మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి
మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం
#నిజాం కు పట్టిన గతే పడుతుంది
#భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ
#కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు
#మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు
#కాంగ్రెస్ తోనే అభివృద్ధి
కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్ - ప్రజా మంటలు )
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు కోరుట్ల శివార్ లో జరిగిన జన జాతర భహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడే సందర్బంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గడీల పాలన అంతమై ప్రజా పాలన మొదలైందని నా పై అక్రమ కేసులు పెట్టిన కెసిఆర్ నడుం విరిగిపడి ఇంట్లో పడుకున్నాడని అన్నారు. అనంతరం బీజేపీ, మోదీ మరియు అమిత్ షా పై విరుచుకుపడిన సీఎం దేశానికి ప్రధాని,పెద్ద వారు అని మోదీకి గౌరవం ఇస్తే నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా మీరు బెదిరిస్తే బెదిరే వారు లేరిక్కడ మీ దగ్గర
సిబిఐ, ఈడి లు ఉంటే నాకు నాల్గున్నర కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భయపెట్టి పెత్తనం చేయాలంటే నిజాం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అన్ని తామే చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమి లేదని గాడిద గుడ్డు తో ఉన్న గుర్తు ను ప్రజలకు చూపిస్తూ నినాదాలు చేయించారు. ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కాదని ఒక ప్రత్యేక పరిస్థితి లో వచ్చిన 18వ పార్లమెంట్ ఎన్నికలని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ అబుకి బారు 400అనే నినాదం తో వచ్చిందని బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని దీనివల్ల మైనారిటీ, దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట్టు చేయాలని ఆ విధంగా చేస్తే అధికారం లోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతామని పాద యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడని, తెలంగాణ లో కుల గణన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలా అనుభవం కలవారని గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన కు ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియవని అన్నారు.మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పోయిన ఎన్నికలలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చాడని కానీ ఐదేండ్లయినా తేలేదని ఇంకా నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవా చేశారు.అభివృద్ధి కావాలంటే ఎంపీ అభ్యర్థి ప్రజల మనిషి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ముత్యం పేట చెక్కర కర్మాగారాన్ని తెరిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు, కొంరెడ్డి కరం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్)
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో భాగంగా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గండి హనుమాన్ చెక్పోస్ట్లో బుధవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ మాట్లాడుతూ—ఎలాంటి సరైన... స్కందగిరి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు )
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు స్వామివారి సన్నిధిలో తమ... నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు
జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ఈ నెల నవంబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు, కన్సల్టేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా... కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి
రాయికల్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత 5–6 రోజులుగా వడ్లు తూకం జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రైతులు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.
జీవన్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి... VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్లో ఉద్రిక్తత
సిహోర్ (భోపాల్) నవంబర్ 26 (ప్రజా మంటలు):
మధ్యప్రదేశ్ లోని సిహోర్ లో ఉన్న VIT యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మంగళవారం రాత్రి తీవ్రరూపం దాల్చాయి. హాస్టల్ సౌకర్యాలు, ఫీజు సమస్యలు, క్యాంపస్ నియమావళిపై విద్యార్థుల అసంతృప్తి ఒక్కసారిగా ఉధృతమై, పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు. కొంతమంది విద్యార్థులు కోపోద్రిక్తులై వస్తువులు... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు,... ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి అలియాస్ “ఐబొమ్మ రవి”కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. రవిని గత వారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. సోమవారం పోలీసు కస్టడీ గడువు ముగియడంతో అతన్ని కోర్టులో హాజరుపరచగా, జ్యూడిషియల్ రిమాండ్కు ఆదేశాలు... ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల నవంబర్ 26( ప్రజా మంటలు)
ఎన్నికల ప్రవర్తన నియమాలికి లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీ సత్యప్రసాద్ అన్నారు.
జిల్లాలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరియు నామినేషన్ పత్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం... కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో పోలీస్ కళాబృందం అవగాహన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ ఉదయ్కుమార్ ముందుండి చేపట్టారు.
పోలీస్ కళాబృందం విద్యార్థులకు పోలీసు చట్టాలు, షీ టీమ్... పాక్ జైలులో ఇమ్రాన్ ఖాన్ను చంపేశారా?
కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్) నవంబర్ 26 (ప్రజా మంటలు)
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, PTI చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారన్న ప్రచారం మరోసారి అంతర్జాతీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖకు దగ్గరగా పనిచేస్తుందన్న ఆరోపణలున్న కొన్ని మీడియా గ్రూపులు, “ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ అధికారులు రహస్యంగా చంపేశారు” అని సంచలన కథనాలు విడుదల... ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు… దండివారం సందర్బంగా భక్తుల సందడి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి |నవంబర్ 26 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల పర్వంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు దండివారం కావడంతో అన్ని దిక్కులనుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాలను మంగళధ్వనులతో మరింత పవిత్రంగా మార్చేశారు.
ఉదయం నుంచే “మల్లన్న… మల్లన్న…” అంటూ నాద... రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో సిబిసి నిర్వహించిన ఫోటో ప్రదర్శనను ఎంపీ డా. కే. లక్ష్మణ్ ప్రారంభించారు.భారత రాజ్యాంగం సజీవ గ్రంథమని, సమానత్వం–హక్కుల రక్షణకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వారసత్వాన్ని పౌరులంతా కాపాడాలని పిలుపునిచ్చారు.సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్... 