మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి
మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం
#నిజాం కు పట్టిన గతే పడుతుంది
#భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ
#కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు
#మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు
#కాంగ్రెస్ తోనే అభివృద్ధి
కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్ - ప్రజా మంటలు )
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు కోరుట్ల శివార్ లో జరిగిన జన జాతర భహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడే సందర్బంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గడీల పాలన అంతమై ప్రజా పాలన మొదలైందని నా పై అక్రమ కేసులు పెట్టిన కెసిఆర్ నడుం విరిగిపడి ఇంట్లో పడుకున్నాడని అన్నారు. అనంతరం బీజేపీ, మోదీ మరియు అమిత్ షా పై విరుచుకుపడిన సీఎం దేశానికి ప్రధాని,పెద్ద వారు అని మోదీకి గౌరవం ఇస్తే నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా మీరు బెదిరిస్తే బెదిరే వారు లేరిక్కడ మీ దగ్గర
సిబిఐ, ఈడి లు ఉంటే నాకు నాల్గున్నర కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భయపెట్టి పెత్తనం చేయాలంటే నిజాం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అన్ని తామే చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమి లేదని గాడిద గుడ్డు తో ఉన్న గుర్తు ను ప్రజలకు చూపిస్తూ నినాదాలు చేయించారు. ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కాదని ఒక ప్రత్యేక పరిస్థితి లో వచ్చిన 18వ పార్లమెంట్ ఎన్నికలని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ అబుకి బారు 400అనే నినాదం తో వచ్చిందని బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని దీనివల్ల మైనారిటీ, దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట్టు చేయాలని ఆ విధంగా చేస్తే అధికారం లోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతామని పాద యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడని, తెలంగాణ లో కుల గణన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలా అనుభవం కలవారని గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన కు ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియవని అన్నారు.మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పోయిన ఎన్నికలలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చాడని కానీ ఐదేండ్లయినా తేలేదని ఇంకా నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవా చేశారు.అభివృద్ధి కావాలంటే ఎంపీ అభ్యర్థి ప్రజల మనిషి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ముత్యం పేట చెక్కర కర్మాగారాన్ని తెరిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు, కొంరెడ్డి కరం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నేటి తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు
హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). :
1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది.
మత... విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి ఐసిడిఎస్ సిడిపిఓ మమత
జగిత్యాల, మార్చి 23: (ప్రజా మంటలు)విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ మమత అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు సజావుగా... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
పలు... పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే లక్ష్యం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 23 ( ప్రజా మంటలు)
ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం... సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
సిద్ధిపేట, మార్చి 22 (ప్రజా మంటలు):
ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని... కాంగ్రెస్కు గుడ్బై చెప్పనున్న జీవన్ రెడ్డి - 25న కీలక సమావేశం - రాజీనామా ప్రకటనకు సిద్ధం
జగిత్యాల, మార్చ్ 22 (ప్రజా మంటలు):
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈనెల 25న అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన... ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు
రియాద్ మార్చ్ 22:
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona... రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)పట్టణం లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంచినీళ్ల బావి ఈద్గా మరియు కిల్ల జగిత్యాల జమ మసీద్ దగ్గర బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా... జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు
జగిత్యాల మార్చి 20(ప్రజా మంటలు)జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ అభిప్రాయపడింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు బైరం హరికిరణ్,... అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?
చెన్నై మార్చ్ 19:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలుపట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు... 