మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి
మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం
#నిజాం కు పట్టిన గతే పడుతుంది
#భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ
#కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు
#మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు
#కాంగ్రెస్ తోనే అభివృద్ధి
కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్ - ప్రజా మంటలు )
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు కోరుట్ల శివార్ లో జరిగిన జన జాతర భహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడే సందర్బంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గడీల పాలన అంతమై ప్రజా పాలన మొదలైందని నా పై అక్రమ కేసులు పెట్టిన కెసిఆర్ నడుం విరిగిపడి ఇంట్లో పడుకున్నాడని అన్నారు. అనంతరం బీజేపీ, మోదీ మరియు అమిత్ షా పై విరుచుకుపడిన సీఎం దేశానికి ప్రధాని,పెద్ద వారు అని మోదీకి గౌరవం ఇస్తే నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా మీరు బెదిరిస్తే బెదిరే వారు లేరిక్కడ మీ దగ్గర
సిబిఐ, ఈడి లు ఉంటే నాకు నాల్గున్నర కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భయపెట్టి పెత్తనం చేయాలంటే నిజాం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అన్ని తామే చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమి లేదని గాడిద గుడ్డు తో ఉన్న గుర్తు ను ప్రజలకు చూపిస్తూ నినాదాలు చేయించారు. ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కాదని ఒక ప్రత్యేక పరిస్థితి లో వచ్చిన 18వ పార్లమెంట్ ఎన్నికలని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ అబుకి బారు 400అనే నినాదం తో వచ్చిందని బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని దీనివల్ల మైనారిటీ, దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట్టు చేయాలని ఆ విధంగా చేస్తే అధికారం లోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతామని పాద యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడని, తెలంగాణ లో కుల గణన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలా అనుభవం కలవారని గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన కు ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియవని అన్నారు.మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పోయిన ఎన్నికలలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చాడని కానీ ఐదేండ్లయినా తేలేదని ఇంకా నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవా చేశారు.అభివృద్ధి కావాలంటే ఎంపీ అభ్యర్థి ప్రజల మనిషి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ముత్యం పేట చెక్కర కర్మాగారాన్ని తెరిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు, కొంరెడ్డి కరం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రష్యా - అమెరికా ఒకటైతే బంగారం ధర పడిపోతుందా?
బంగారం ధర ₹1 లక్షకు పడిపోతుందా? – గ్లోబల్ పవర్ షిఫ్ట్ వెనుక అసలు కథ.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలు.ఇది సాధారణ పెరుగుదల కాదు — ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం కదిలిన సంకేతం.
ఇప్పుడు ప్రశ్న:👉 ఈ... జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్
మెట్పల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి మున్సిపల్ చైర్మన్ పదవి సాధించేందుకు ప్రయత్నించలేదని, కౌన్సిలర్లకు విప్ కూడా జారీ చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై దాడికి దిగినట్లు సమాచారం.
ఈ... తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్
హైదరాబాద్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనోహర్ కుమార్కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.
మనోహర్ కుమార్తో పాటు... కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన... జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి…
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలో సినీ హీరో అర్జున్ సందడి చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో అర్జున్ మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతా పయనం చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మ్యాట్నీ షో సమయంలో థియేటర్ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ,... గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల దుర్బర జీవితం…
సికింద్రాబాద్, ఫిబ్రవరి 16 ( ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఆశ్రయం లేక జీవనం సాగిస్తున్న నిరాశ్రయుల జీవితాలు గుండెల్ని పిండేసే దృశ్యాలుగా మారుతున్నాయి. ఎవరి ఆదరణ లేక, కనీస సౌకర్యాలు లేక కొందరు ఫుట్పాత్లనే ఇంటిగా మార్చుకుని రోజులు గడుపుతున్నారు. అన్నదానాల కోసం చేరిన వారు, కాలక్రమేణా అక్కడే జీవితం గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.అనారోగ్యంతో... న్యాయవాది ఖాదీర్ హత్య నిందితులకు కఠిన శిక్షలు విధించాలి
మెట్టుపల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు యండి. ఖాదీర్పై దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మెట్టుపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సోమవారం మెట్టుపల్లి కోర్టులో న్యాయవాదులు ఖాదీర్ హత్యకు... హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య
హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్యను హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా, 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ను వైస్ చైర్పర్సన్గా... రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా
ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.
▪️ మున్సిపల్ చైర్మన్గా కట్కం రవీందర్ ఎన్నిక▪️ వైస్ చైర్మన్గా... ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక
ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు
ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా వేముల నాగలక్ష్మిను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్గా ఇందారపు రామన్నను తిరిగి నియమించారు.
▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా కొత్త అభ్యర్థికి... జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా?
జగిత్యాల రాజకీయాల్లో సంచలన మార్పు: కొత్త సమీకరణలు ?
(ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం)
జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక కావడం కేవలం స్థానిక పదవి మార్పు కాదు. ఇది కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాల్లో ఒక కీలక మలుపు.
బయటికి చూస్తే ఇది👉 సంజయ్ కుమార్ వర్గ విజయం... బ్రేకింగ్ న్యూస్: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నికఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం పట్టు సాధించింది
▪️ మాజీ మంత్రి వర్గానికి మొండిచేయి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
▪️ వైస్ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన జీనత్ పర్వీన్ (మున్నా) ఎంపిక▪️ మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్కు నిరాశ▪️... 