29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

On
29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్‌కౌంటర్‌ పై సిడిఆర్వో సంచలన ప్రకటన 

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:


 ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గర
ఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని 
ప్రజా స్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ
( కో - ఆర్డినేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ - CDRO ) ఆరోపించింది. 

మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలని సిడిఆర్ వో సూచించింది.

 

ప్రభుత్వ సంస్థలు ఈ మావోయిస్టుల హత్యను ఎన్‌కౌంటర్‌గా పేర్కొన్నప్పటికీ, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదా తీవ్రమైన గాయాలు కూడా లేకపోవడం, మరోవైపు  29 మంది మరణించడం చూస్తే ఇది ఏకపక్ష దాడి అని ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. సిడి ఆర్ వో సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


2017 తరువాత జరిగిన అతిపెద్ద ‘నక్సల్ వ్యతిరేక చర్య’ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన నివేదికలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఇది ఎన్కౌంటర్ కాదని నిస్సందేహంగా నిరూపించాయని సిడీఆర్ ఓ పేర్కొంది. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారని వివిధ  మీడియా పేర్కొందన్నారు. వీరిలో చాలా మంది గ్రామాల్లో నివసిస్తున్న మావోయిస్టుల కేడర్ అని, మావోయిస్టులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తూండవచ్చని పోలీసులు అంటున్నారు అయితే,  నిరుపేద ఆదివాసీ మహిళలు భద్రతా బలగాల అకృత్యాలకు పదే పదే గురికావడాన్ని గతంలో చూసాం. ఉదాహరణకు, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 8 గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో ఒకరు కమ్లీ కుంజమ్. కమ్లీకి చెవుడు వుందని, సరిగ్గా మాట్లాడలేదని ఆమె తల్లి సోమ్లీ చెబ్తున్నారు. ఆమె మాటల్లో, “నా కుమార్తె వినలేదు; ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా. మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది?.”
  మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య దీర్ఘకాలంగా జరుగుతున్న ఘర్షణ బస్తర్‌లోని ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు భద్రతా బలగాలు పాల్పడ్డాయని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి:, రాజ్య పోలీసు సిబ్బందిపైన 16 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.


బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లోనే భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని 2018లో 23 ఏళ్ల ఆదివాసీ మహిళ చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పసికందు తుపాకీ గుండు తగిలి చనిపోయింది. మావోయిస్టులు ఆ శిశువుని హత్య చేశారని పోలీసులు అంటూంటే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న వారిపై పోలీసులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ మావోయిస్టులను శాంతిభద్రతల సమస్యగా చూస్తూ, గతంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ వంటి విభిన్న ప్రయత్నాల ద్వారా మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రయత్నించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను ప్రారంభించింది.
 ప్రస్తుత ఆపరేషన్ కగార్‌ను ఆపరేషన్‌ను సమాధాన్ - ప్రహార్‌కు పొడిగింపుగానే చూడాలి. 2023 డిసెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమయ్యాయి - 2024లో, పోలీసు నివేదికల ప్రకారం, 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లో కంటే మూడు రెట్లు ఎక్కువ.
 క్రోనీ క్యాపిటలిస్టుల, వారి సామ్రాజ్యవాద భాగస్వాముల పరిశ్రమల స్థాపనకు ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ భూమిని లాక్కోవడానికి వీలుగా చట్టాలలో తీసుకువచ్చిన మార్పులతో పాటు ఈ సైనిక చర్యలను చూడాలి. "అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023"ను పార్లమెంటులో సులభంగా ఆమోదించడం లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను కల్పించే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ (పెసా) చట్టం-1996  అమలు కాకపోవడం, ముఖ్యంగా సహజ వనరుల నిర్వహణ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల మెరుగుదల పట్ల ప్రభుత్వానికి  సుముఖత లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మావోయిస్టులు సమాజంలోని అణగారిన వర్గాల తరపున సామాజిక కారణాలపై పోరాడుతూనే ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను లేవనెత్తుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలను, ముఖ్యంగా పేద ఆదివాసీలని గురించి పట్టించుకోవడం లేదని ఇది చూపిస్తుంది.
ప్రభుత్వ సైనిక చర్యలు పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు ప్రభుత్వాలను తమ పౌరులపై యుద్ధం చేయకుండా నిరోధిస్తాయి,
సాయుధ ప్రతిఘటనతో సహా తమ ప్రాణాలను, భద్రతను అన్ని విధాలుగా రక్షించుకునే హక్కును ఈ ఒప్పందాలు తిరుగుబాటుదారులకు ఇస్తాయి.  
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని సర్కేగూడ, కొత్తగూడ, రాజ్‌పెంట గ్రామాల్లో 2012లో ఎన్‌కౌంటర్ పేరుతో 17 మంది ఆదివాసీలను హత్య చేసిన ఘటనను సి‌డి‌ఆర్‌ఓ నిజనిర్ధారణ బృందం వెలుగులోకి తెచ్చింది. 
ఆ తరువాత మా బృందం పరిశోధనలను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఫలితాలు సమర్థించాయి. అలాగే, 2023లో, ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వం జరిపిన ఇంతకు ముందెన్నడూ ఎరుగని  వైమానిక బాంబు దాడులు, పోలీసు క్యాంపుల ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత పైన, రోడ్ల నిర్మాణం కోసం జరిగిన  అక్రమ, బలవంతపు భూ సేకరణకు సంబంధించి అనేక ఉదంతాలను, విషయాలను డాక్యుమెంట్ చేసాం. 
  పేద ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రస్తుతమూ, గతంలోనూ సైనిక, సాయుధ బలగాలతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
 మావోయిస్టు సమస్య సామాజిక రాజకీయ సమస్య అని, సైనిక పరిష్కారాల ద్వారా కాకుండా రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని దృఢంగా భావిస్తున్నాం. ఆపరేషన్ గ్రీన్‌హంట్, సమాధాన్-ప్రహార్ లేదా కగార్‌ లాంటి సైనిక పరిష్కారం ద్వారా కొంతమంది మావోయిస్టులను చంపగలరేమో కానీ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని అంతం చేయడానికి  బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలి.


సిడిఆర్ వో   డిమాండ్లు:

సామాజిక-ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం; 
సాయుధ బలగాలను వెంటనే బ్యారక్‌లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మావోయిస్టులను నియంత్రించే పేరుతో ఆదివాసీల ఎన్‌కౌంటర్ హత్యలు, ఆదివాసీ మహిళల  వేధింపులను ఆపివేయాలి.
 బలగాల కార్యనిర్వహణ పద్ధతిపై దృష్టి సారించేందుకు కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. 
మావోయిస్టు సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం షరతులు లేని సంభాషణను ప్రారంభించాలి: పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభించాలి; అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దోపిడీకోసం అటవీ, ఆదివాసీల భూముల సేకరణను ఆపాలి.

సి‌డి‌ఆర్‌ఓ సమన్వయకర్తలు : 

(ఆశిష్ గుప్తా)
(తపస్ చక్రవర్తి)
(క్రాంతి చైతన్య)

సి‌డి‌ఆర్‌ఓ భాగస్వామ్య సంస్థలు:

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (పంజాబ్); 
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (, హర్యానా),
 అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (పశ్చిమ బెంగాల్); 
అసన్‌సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్ (పశ్చిమ బెంగాల్);
 బందీ ముక్తి కమిటీ (పశ్చిమ బెంగాల్); 
పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్); 
పౌర హక్కుల సంఘం (తెలంగాణ);
 కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (మహారాష్ట్ర);
 కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (తమిళనాడు);
 కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్(మణిపూర్); 
మానబ్ అధికార్ సంగ్రామ్ సమితి (అస్సాం); 
నాగా పీపుల్స్ మూవ్‌మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్; 
మానవ హక్కుల కోసం పీపుల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (జమ్మూ మరియు కాశ్మీర్);
 పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరమ్ (కర్ణాటక); 
జార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (జార్ఖండ్); 
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఢిల్లీ); 
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (హర్యానా),
 కాంపెయిన్ ఫర్ పీస్ & డెమాక్రసీ ఇన్ మణిపూర్, ఢిల్లీ; 
జానకీయ మనుష్యావకాశ ప్రస్థానం, కేరళ

Tags
Join WhatsApp

More News...

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన

యుద్ధానికి ముగింపు కోసం పుతిన్‌తో భేటీ: ట్రంప్ ప్రకటన డావోస్ | జనవరి 22 : ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు తీసుకురావడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను త్వరలోనే కలవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ట్రంప్, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్...
Read More...
National  State News 

బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్‌కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా?

బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్‌కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా? ముంబై జనవరి 22: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త మేయర్‌గా బీజేపీ నేత తేజస్వి గోసాల్కర్ ఎన్నిక కావడంతో ముంబై రాజకీయాల్లోనే కాదు, బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ చర్చలు, అసంతృప్తి మొదలైంది. ఈ ఎన్నిక బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి. తేజస్వి గోసాల్కర్ ఇటీవల జరిగిన...
Read More...
National  State News 

మీర-భాయందర్‌కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్‌ఎస్ తీవ్ర వ్యతిరేకత

మీర-భాయందర్‌కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్‌ఎస్ తీవ్ర వ్యతిరేకత ముంబై జనవరి 22:ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో మరోసారి ‘మరాఠీ వర్సెస్ బయటి వారు’ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఈ వివాదానికి కేంద్రంగా మారింది ముంబై సమీపంలోని మీరా-భాయందర్. మేయర్ పదవికి సంబంధించి బీజేపీ తీసుకునే అవకాశమున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మీరా-భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) తాజా ఎన్నికల్లో...
Read More...

3వ రోజు కొనసాగుతున్న శివ మహాపురాణం

3వ రోజు కొనసాగుతున్న శివ మహాపురాణం జగిత్యాల జనవరి 22 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం గురు వారం 3 వ రోజుకు చేరింది. బ్రహ్మశ్రీ భాస్కర...
Read More...

84 లక్షల ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం పున ప్రారంభించిన, ---- ఎస్టి ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్.

84 లక్షల ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం పున ప్రారంభించిన, ---- ఎస్టి ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్. వెల్గటూర్ జనవరి 22 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో గతంలో ట్రాన్స్ఫార్మాల  కాపర్ దొంగిలించబడి లిఫ్ట్ నడవక రైతులు నానా ఇబ్బందులకు గురయ్యారు. రైతులు మంత్రి దృష్టికి తీసుకుపోగా ఇబ్బందులను తొలగించడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి కి ప్రత్యేకంగా విన్నవించి మంజూరు ఇప్పించారు. ఏసంగి పంటకు నీరు...
Read More...

రాయికల్ మున్సిపల్ ను అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ దే జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత

రాయికల్ మున్సిపల్ ను అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ దే జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత    రాయికల్ జనవరి 22 ( ప్రజా మంటలు)  పట్టణం లో.బి ఆర్ ఎస్  నాయకులతో కలిసి మీడియా సమావేశం లో పాల్గొన్న జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా  మాట్లాడుతూ....* గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ ను మున్సిపల్ గా మార్చి 25 కోట్లతో ప్రతి వార్డులో...
Read More...
National  State News 

విజయ్ టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తు కేటాయింపు

విజయ్ టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తు కేటాయింపు చెన్నై జనవరి 22 (ప్రజా మంటలు): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాజకీయ రంగంలో కీలక అడుగు వేసింది. పార్టీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి ‘విజిల్’ (Whistle) ఎన్నికల...
Read More...

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి       గాజా, జనవరి 22: ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోంది. తాజా ఘటనలో గాజా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి ముగ్గురు జర్నలిస్టులను హతమార్చినట్లు రక్షణ సిబ్బంది మరియు స్థానిక పాత్రికేయులు వెల్లడించారు. సమాచారం సేకరణ కోసం...
Read More...
Crime  State News 

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి.

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి. నంద్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ (AR BCVR) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు భారీగా మంటలు వ్యాపించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు....
Read More...
Sports  International  

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

 న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం నాగ్‌పూర్, జనవరి 21:భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు...
Read More...
Local News  State News 

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం :

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం : కరీంనగర్ జనవరి 21 (ప్రజా మంటలు): పార్లమెంట్ పరిధిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అదేవిధంగా కరీంనగర్...
Read More...
International  

గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు:

గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు: దావోస్ (స్విట్జర్లాండ్) జనవరి 21; డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ నుంచి సైనిక బలంతో స్వాధీనం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్న ట్రంప్, దాని రక్షణ, అభివృద్ధి కోసం అమెరికా యాజమాన్యం అవసరమని...
Read More...