మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి
మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం
#నిజాం కు పట్టిన గతే పడుతుంది
#భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ
#కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు
#మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు
#కాంగ్రెస్ తోనే అభివృద్ధి
కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్ - ప్రజా మంటలు )
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు కోరుట్ల శివార్ లో జరిగిన జన జాతర భహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడే సందర్బంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గడీల పాలన అంతమై ప్రజా పాలన మొదలైందని నా పై అక్రమ కేసులు పెట్టిన కెసిఆర్ నడుం విరిగిపడి ఇంట్లో పడుకున్నాడని అన్నారు. అనంతరం బీజేపీ, మోదీ మరియు అమిత్ షా పై విరుచుకుపడిన సీఎం దేశానికి ప్రధాని,పెద్ద వారు అని మోదీకి గౌరవం ఇస్తే నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా మీరు బెదిరిస్తే బెదిరే వారు లేరిక్కడ మీ దగ్గర
సిబిఐ, ఈడి లు ఉంటే నాకు నాల్గున్నర కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భయపెట్టి పెత్తనం చేయాలంటే నిజాం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అన్ని తామే చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమి లేదని గాడిద గుడ్డు తో ఉన్న గుర్తు ను ప్రజలకు చూపిస్తూ నినాదాలు చేయించారు. ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కాదని ఒక ప్రత్యేక పరిస్థితి లో వచ్చిన 18వ పార్లమెంట్ ఎన్నికలని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ అబుకి బారు 400అనే నినాదం తో వచ్చిందని బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని దీనివల్ల మైనారిటీ, దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట్టు చేయాలని ఆ విధంగా చేస్తే అధికారం లోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతామని పాద యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడని, తెలంగాణ లో కుల గణన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలా అనుభవం కలవారని గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన కు ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియవని అన్నారు.మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పోయిన ఎన్నికలలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చాడని కానీ ఐదేండ్లయినా తేలేదని ఇంకా నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవా చేశారు.అభివృద్ధి కావాలంటే ఎంపీ అభ్యర్థి ప్రజల మనిషి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ముత్యం పేట చెక్కర కర్మాగారాన్ని తెరిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు, కొంరెడ్డి కరం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దుమారం లేపుతున్న మమత బెనర్జీ వ్యాఖ్యలు – రాజకీయ సందేశం ఏంటి?
కలకత్తా జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి దేశవ్యాప్తంగా కలకలం రేపిన వేళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఘటనను కేవలం ప్రమాదంగా చూడలేమన్న ఆమె అభిప్రాయం, పూర్తి స్థాయి విచారణ అవసరమని చెప్పడం కొత్త... ఇదొక మనసును కలచివేసే, ఆలోచింపజేసే విషాదం.
అజిత్ పవర్ విమాన ప్రమాద దృశ్యాలు విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
ముంబయి, జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కుప్పకూలి, ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ... దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 27 ( ప్రజా మంటలు)సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి... భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం
న్యూఢిల్లీ, జనవరి 27 (ప్రజా మంటలు):
భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా **“అన్ని ఒప్పందాలకు తల్లి”**గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక... సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... 