29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

On
29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

29 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ -  పోలీస్ బలగాల ఏకపక్ష దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ - నారాయణపూర్ సరిహద్దు ఎన్‌కౌంటర్‌ పై సిడిఆర్వో సంచలన ప్రకటన 

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27:


 ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ - నారాయణపూర్ సరిహద్దు దగ్గర
ఏప్రిల్ 16వ తేదీన భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను చంపేసాయని 
ప్రజా స్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ
( కో - ఆర్డినేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ - CDRO ) ఆరోపించింది. 

మావోయిస్టుల ఉద్యమాన్ని అంతం చేయడానికి బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలని సిడిఆర్ వో సూచించింది.

 

ప్రభుత్వ సంస్థలు ఈ మావోయిస్టుల హత్యను ఎన్‌కౌంటర్‌గా పేర్కొన్నప్పటికీ, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం లేదా తీవ్రమైన గాయాలు కూడా లేకపోవడం, మరోవైపు  29 మంది మరణించడం చూస్తే ఇది ఏకపక్ష దాడి అని ఎవరికైనా అనుమానం కలుగుతుందన్నారు. సిడి ఆర్ వో సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


2017 తరువాత జరిగిన అతిపెద్ద ‘నక్సల్ వ్యతిరేక చర్య’ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చిన నివేదికలు ఈ హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఇది ఎన్కౌంటర్ కాదని నిస్సందేహంగా నిరూపించాయని సిడీఆర్ ఓ పేర్కొంది. మృతుల్లో 15 మందికి పైగా మహిళలు ఉన్నారని వివిధ  మీడియా పేర్కొందన్నారు. వీరిలో చాలా మంది గ్రామాల్లో నివసిస్తున్న మావోయిస్టుల కేడర్ అని, మావోయిస్టులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తూండవచ్చని పోలీసులు అంటున్నారు అయితే,  నిరుపేద ఆదివాసీ మహిళలు భద్రతా బలగాల అకృత్యాలకు పదే పదే గురికావడాన్ని గతంలో చూసాం. ఉదాహరణకు, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 8 గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో ఒకరు కమ్లీ కుంజమ్. కమ్లీకి చెవుడు వుందని, సరిగ్గా మాట్లాడలేదని ఆమె తల్లి సోమ్లీ చెబ్తున్నారు. ఆమె మాటల్లో, “నా కుమార్తె వినలేదు; ఆమె చెవిటిది. ఆమె సరిగ్గా మాట్లాడలేదు కూడా. మావోయిస్టులకు ఎలా సహాయం చేస్తుంది?.”
  మావోయిస్టులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య దీర్ఘకాలంగా జరుగుతున్న ఘర్షణ బస్తర్‌లోని ఆదివాసీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఆదివాసీ మహిళలపై క్రూరమైన లైంగిక, శారీరక హింసకు భద్రతా బలగాలు పాల్పడ్డాయని అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి:, రాజ్య పోలీసు సిబ్బందిపైన 16 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమని 2017లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది.


బీజాపూర్ జిల్లాలోని తన ఇంట్లోనే భద్రతా బలగాలు తనపై అత్యాచారం చేశాయని 2018లో 23 ఏళ్ల ఆదివాసీ మహిళ చెప్పింది. ఈ ఏడాది 6 నెలల పసికందు తుపాకీ గుండు తగిలి చనిపోయింది. మావోయిస్టులు ఆ శిశువుని హత్య చేశారని పోలీసులు అంటూంటే, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న వారిపై పోలీసులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్నీ మావోయిస్టులను శాంతిభద్రతల సమస్యగా చూస్తూ, గతంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్ వంటి విభిన్న ప్రయత్నాల ద్వారా మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రయత్నించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను ప్రారంభించింది.
 ప్రస్తుత ఆపరేషన్ కగార్‌ను ఆపరేషన్‌ను సమాధాన్ - ప్రహార్‌కు పొడిగింపుగానే చూడాలి. 2023 డిసెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భద్రతా దళాల చర్యలు తీవ్రతరమయ్యాయి - 2024లో, పోలీసు నివేదికల ప్రకారం, 79 మంది మావోయిస్టులు మరణించారు, ఈ సంఖ్య 2023లో కంటే మూడు రెట్లు ఎక్కువ.
 క్రోనీ క్యాపిటలిస్టుల, వారి సామ్రాజ్యవాద భాగస్వాముల పరిశ్రమల స్థాపనకు ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ భూమిని లాక్కోవడానికి వీలుగా చట్టాలలో తీసుకువచ్చిన మార్పులతో పాటు ఈ సైనిక చర్యలను చూడాలి. "అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023"ను పార్లమెంటులో సులభంగా ఆమోదించడం లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను కల్పించే షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీల విస్తరణ (పెసా) చట్టం-1996  అమలు కాకపోవడం, ముఖ్యంగా సహజ వనరుల నిర్వహణ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల మెరుగుదల పట్ల ప్రభుత్వానికి  సుముఖత లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మావోయిస్టులు సమాజంలోని అణగారిన వర్గాల తరపున సామాజిక కారణాలపై పోరాడుతూనే ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను లేవనెత్తుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ప్రజలను, ముఖ్యంగా పేద ఆదివాసీలని గురించి పట్టించుకోవడం లేదని ఇది చూపిస్తుంది.
ప్రభుత్వ సైనిక చర్యలు పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలు ప్రభుత్వాలను తమ పౌరులపై యుద్ధం చేయకుండా నిరోధిస్తాయి,
సాయుధ ప్రతిఘటనతో సహా తమ ప్రాణాలను, భద్రతను అన్ని విధాలుగా రక్షించుకునే హక్కును ఈ ఒప్పందాలు తిరుగుబాటుదారులకు ఇస్తాయి.  
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని సర్కేగూడ, కొత్తగూడ, రాజ్‌పెంట గ్రామాల్లో 2012లో ఎన్‌కౌంటర్ పేరుతో 17 మంది ఆదివాసీలను హత్య చేసిన ఘటనను సి‌డి‌ఆర్‌ఓ నిజనిర్ధారణ బృందం వెలుగులోకి తెచ్చింది. 
ఆ తరువాత మా బృందం పరిశోధనలను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఫలితాలు సమర్థించాయి. అలాగే, 2023లో, ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వం జరిపిన ఇంతకు ముందెన్నడూ ఎరుగని  వైమానిక బాంబు దాడులు, పోలీసు క్యాంపుల ఏర్పాటు వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత పైన, రోడ్ల నిర్మాణం కోసం జరిగిన  అక్రమ, బలవంతపు భూ సేకరణకు సంబంధించి అనేక ఉదంతాలను, విషయాలను డాక్యుమెంట్ చేసాం. 
  పేద ఆదివాసీలకు వ్యతిరేకంగా ప్రస్తుతమూ, గతంలోనూ సైనిక, సాయుధ బలగాలతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
 మావోయిస్టు సమస్య సామాజిక రాజకీయ సమస్య అని, సైనిక పరిష్కారాల ద్వారా కాకుండా రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని దృఢంగా భావిస్తున్నాం. ఆపరేషన్ గ్రీన్‌హంట్, సమాధాన్-ప్రహార్ లేదా కగార్‌ లాంటి సైనిక పరిష్కారం ద్వారా కొంతమంది మావోయిస్టులను చంపగలరేమో కానీ మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని అంతం చేయడానికి  బదులు, ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడంలో చిత్తశుద్ధి ఉంటే కనక, సమాజంలోని పేద వర్గాలను మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్న అభివృద్ధి నమూనాను ప్రభుత్వం అపి వేయాలి.


సిడిఆర్ వో   డిమాండ్లు:

సామాజిక-ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం; 
సాయుధ బలగాలను వెంటనే బ్యారక్‌లకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మావోయిస్టులను నియంత్రించే పేరుతో ఆదివాసీల ఎన్‌కౌంటర్ హత్యలు, ఆదివాసీ మహిళల  వేధింపులను ఆపివేయాలి.
 బలగాల కార్యనిర్వహణ పద్ధతిపై దృష్టి సారించేందుకు కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. 
మావోయిస్టు సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం షరతులు లేని సంభాషణను ప్రారంభించాలి: పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాలను వాస్తవికంగా అమలు చేయడం ప్రారంభించాలి; అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దోపిడీకోసం అటవీ, ఆదివాసీల భూముల సేకరణను ఆపాలి.

సి‌డి‌ఆర్‌ఓ సమన్వయకర్తలు : 

(ఆశిష్ గుప్తా)
(తపస్ చక్రవర్తి)
(క్రాంతి చైతన్య)

సి‌డి‌ఆర్‌ఓ భాగస్వామ్య సంస్థలు:

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (పంజాబ్); 
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (, హర్యానా),
 అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (పశ్చిమ బెంగాల్); 
అసన్‌సోల్ సివిల్ రైట్స్ అసోసియేషన్ (పశ్చిమ బెంగాల్);
 బందీ ముక్తి కమిటీ (పశ్చిమ బెంగాల్); 
పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్); 
పౌర హక్కుల సంఘం (తెలంగాణ);
 కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (మహారాష్ట్ర);
 కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ (తమిళనాడు);
 కో-ఆర్డినేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్(మణిపూర్); 
మానబ్ అధికార్ సంగ్రామ్ సమితి (అస్సాం); 
నాగా పీపుల్స్ మూవ్‌మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్; 
మానవ హక్కుల కోసం పీపుల్స్ కమిటీ ఫర్ హ్యూమన్ రైట్స్ (జమ్మూ మరియు కాశ్మీర్);
 పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరమ్ (కర్ణాటక); 
జార్ఖండ్ కౌన్సిల్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (జార్ఖండ్); 
పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఢిల్లీ); 
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్ (హర్యానా),
 కాంపెయిన్ ఫర్ పీస్ & డెమాక్రసీ ఇన్ మణిపూర్, ఢిల్లీ; 
జానకీయ మనుష్యావకాశ ప్రస్థానం, కేరళ

Tags
Join WhatsApp

More News...

State News 

రెండేళ్ళ బాబుకు అరుదైన ‘బబుల్- హెడ్ డాల్ సిండ్రోమ్ వ్యాధి.

రెండేళ్ళ బాబుకు అరుదైన ‘బబుల్- హెడ్ డాల్ సిండ్రోమ్ వ్యాధి. మెడికవర్ హాస్పిటల్స్ లో  క్లిష్టమైన శస్త్రచికిత్స సక్సెస్     సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు): అత్యంత అరుదైన బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రెండేళ్ళ చిన్నారికి సికింద్రాబాద్  మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు న్యూరో-ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి, పున:ర్జన్మ ప్రసాదించారు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు ఇందుకు సంబందించిన...
Read More...

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_  మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి నవంబర్ 25 ( ప్రజా మంటలు)మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_ మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ వడ్డీలేని ఋణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న...
Read More...

ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం

ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణము నెలకొందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. ▪️ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి,9మంది ఆడబిడ్డలకు మంజూరైన 9...
Read More...

రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు  ,వాహనాలు వెళ్లడం ఎలా?

రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు  ,వాహనాలు వెళ్లడం ఎలా? ? జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో నానాటికి ట్రాఫిక్ పెరుగుతుంది. దీనికి కారణం రవాణా సౌకర్యాలు పెరిగి పోరుగు జిల్లాలు దగ్గర కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రానికి పొరుగు జిల్లాల వాళ్ళు రావడం మరింత ట్రా "ఫికర్ " అయింది. వీటన్నిటికీ తోడు జిల్లాలో ఏ మూల చూసినా పశువులే...
Read More...

తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ

తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ హైదరాబాద్‌ నవంబర్ 25 (ప్రజా మంటలు): డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు దేశ-విదేశాల నుండి భారీగా ప్రతినిధులు హాజరుకానుండగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా అన్ని...
Read More...

వరంగల్‌లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ

వరంగల్‌లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ వ‌రంగ‌ల్‌ నవంబర్ 25 (ప్రజా మంటలు): మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి పేరుతో యువకులను మోసం చేసే నిత్య పెళ్లికూతురు ఘరానా మరోసారి బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిర (30) ఇదే తరహా మోసాలతో పలువురిని మభ్యపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే… వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి...
Read More...

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు): మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్న కె. చందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం...
Read More...

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు...
Read More...

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం  రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.    జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి...
Read More...

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఐ  హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ  అనారోగ్యంతో  బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి...
Read More...

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి?

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి? హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు): ఐబొమ్మ బెట్టింగ్ వెబ్‌సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు...
Read More...
Local News  Crime 

పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు 

పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):   బుగ్గారం మండలంలోని గోపులాపూర్ పల్లె ప్రక్రుతి వనం గంజాయి తో పట్టు బడ్డ యువకులు ఏ1 సురజ్ కుమార్,సం18  ఏ2. రాహుల్ కుమార్,బీహార్ రాష్ట్రం చెందిన  ఇద్దరు యువకులు  గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరీ వద్ద 60 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని ఎన్డిపిఎస్ సెక్షన్...
Read More...