29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్కౌంటర్ పై సిడిఆర్వో సంచలన ప్రకటన
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:
ఛత్తీస్గఢ్లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గర
ఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని
ప్రజా స్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ
( కో - ఆర్డినేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ - CDRO ) ఆరోపించింది.
మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలని సిడిఆర్ వో సూచించింది.
ప్రభుత్వ సంస్థలు ఈ మావోయిస్టుల హత్యను ఎన్కౌంటర్గా పేర్కొన్నప్పటికీ, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదా తీవ్రమైన గాయాలు కూడా లేకపోవడం, మరోవైపు 29 మంది మరణించడం చూస్తే ఇది ఏకపక్ష దాడి అని ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. సిడి ఆర్ వో సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2017 తరువాత జరిగిన అతిపెద్ద ‘నక్సల్ వ్యతిరేక చర్య’ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన నివేదికలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఇది ఎన్కౌంటర్ కాదని నిస్సందేహంగా నిరూపించాయని సిడీఆర్ ఓ పేర్కొంది. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారని వివిధ మీడియా పేర్కొందన్నారు. వీరిలో చాలా మంది గ్రామాల్లో నివసిస్తున్న మావోయిస్టుల కేడర్ అని, మావోయిస్టులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తూండవచ్చని పోలీసులు అంటున్నారు అయితే, నిరుపేద ఆదివాసీ మహిళలు భద్రతా బలగాల అకృత్యాలకు పదే పదే గురికావడాన్ని గతంలో చూసాం. ఉదాహరణకు, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 8 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో ఒకరు కమ్లీ కుంజమ్. కమ్లీకి చెవుడు వుందని, సరిగ్గా మాట్లాడలేదని ఆమె తల్లి సోమ్లీ చెబ్తున్నారు. ఆమె మాటల్లో, “నా కుమార్తె వినలేదు; ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా. మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది?.”
మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య దీర్ఘకాలంగా జరుగుతున్న ఘర్షణ బస్తర్లోని ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు భద్రతా బలగాలు పాల్పడ్డాయని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి:, రాజ్య పోలీసు సిబ్బందిపైన 16 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.
బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లోనే భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని 2018లో 23 ఏళ్ల ఆదివాసీ మహిళ చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పసికందు తుపాకీ గుండు తగిలి చనిపోయింది. మావోయిస్టులు ఆ శిశువుని హత్య చేశారని పోలీసులు అంటూంటే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న వారిపై పోలీసులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ మావోయిస్టులను శాంతిభద్రతల సమస్యగా చూస్తూ, గతంలో ఆపరేషన్ గ్రీన్హంట్ వంటి విభిన్న ప్రయత్నాల ద్వారా మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రయత్నించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ను ప్రారంభించింది.
ప్రస్తుత ఆపరేషన్ కగార్ను ఆపరేషన్ను సమాధాన్ - ప్రహార్కు పొడిగింపుగానే చూడాలి. 2023 డిసెంబరులో ఛత్తీస్గఢ్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమయ్యాయి - 2024లో, పోలీసు నివేదికల ప్రకారం, 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లో కంటే మూడు రెట్లు ఎక్కువ.
క్రోనీ క్యాపిటలిస్టుల, వారి సామ్రాజ్యవాద భాగస్వాముల పరిశ్రమల స్థాపనకు ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ భూమిని లాక్కోవడానికి వీలుగా చట్టాలలో తీసుకువచ్చిన మార్పులతో పాటు ఈ సైనిక చర్యలను చూడాలి. "అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023"ను పార్లమెంటులో సులభంగా ఆమోదించడం లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను కల్పించే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ (పెసా) చట్టం-1996 అమలు కాకపోవడం, ముఖ్యంగా సహజ వనరుల నిర్వహణ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల మెరుగుదల పట్ల ప్రభుత్వానికి సుముఖత లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మావోయిస్టులు సమాజంలోని అణగారిన వర్గాల తరపున సామాజిక కారణాలపై పోరాడుతూనే ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను లేవనెత్తుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలను, ముఖ్యంగా పేద ఆదివాసీలని గురించి పట్టించుకోవడం లేదని ఇది చూపిస్తుంది.
ప్రభుత్వ సైనిక చర్యలు పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు ప్రభుత్వాలను తమ పౌరులపై యుద్ధం చేయకుండా నిరోధిస్తాయి,
సాయుధ ప్రతిఘటనతో సహా తమ ప్రాణాలను, భద్రతను అన్ని విధాలుగా రక్షించుకునే హక్కును ఈ ఒప్పందాలు తిరుగుబాటుదారులకు ఇస్తాయి.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని సర్కేగూడ, కొత్తగూడ, రాజ్పెంట గ్రామాల్లో 2012లో ఎన్కౌంటర్ పేరుతో 17 మంది ఆదివాసీలను హత్య చేసిన ఘటనను సిడిఆర్ఓ నిజనిర్ధారణ బృందం వెలుగులోకి తెచ్చింది.
ఆ తరువాత మా బృందం పరిశోధనలను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఫలితాలు సమర్థించాయి. అలాగే, 2023లో, ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వం జరిపిన ఇంతకు ముందెన్నడూ ఎరుగని వైమానిక బాంబు దాడులు, పోలీసు క్యాంపుల ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత పైన, రోడ్ల నిర్మాణం కోసం జరిగిన అక్రమ, బలవంతపు భూ సేకరణకు సంబంధించి అనేక ఉదంతాలను, విషయాలను డాక్యుమెంట్ చేసాం.
పేద ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రస్తుతమూ, గతంలోనూ సైనిక, సాయుధ బలగాలతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మావోయిస్టు సమస్య సామాజిక రాజకీయ సమస్య అని, సైనిక పరిష్కారాల ద్వారా కాకుండా రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని దృఢంగా భావిస్తున్నాం. ఆపరేషన్ గ్రీన్హంట్, సమాధాన్-ప్రహార్ లేదా కగార్ లాంటి సైనిక పరిష్కారం ద్వారా కొంతమంది మావోయిస్టులను చంపగలరేమో కానీ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలి.
సిడిఆర్ వో డిమాండ్లు:
సామాజిక-ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం;
సాయుధ బలగాలను వెంటనే బ్యారక్లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మావోయిస్టులను నియంత్రించే పేరుతో ఆదివాసీల ఎన్కౌంటర్ హత్యలు, ఆదివాసీ మహిళల వేధింపులను ఆపివేయాలి.
బలగాల కార్యనిర్వహణ పద్ధతిపై దృష్టి సారించేందుకు కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి న్యాయ కమిషన్ను ఏర్పాటు చేయాలి.
మావోయిస్టు సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం షరతులు లేని సంభాషణను ప్రారంభించాలి: పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభించాలి; అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దోపిడీకోసం అటవీ, ఆదివాసీల భూముల సేకరణను ఆపాలి.
సిడిఆర్ఓ సమన్వయకర్తలు :
(ఆశిష్ గుప్తా)
(తపస్ చక్రవర్తి)
(క్రాంతి చైతన్య)
సిడిఆర్ఓ భాగస్వామ్య సంస్థలు:
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (పంజాబ్);
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (, హర్యానా),
అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (పశ్చిమ బెంగాల్);
అసన్సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్ (పశ్చిమ బెంగాల్);
బందీ ముక్తి కమిటీ (పశ్చిమ బెంగాల్);
పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్);
పౌర హక్కుల సంఘం (తెలంగాణ);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (మహారాష్ట్ర);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (తమిళనాడు);
కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్(మణిపూర్);
మానబ్ అధికార్ సంగ్రామ్ సమితి (అస్సాం);
నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్;
మానవ హక్కుల కోసం పీపుల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (జమ్మూ మరియు కాశ్మీర్);
పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరమ్ (కర్ణాటక);
జార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (జార్ఖండ్);
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఢిల్లీ);
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (హర్యానా),
కాంపెయిన్ ఫర్ పీస్ & డెమాక్రసీ ఇన్ మణిపూర్, ఢిల్లీ;
జానకీయ మనుష్యావకాశ ప్రస్థానం, కేరళ
More News...
<%- node_title %>
<%- node_title %>
తుమ్మేనాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
ధర్మపురి సెప్టెంబర్ 5( ప్రజా మంటలు )మండలంలోని "తుమ్మేనాల" ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న "సముద్రాల శిరీష" జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది.
శనివారం జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ జిల్లా విద్యాధికారి... సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్
జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు)జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ల పిలుపు మేరకు సెప్టెంబర్ 10న నిర్వహించనున్న... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన మల్యాల ప్రిన్సిపల్ శివరామకృష్ణ
మల్యాల సెప్టెంబర్5 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న మోతే శివరామకృష్ణ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కళాశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి... తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు?
హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు):కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మౌనం వహిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్కుమార్ ఆరోపించారు. కృష్ణా నదీ... శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా "రుద్రాంగి ఈశాన్వి" గోపిక వేషధారణ
జగిత్యాల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని విద్యాసంస్థల్లో పాఠశాల చిన్నారులచే కృష్ణాష్టమి జన్మ వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం తో పాటు శ్రీకృష్ణుని గోపిక వేషధారణలు అలరించాయి.
ఇదిలా ఉండగా రుద్రాంగి రాఘవేంద్ర శ్రీవిద్య కూతురు రుద్రంగి ఈశాన్వి గౌతమ్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో... రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి
రాయికల్, సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.... సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - విజయలక్ష్మి
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్పర్సన్గా, క్యాబినెట్ మంత్రి హోదాతో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.
తనకు ఈ బాధ్యతలు... త్రాగునీటి సమస్య పై ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
గుంతకల్ సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు)ప్రజా సమస్యల పైన స్థానిక గుంతకల్ ఆర్డీవో కి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు ఈ సంవత్సరం తక్కువ వర్షం నమోదు కావడం వలన పట్టణంలో దాదాపుగా వారానికి ఒకసారి నీళ్లు వదలడం జరుగుతుంది. అందువలన పట్టణ ప్రజలు తాగడానికి మరియు వాడుకోవడానికి నీళ్ల కోసం చాలా... జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
జగిత్యాల, సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్లు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఎజెండాలో పొందుపరిచిన... జగిత్యాల బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
జగిత్యాల జిల్లా బీజేపీలో చాలాకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన... బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు):
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ... 