మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి
మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం
#నిజాం కు పట్టిన గతే పడుతుంది
#భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ
#కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు
#మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు
#కాంగ్రెస్ తోనే అభివృద్ధి
కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్ - ప్రజా మంటలు )
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు కోరుట్ల శివార్ లో జరిగిన జన జాతర భహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడే సందర్బంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గడీల పాలన అంతమై ప్రజా పాలన మొదలైందని నా పై అక్రమ కేసులు పెట్టిన కెసిఆర్ నడుం విరిగిపడి ఇంట్లో పడుకున్నాడని అన్నారు. అనంతరం బీజేపీ, మోదీ మరియు అమిత్ షా పై విరుచుకుపడిన సీఎం దేశానికి ప్రధాని,పెద్ద వారు అని మోదీకి గౌరవం ఇస్తే నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా మీరు బెదిరిస్తే బెదిరే వారు లేరిక్కడ మీ దగ్గర
సిబిఐ, ఈడి లు ఉంటే నాకు నాల్గున్నర కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భయపెట్టి పెత్తనం చేయాలంటే నిజాం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అన్ని తామే చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమి లేదని గాడిద గుడ్డు తో ఉన్న గుర్తు ను ప్రజలకు చూపిస్తూ నినాదాలు చేయించారు. ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కాదని ఒక ప్రత్యేక పరిస్థితి లో వచ్చిన 18వ పార్లమెంట్ ఎన్నికలని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ అబుకి బారు 400అనే నినాదం తో వచ్చిందని బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని దీనివల్ల మైనారిటీ, దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట్టు చేయాలని ఆ విధంగా చేస్తే అధికారం లోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతామని పాద యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడని, తెలంగాణ లో కుల గణన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలా అనుభవం కలవారని గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన కు ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియవని అన్నారు.మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పోయిన ఎన్నికలలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చాడని కానీ ఐదేండ్లయినా తేలేదని ఇంకా నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవా చేశారు.అభివృద్ధి కావాలంటే ఎంపీ అభ్యర్థి ప్రజల మనిషి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ముత్యం పేట చెక్కర కర్మాగారాన్ని తెరిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు, కొంరెడ్డి కరం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎనికైనా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి... బీఆర్ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో మరియు శాసనమండలిలో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా
శ్రీ... రవీంద్రభారతిలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
తెలంగాణ రాష్ర్టంలో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఇటీవల ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్,
ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.బుర్ర జ్ఞానేశ్వర్... వైకుంఠ ఏకాదశి వేళ...భక్తుల రద్దీతో పోటెత్తిన ఆలయాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస నగర్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు... గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు_ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు అని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యం లో కాసుగంటి సుధాకర్ రావు సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే డా... ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు : ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు
ఇబ్రహింపట్నం డిసెంబర్ 30(ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని గోదుర్, తిమ్మపుర్, యామపుర్, పకిర్ కోండా పుర్, వేములకుర్తి, ఎర్దండి, కోమటీకోండాపుర్, వర్షకోండ, ఇబ్రహీంపట్నం, డబ్బ గ్రామాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గ్రామలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ స్వామి తదితర
ఈకార్యక్రమంలో... ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం
గొల్లపల్లి, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన చాతల్ల పోషవ్వ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వానికి మారు పేరు... జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... 