మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి
మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం
#నిజాం కు పట్టిన గతే పడుతుంది
#భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ
#కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు
#మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు
#కాంగ్రెస్ తోనే అభివృద్ధి
కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్ - ప్రజా మంటలు )
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు కోరుట్ల శివార్ లో జరిగిన జన జాతర భహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడే సందర్బంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గడీల పాలన అంతమై ప్రజా పాలన మొదలైందని నా పై అక్రమ కేసులు పెట్టిన కెసిఆర్ నడుం విరిగిపడి ఇంట్లో పడుకున్నాడని అన్నారు. అనంతరం బీజేపీ, మోదీ మరియు అమిత్ షా పై విరుచుకుపడిన సీఎం దేశానికి ప్రధాని,పెద్ద వారు అని మోదీకి గౌరవం ఇస్తే నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా మీరు బెదిరిస్తే బెదిరే వారు లేరిక్కడ మీ దగ్గర
సిబిఐ, ఈడి లు ఉంటే నాకు నాల్గున్నర కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భయపెట్టి పెత్తనం చేయాలంటే నిజాం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అన్ని తామే చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమి లేదని గాడిద గుడ్డు తో ఉన్న గుర్తు ను ప్రజలకు చూపిస్తూ నినాదాలు చేయించారు. ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కాదని ఒక ప్రత్యేక పరిస్థితి లో వచ్చిన 18వ పార్లమెంట్ ఎన్నికలని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ అబుకి బారు 400అనే నినాదం తో వచ్చిందని బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని దీనివల్ల మైనారిటీ, దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట్టు చేయాలని ఆ విధంగా చేస్తే అధికారం లోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతామని పాద యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడని, తెలంగాణ లో కుల గణన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలా అనుభవం కలవారని గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన కు ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియవని అన్నారు.మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పోయిన ఎన్నికలలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చాడని కానీ ఐదేండ్లయినా తేలేదని ఇంకా నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవా చేశారు.అభివృద్ధి కావాలంటే ఎంపీ అభ్యర్థి ప్రజల మనిషి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ముత్యం పేట చెక్కర కర్మాగారాన్ని తెరిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు, కొంరెడ్డి కరం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మ్యాచ్లో సీఎం రేవంత్రెడ్డి ఒక గోల్ సాధించగా, మెస్సీ రెండు గోల్స్తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్తో పాటు... నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్... వయోవృద్ధులకు టాస్కా ఆసరా. -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
శనివారం ఆల్ సీనియర్ సిటీజేన్స్... సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి
కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) :
సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల... రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్ డిసెంబర్ 13:
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎల్కతుర్తి గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం
ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా... కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ... నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :
గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య):
గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో... బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద... రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు ..
ఆడపిల్లలకు ఆరాధ్యదైవం
భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారిణి సఫీనా హుసేన్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలికల కోసం చేసిన అసాధారణ కృషికి ఆమెకు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE – World Innovation Summit for Education) అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా... దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్లో మోహన్ భాగవత్ కీలక సందేశం
పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13:
జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి... యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత
లక్నో డిసెంబర్ 13:
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ... 