29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

On
29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్‌కౌంటర్‌ పై సిడిఆర్వో సంచలన ప్రకటన 

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:


 ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గర
ఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని 
ప్రజా స్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ
( కో - ఆర్డినేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ - CDRO ) ఆరోపించింది. 

మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలని సిడిఆర్ వో సూచించింది.

 

ప్రభుత్వ సంస్థలు ఈ మావోయిస్టుల హత్యను ఎన్‌కౌంటర్‌గా పేర్కొన్నప్పటికీ, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదా తీవ్రమైన గాయాలు కూడా లేకపోవడం, మరోవైపు  29 మంది మరణించడం చూస్తే ఇది ఏకపక్ష దాడి అని ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. సిడి ఆర్ వో సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


2017 తరువాత జరిగిన అతిపెద్ద ‘నక్సల్ వ్యతిరేక చర్య’ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన నివేదికలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఇది ఎన్కౌంటర్ కాదని నిస్సందేహంగా నిరూపించాయని సిడీఆర్ ఓ పేర్కొంది. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారని వివిధ  మీడియా పేర్కొందన్నారు. వీరిలో చాలా మంది గ్రామాల్లో నివసిస్తున్న మావోయిస్టుల కేడర్ అని, మావోయిస్టులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తూండవచ్చని పోలీసులు అంటున్నారు అయితే,  నిరుపేద ఆదివాసీ మహిళలు భద్రతా బలగాల అకృత్యాలకు పదే పదే గురికావడాన్ని గతంలో చూసాం. ఉదాహరణకు, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 8 గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో ఒకరు కమ్లీ కుంజమ్. కమ్లీకి చెవుడు వుందని, సరిగ్గా మాట్లాడలేదని ఆమె తల్లి సోమ్లీ చెబ్తున్నారు. ఆమె మాటల్లో, “నా కుమార్తె వినలేదు; ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా. మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది?.”
  మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య దీర్ఘకాలంగా జరుగుతున్న ఘర్షణ బస్తర్‌లోని ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు భద్రతా బలగాలు పాల్పడ్డాయని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి:, రాజ్య పోలీసు సిబ్బందిపైన 16 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.


బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లోనే భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని 2018లో 23 ఏళ్ల ఆదివాసీ మహిళ చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పసికందు తుపాకీ గుండు తగిలి చనిపోయింది. మావోయిస్టులు ఆ శిశువుని హత్య చేశారని పోలీసులు అంటూంటే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న వారిపై పోలీసులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ మావోయిస్టులను శాంతిభద్రతల సమస్యగా చూస్తూ, గతంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ వంటి విభిన్న ప్రయత్నాల ద్వారా మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రయత్నించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను ప్రారంభించింది.
 ప్రస్తుత ఆపరేషన్ కగార్‌ను ఆపరేషన్‌ను సమాధాన్ - ప్రహార్‌కు పొడిగింపుగానే చూడాలి. 2023 డిసెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమయ్యాయి - 2024లో, పోలీసు నివేదికల ప్రకారం, 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లో కంటే మూడు రెట్లు ఎక్కువ.
 క్రోనీ క్యాపిటలిస్టుల, వారి సామ్రాజ్యవాద భాగస్వాముల పరిశ్రమల స్థాపనకు ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ భూమిని లాక్కోవడానికి వీలుగా చట్టాలలో తీసుకువచ్చిన మార్పులతో పాటు ఈ సైనిక చర్యలను చూడాలి. "అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023"ను పార్లమెంటులో సులభంగా ఆమోదించడం లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను కల్పించే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ (పెసా) చట్టం-1996  అమలు కాకపోవడం, ముఖ్యంగా సహజ వనరుల నిర్వహణ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల మెరుగుదల పట్ల ప్రభుత్వానికి  సుముఖత లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మావోయిస్టులు సమాజంలోని అణగారిన వర్గాల తరపున సామాజిక కారణాలపై పోరాడుతూనే ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను లేవనెత్తుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలను, ముఖ్యంగా పేద ఆదివాసీలని గురించి పట్టించుకోవడం లేదని ఇది చూపిస్తుంది.
ప్రభుత్వ సైనిక చర్యలు పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు ప్రభుత్వాలను తమ పౌరులపై యుద్ధం చేయకుండా నిరోధిస్తాయి,
సాయుధ ప్రతిఘటనతో సహా తమ ప్రాణాలను, భద్రతను అన్ని విధాలుగా రక్షించుకునే హక్కును ఈ ఒప్పందాలు తిరుగుబాటుదారులకు ఇస్తాయి.  
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని సర్కేగూడ, కొత్తగూడ, రాజ్‌పెంట గ్రామాల్లో 2012లో ఎన్‌కౌంటర్ పేరుతో 17 మంది ఆదివాసీలను హత్య చేసిన ఘటనను సి‌డి‌ఆర్‌ఓ నిజనిర్ధారణ బృందం వెలుగులోకి తెచ్చింది. 
ఆ తరువాత మా బృందం పరిశోధనలను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఫలితాలు సమర్థించాయి. అలాగే, 2023లో, ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వం జరిపిన ఇంతకు ముందెన్నడూ ఎరుగని  వైమానిక బాంబు దాడులు, పోలీసు క్యాంపుల ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత పైన, రోడ్ల నిర్మాణం కోసం జరిగిన  అక్రమ, బలవంతపు భూ సేకరణకు సంబంధించి అనేక ఉదంతాలను, విషయాలను డాక్యుమెంట్ చేసాం. 
  పేద ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రస్తుతమూ, గతంలోనూ సైనిక, సాయుధ బలగాలతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
 మావోయిస్టు సమస్య సామాజిక రాజకీయ సమస్య అని, సైనిక పరిష్కారాల ద్వారా కాకుండా రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని దృఢంగా భావిస్తున్నాం. ఆపరేషన్ గ్రీన్‌హంట్, సమాధాన్-ప్రహార్ లేదా కగార్‌ లాంటి సైనిక పరిష్కారం ద్వారా కొంతమంది మావోయిస్టులను చంపగలరేమో కానీ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని అంతం చేయడానికి  బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలి.


సిడిఆర్ వో   డిమాండ్లు:

సామాజిక-ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం; 
సాయుధ బలగాలను వెంటనే బ్యారక్‌లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మావోయిస్టులను నియంత్రించే పేరుతో ఆదివాసీల ఎన్‌కౌంటర్ హత్యలు, ఆదివాసీ మహిళల  వేధింపులను ఆపివేయాలి.
 బలగాల కార్యనిర్వహణ పద్ధతిపై దృష్టి సారించేందుకు కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. 
మావోయిస్టు సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం షరతులు లేని సంభాషణను ప్రారంభించాలి: పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభించాలి; అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దోపిడీకోసం అటవీ, ఆదివాసీల భూముల సేకరణను ఆపాలి.

సి‌డి‌ఆర్‌ఓ సమన్వయకర్తలు : 

(ఆశిష్ గుప్తా)
(తపస్ చక్రవర్తి)
(క్రాంతి చైతన్య)

సి‌డి‌ఆర్‌ఓ భాగస్వామ్య సంస్థలు:

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (పంజాబ్); 
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (, హర్యానా),
 అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (పశ్చిమ బెంగాల్); 
అసన్‌సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్ (పశ్చిమ బెంగాల్);
 బందీ ముక్తి కమిటీ (పశ్చిమ బెంగాల్); 
పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్); 
పౌర హక్కుల సంఘం (తెలంగాణ);
 కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (మహారాష్ట్ర);
 కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (తమిళనాడు);
 కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్(మణిపూర్); 
మానబ్ అధికార్ సంగ్రామ్ సమితి (అస్సాం); 
నాగా పీపుల్స్ మూవ్‌మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్; 
మానవ హక్కుల కోసం పీపుల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (జమ్మూ మరియు కాశ్మీర్);
 పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరమ్ (కర్ణాటక); 
జార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (జార్ఖండ్); 
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఢిల్లీ); 
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (హర్యానా),
 కాంపెయిన్ ఫర్ పీస్ & డెమాక్రసీ ఇన్ మణిపూర్, ఢిల్లీ; 
జానకీయ మనుష్యావకాశ ప్రస్థానం, కేరళ

Tags
Join WhatsApp

More News...

Local News 

ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు : ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు

ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు : ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఇబ్రహింపట్నం డిసెంబర్ 30(ప్రజ మంటలు దగ్గుల అశోక్)   జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని గోదుర్, తిమ్మపుర్, యామపుర్, పకిర్ కోండా పుర్, వేములకుర్తి, ఎర్దండి, కోమటీకోండాపుర్, వర్షకోండ, ఇబ్రహీంపట్నం, డబ్బ గ్రామాలలో  వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గ్రామలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ స్వామి తదితర ఈకార్యక్రమంలో...
Read More...
Local News 

ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం

ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం గొల్లపల్లి, డిసెంబర్ 30 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన చాతల్ల పోషవ్వ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వానికి మారు పేరు...
Read More...

జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక 

జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక  జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు   ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్...
Read More...

ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి.  ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, 

ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి.  ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,  జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ...
Read More...

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు): టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత...
Read More...

అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు): అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన...
Read More...

తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్...
Read More...

లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్

లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్ జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు) జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు...  ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు...
Read More...

కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు) ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో  మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు  పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,...
Read More...
Local News  State News 

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో...
Read More...
Local News  State News 

ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌ నిర్వహణపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌ నిర్వహణపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) : రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్–నాదర్‌గుల్–కందుకూర్ ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్‌ఆర్‌సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్‌లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని...
Read More...
Local News 

అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో 

అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో  సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు): ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్  సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్‌లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా...
Read More...