ఈ ఎన్నిక బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి.
తేజస్వి గోసాల్కర్ ఇటీవల జరిగిన... 