ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన
-పదేళ్ళ అభివృద్ధిని చెప్పుకోలేని బిజేపి నాయకత్వం ?
-రెండవ దశలలో తగ్గిన ఓటింగ్
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
-బిజేపి ప్రభావిత ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్
-నిరాసక్తతగా బిజేపి కార్యకర్తలు
-ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
బిజేపి అధినాయకత్వం తీరుపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల తిరుగుబాటు
రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో గుబులు పెంచిన ప్రజలు
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
18 వ లోకసభకు జరుగుతున్న ఎన్నికల్లో 190 లోక సభ స్థానాలలో పోలింగ్ పూర్తయింది. గతంలో ఎంతో బలంగా ఉండి, అధిక స్థానాలు గెలుచుకొన్న రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రెండు దశల పోలింగ్ లో ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడం, ముఖ్యంగా బిజేపి గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలలో బిజేపి కార్యకర్తలు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అంతగా ఉత్సాహం చూపడం లేదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆండాలనకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో, బిజేపి మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ యాంటీ ముట్టనట్లుగా ఉందనే వార్తలు హిందీ రాష్ట్రాలలోని బిజేపి నాయకత్వాన్ని తొలచివేస్తుంది.
రెండు దశల పోలింగ్ తరువాత, మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటున్న బిజేపి డబుల్ ఇంజన్ నాయకత్వానికి, ఆర్ ఎస్ ఎస్ కు మధ్యలో అంతరం పెరగిందనే వార్తల నేపథ్యంలో పూర్తి విశ్లేషణ
తగ్గిన పోలింగ్ శాతం తో బిజేపి అధికారంలోకి రావడం కష్టమేనా ?
ఎన్నికల క్షేత్రంలో ఆర్ ఎస్ ఎస్ కనబడమలేదనే వార్తలు ఎంతవరకు నిజం ?
ఎందుకు ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు తెర వెనుకకు వెళ్లారు ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన డబుల్ ఇంజన్ సర్కార్ రెండు దశల పోలింగ్ పూర్తి కావడంతో, ప్రస్తుత క్షేత్ర స్థాయి నుండి వస్తున్న వార్తలు బిజేపి అధినాయకత్వంలో ఆందోళన పెంచుతుందనే పచారం జరుగుతుంది. ఏమాత్రం బలంలేని, సరియైన నాయకత్వం, ఐక్యత లేని ప్రతిపక్షాన్ని సులువుగా ఓడించి, నెహ్రూ తరువాత మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడి ప్రధాని అవుతాడాని అనుకున్న బిజేపి నాయకత్వానికి ఇప్పటి పరిస్థితులు అంతుపట్టడం లేదని, వివిధ కారణాల వల్ల పార్టీ కింది స్థాయి కార్యకర్తలలో అంతగా ఉత్సాహం కనబడక పోవడంతోనే పోలింగ్ శాతం తగ్గిందనే ప్రచారం జరుగుతుంది.
మొదటి దశ పోలింగ్ రోజు మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ లో రాత్రి పూట బస చేసి, పార్టీ నాయకులను కాదని, ఆర్ ఎస్ ఎస్ నాయకులను కలిసినట్లు, దాని తరువాతనే, రాజస్థాన్ లో మళ్ళీ హిందూ – ముస్లింల అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పుకొంటున్నారు. నిజానికి నాగపూర్ లో ఎం జరిగిందో ఎవరికి తెలియదు. రాజ్ భవన్ లో బస చేసిన ప్రధాని మోడి, కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను మాత్రమే కలిసినట్లు, చివరికి స్థానిక అభ్యర్థి, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ;ఆంటీ వారిని కూడా కలవ లేదనే తెలుస్తుంది.
వచ్చే సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎంతో ఘనంగా టన శతావార్షికోత్సవాలను నిర్వహిస్తునట్లు మోద చెప్పుకొన్నా, ఇటీవలి కాలంలో, సర్ సంఘ చాలక మోహన్ భాగవత్, అలాంటి ఆలోచనలు ఏమి లేవని, శతావార్షికోత్సవాలు జరుపోకవ్వడం లేదని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పదేళ్ళ బిజేపి పాలనలో ఆర్ ఎస్ ఎస్ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, కొంత మంది పెట్టుబడిదారుల చేతిలో బిజేపి బందీ అయిందనే భావం ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వంలో నాటుకొనడాని అనుకొంటున్నారు. పార్టీ సిద్దాంతలకు, ఆచరణకు ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేచుకొని, దశాబ్దాలపాటు తమ జీవితాలను పార్టీకి అంకితం చేసిన కార్యకర్తలనుపట్టించుకోకుండా, నాయకులను మోడి- అమిత్ షా లు తమ స్వంత ఏజండాతో పార్టీని నడుపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అధికారం ఎవరిదైనా, ఆర్ ఎస్ ఎస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, తనడంటూ ప్రత్యేక మార్గం ఎంచుకోంటుందని అందులోని పెద్దలు చెపుతుంటారు. అందుకే 1977 వరకు పరోక్షంగా ఆర్ ఎస్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు అందించిందని, కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో సహకరించిందని చెప్పుకొంటారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు, నాయకులు గత పదేళ్ళ అధికారంలో ఎలాంటి లబ్ది పొందకపోవడమే కాకుండా, ఇన్నాళ్ళూ ఎవరైతే తమను ఇబ్బందుల పాలు చేశారో వారినే తెచ్చి, ప్రభుత్వంలో కూచోబెట్టడం కూడా కింది స్థాయి కార్యకర్తలలో నిరుత్సాహం పెనహిందాని, అందుకే ఎసయారీ ఎన్నికల్లో పూర్తిగా ఏమి పట్టనట్లు ఉన్నారని పార్టీలోని ఒక వర్గం చెప్పుకొంటుంది.
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
సాధారణంగా, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని, పెరిగిన వోట్లన్నీ ప్రతిపక్షాలవే అనే ఒక ప్రహకారం ఉండి. కానీ 2004, 2014 లలో కూడా ఓటింగ్ శాతం గతం కంటే తక్కువగానే నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్న బిజేపి (2004), కాంగ్రెస్ -యు పి ఏ (2014) లలో అధికారం కోల్పోయాయి. ప్రభుత్వాన్ని సమర్థించే సాంప్రదాయ వోటర్లు నిర్లిప్తతో ఓటింగ్ కు దూరం కావడం, ప్రతిపక్షాలకు రావలసిన వోట్లు రావడంతో ప్రభుత్వాలు కూలిపోయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మళ్ళీ ఈ సారి కూడా తక్కువ ఓటింగ్ నమోదు కావడం కూడా గత అనుభవాలను పునరావృతం చేస్తుందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. మొదటిదశ అనుభవంతో మోడి-షా లు ఎంత గట్టిగా కార్యకర్తలను ప్రోత్సహించినా, బెదిరించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. హిందీ రాష్ట్రాలలో కోల్పోయిన సీట్లను నాల్గవ దశలో జరగబోయే తేఊగు రాష్ట్రాలలో కొంత మేర భారతి చేసుకోవాలని భావిస్తున్న బిజేపి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.... రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల... జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ... తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు
జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్... డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ... వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఫారమ్–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు):
ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
జగిత్యాల ఆగస్టు 28(ప్రజా మంటలు)శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాల అనంతరం హోమము నిర్వహించారు. .
నూతన యజ్ఞోపవీత ధారణ అనంతరం సభాపతి తిగుళ్ళ విశ్వనాథ శర్మ ఉపాకర్మ ప్రత్యేకత... గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు
జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామాలయంలో విద్యానగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాకర్మ ఘనంగా నిర్వహించారు. హోమము తర్పణాలు నిర్వహించి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు.
కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొలిచాల రవీందర్ వైదిక క్రతువు అన్యారంభట్ల నారాయణ... సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు.
పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా... ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్.
జగిత్యాల, ఆగస్టు 27( ప్రజా మంటలు) ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కృషి పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్ అన్నారు.వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని రూరల్ సీఐ సుధాకర్ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ... మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు)
ధరూర్ లోని *మౌంట్ కార్మెల్ హైస్కూల్* లో రక్ష బంధన్ వేడుకలు అత్యంత ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల యాజమాన్యం నిర్వహించారుఈ సందర్భంగా పాఠశాల బాలికలు పాఠశాలలోని బాలురకి రాఖీలు కట్టి *నువ్వు నాకూ రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష* అని నినదించారు.
పాఠశాల... 