29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ - పోలీస్ బలగాల ఏకపక్ష దాడి
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్కౌంటర్ పై సిడిఆర్వో సంచలన ప్రకటన
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:
ఛత్తీస్గఢ్లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గర
ఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని
ప్రజా స్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ
( కో - ఆర్డినేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ - CDRO ) ఆరోపించింది.
మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలని సిడిఆర్ వో సూచించింది.
ప్రభుత్వ సంస్థలు ఈ మావోయిస్టుల హత్యను ఎన్కౌంటర్గా పేర్కొన్నప్పటికీ, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదా తీవ్రమైన గాయాలు కూడా లేకపోవడం, మరోవైపు 29 మంది మరణించడం చూస్తే ఇది ఏకపక్ష దాడి అని ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. సిడి ఆర్ వో సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2017 తరువాత జరిగిన అతిపెద్ద ‘నక్సల్ వ్యతిరేక చర్య’ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన నివేదికలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఇది ఎన్కౌంటర్ కాదని నిస్సందేహంగా నిరూపించాయని సిడీఆర్ ఓ పేర్కొంది. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారని వివిధ మీడియా పేర్కొందన్నారు. వీరిలో చాలా మంది గ్రామాల్లో నివసిస్తున్న మావోయిస్టుల కేడర్ అని, మావోయిస్టులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తూండవచ్చని పోలీసులు అంటున్నారు అయితే, నిరుపేద ఆదివాసీ మహిళలు భద్రతా బలగాల అకృత్యాలకు పదే పదే గురికావడాన్ని గతంలో చూసాం. ఉదాహరణకు, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 8 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో ఒకరు కమ్లీ కుంజమ్. కమ్లీకి చెవుడు వుందని, సరిగ్గా మాట్లాడలేదని ఆమె తల్లి సోమ్లీ చెబ్తున్నారు. ఆమె మాటల్లో, “నా కుమార్తె వినలేదు; ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా. మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది?.”
మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య దీర్ఘకాలంగా జరుగుతున్న ఘర్షణ బస్తర్లోని ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు భద్రతా బలగాలు పాల్పడ్డాయని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి:, రాజ్య పోలీసు సిబ్బందిపైన 16 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.
బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లోనే భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని 2018లో 23 ఏళ్ల ఆదివాసీ మహిళ చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పసికందు తుపాకీ గుండు తగిలి చనిపోయింది. మావోయిస్టులు ఆ శిశువుని హత్య చేశారని పోలీసులు అంటూంటే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న వారిపై పోలీసులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ మావోయిస్టులను శాంతిభద్రతల సమస్యగా చూస్తూ, గతంలో ఆపరేషన్ గ్రీన్హంట్ వంటి విభిన్న ప్రయత్నాల ద్వారా మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రయత్నించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ను ప్రారంభించింది.
ప్రస్తుత ఆపరేషన్ కగార్ను ఆపరేషన్ను సమాధాన్ - ప్రహార్కు పొడిగింపుగానే చూడాలి. 2023 డిసెంబరులో ఛత్తీస్గఢ్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమయ్యాయి - 2024లో, పోలీసు నివేదికల ప్రకారం, 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లో కంటే మూడు రెట్లు ఎక్కువ.
క్రోనీ క్యాపిటలిస్టుల, వారి సామ్రాజ్యవాద భాగస్వాముల పరిశ్రమల స్థాపనకు ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ భూమిని లాక్కోవడానికి వీలుగా చట్టాలలో తీసుకువచ్చిన మార్పులతో పాటు ఈ సైనిక చర్యలను చూడాలి. "అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023"ను పార్లమెంటులో సులభంగా ఆమోదించడం లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను కల్పించే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ (పెసా) చట్టం-1996 అమలు కాకపోవడం, ముఖ్యంగా సహజ వనరుల నిర్వహణ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల మెరుగుదల పట్ల ప్రభుత్వానికి సుముఖత లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మావోయిస్టులు సమాజంలోని అణగారిన వర్గాల తరపున సామాజిక కారణాలపై పోరాడుతూనే ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను లేవనెత్తుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలను, ముఖ్యంగా పేద ఆదివాసీలని గురించి పట్టించుకోవడం లేదని ఇది చూపిస్తుంది.
ప్రభుత్వ సైనిక చర్యలు పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు ప్రభుత్వాలను తమ పౌరులపై యుద్ధం చేయకుండా నిరోధిస్తాయి,
సాయుధ ప్రతిఘటనతో సహా తమ ప్రాణాలను, భద్రతను అన్ని విధాలుగా రక్షించుకునే హక్కును ఈ ఒప్పందాలు తిరుగుబాటుదారులకు ఇస్తాయి.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని సర్కేగూడ, కొత్తగూడ, రాజ్పెంట గ్రామాల్లో 2012లో ఎన్కౌంటర్ పేరుతో 17 మంది ఆదివాసీలను హత్య చేసిన ఘటనను సిడిఆర్ఓ నిజనిర్ధారణ బృందం వెలుగులోకి తెచ్చింది.
ఆ తరువాత మా బృందం పరిశోధనలను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఫలితాలు సమర్థించాయి. అలాగే, 2023లో, ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వం జరిపిన ఇంతకు ముందెన్నడూ ఎరుగని వైమానిక బాంబు దాడులు, పోలీసు క్యాంపుల ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత పైన, రోడ్ల నిర్మాణం కోసం జరిగిన అక్రమ, బలవంతపు భూ సేకరణకు సంబంధించి అనేక ఉదంతాలను, విషయాలను డాక్యుమెంట్ చేసాం.
పేద ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రస్తుతమూ, గతంలోనూ సైనిక, సాయుధ బలగాలతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మావోయిస్టు సమస్య సామాజిక రాజకీయ సమస్య అని, సైనిక పరిష్కారాల ద్వారా కాకుండా రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని దృఢంగా భావిస్తున్నాం. ఆపరేషన్ గ్రీన్హంట్, సమాధాన్-ప్రహార్ లేదా కగార్ లాంటి సైనిక పరిష్కారం ద్వారా కొంతమంది మావోయిస్టులను చంపగలరేమో కానీ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలి.
సిడిఆర్ వో డిమాండ్లు:
సామాజిక-ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం;
సాయుధ బలగాలను వెంటనే బ్యారక్లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మావోయిస్టులను నియంత్రించే పేరుతో ఆదివాసీల ఎన్కౌంటర్ హత్యలు, ఆదివాసీ మహిళల వేధింపులను ఆపివేయాలి.
బలగాల కార్యనిర్వహణ పద్ధతిపై దృష్టి సారించేందుకు కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి న్యాయ కమిషన్ను ఏర్పాటు చేయాలి.
మావోయిస్టు సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం షరతులు లేని సంభాషణను ప్రారంభించాలి: పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభించాలి; అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దోపిడీకోసం అటవీ, ఆదివాసీల భూముల సేకరణను ఆపాలి.
సిడిఆర్ఓ సమన్వయకర్తలు :
(ఆశిష్ గుప్తా)
(తపస్ చక్రవర్తి)
(క్రాంతి చైతన్య)
సిడిఆర్ఓ భాగస్వామ్య సంస్థలు:
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (పంజాబ్);
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (, హర్యానా),
అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (పశ్చిమ బెంగాల్);
అసన్సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్ (పశ్చిమ బెంగాల్);
బందీ ముక్తి కమిటీ (పశ్చిమ బెంగాల్);
పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్);
పౌర హక్కుల సంఘం (తెలంగాణ);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (మహారాష్ట్ర);
కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (తమిళనాడు);
కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్(మణిపూర్);
మానబ్ అధికార్ సంగ్రామ్ సమితి (అస్సాం);
నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్;
మానవ హక్కుల కోసం పీపుల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (జమ్మూ మరియు కాశ్మీర్);
పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరమ్ (కర్ణాటక);
జార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (జార్ఖండ్);
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఢిల్లీ);
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (హర్యానా),
కాంపెయిన్ ఫర్ పీస్ & డెమాక్రసీ ఇన్ మణిపూర్, ఢిల్లీ;
జానకీయ మనుష్యావకాశ ప్రస్థానం, కేరళ
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి_ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
జగిత్యాల ఫిబ్రవరి 24 (ప్రజా మంటలు)పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... గడ్డి మందు వినియోగంలో రైతుల ఆలోచనలో మార్పు రావాలి డా ఏం.మహేశ్ రెడ్డి
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి దీని వినియోగంలో రైతుల్లో మార్పు రావాలని వైద్యులు మర్రి మహేష్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపురం గ్రామంలో డా,,మర్రి మహేష్ రెడ్డి ఆద్వర్యంలో పారాక్వాట్ గడ్డి మందు మరియు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించబడింది.... ఎమ్మెల్యే ,పలువురు మంత్రులతో సీఎం ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల ఫిబ్రవరి 24 ( ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన సమిండ్ల వాణీ శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మన్ కుమార్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని,రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ఈ... బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్ లు
హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. బోగ శ్రావణి తో కలిసి హైదరాబాద్ లో... ఎంపీ అరవిందును డా బోగ శ్రావణి తో కలిసిన జగిత్యాల రాయికల్ బిజెపి కౌన్సిలర్లు
హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల మరియు రాయికల్ పట్టణ కౌన్సిలర్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా .భోగ శ్రావణి తో కలిసి హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల ఫిబ్రవరి 23 (ప్రజా మంటలు)
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు... ఓ సి(అగ్రవర్ణాల) రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ 10 శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి : పొలాడి రామారావు.
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 23(ప్రజా మంటలు)
దేశంలో ఇతర కులాలు (ఓ సి– అధర్ క్యాస్ట్ / అగ్రవర్ణాలు) ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక అన్యాయాలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఓసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక,న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మహా ధర్నా... టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునికి వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జిఓలు
కరీంనగర్ ఫిబ్రవరి 22 ( ప్రజా మంటలు)సన్మానించిన జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి. కరీంనగర్ లో ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మరియు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ వివాహ వార్షికోత్సవం సందర్బంగా జగిత్యాల టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి అధ్వర్యంలో... దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి
ములుగు జిల్లా (ప్రజా మంటలు):ములుగు జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు ₹600 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు అన్ని అంచనాలను ప్రభుత్వ ఆమోదానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల పంప్... మల్యాల వరద కాలువలో కారు పడి తిర్మణి రమణ మృతి – పెగడపల్లిలో విషాదం
జగిత్యాల జిల్లా (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ తిర్మణి రమణ మల్యాల వరద కాలువలో కారుతో సహా మృతిచెందిన స్థితిలో కనిపించారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... భీమ్రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండలంలోని భీమ్రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు.... పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి అజ్మీరా రాజేశ్వరి సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు మరియు క్రీడలపై అపార ఆసక్తితో కృషి చేస్తున్న రాజేశ్వరి, హైదరాబాద్లోని Koti Women's College లో... 