ఆర్ ఎస్ ఎస్  నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం

On
ఆర్ ఎస్ ఎస్  నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం

ఆర్ ఎస్ ఎస్  నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన
-పదేళ్ళ అభివృద్ధిని చెప్పుకోలేని బిజేపి నాయకత్వం ?
-రెండవ దశలలో తగ్గిన ఓటింగ్  

తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?

-బిజేపి ప్రభావిత ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్

-నిరాసక్తతగా బిజేపి కార్యకర్తలు

-ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం

బిజేపి అధినాయకత్వం తీరుపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల తిరుగుబాటు

రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో గుబులు పెంచిన ప్రజలు

(సిహెచ్ వి ప్రభాకర్ రావు)

18 వ లోకసభకు జరుగుతున్న ఎన్నికల్లో 190 లోక సభ స్థానాలలో పోలింగ్ పూర్తయింది. గతంలో ఎంతో బలంగా ఉండి, అధిక స్థానాలు గెలుచుకొన్న రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రెండు దశల పోలింగ్ లో ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడం, ముఖ్యంగా బిజేపి గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలలో బిజేపి కార్యకర్తలు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అంతగా ఉత్సాహం చూపడం లేదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆండాలనకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో, బిజేపి మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ యాంటీ ముట్టనట్లుగా ఉందనే వార్తలు హిందీ రాష్ట్రాలలోని బిజేపి నాయకత్వాన్ని తొలచివేస్తుంది.

రెండు దశల పోలింగ్ తరువాత, మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటున్న బిజేపి డబుల్ ఇంజన్ నాయకత్వానికి, ఆర్ ఎస్ ఎస్ కు మధ్యలో అంతరం పెరగిందనే వార్తల నేపథ్యంలో పూర్తి విశ్లేషణ  

తగ్గిన పోలింగ్ శాతం తో బిజేపి అధికారంలోకి రావడం కష్టమేనా ?

 ఎన్నికల క్షేత్రంలో ఆర్ ఎస్ ఎస్ కనబడమలేదనే వార్తలు ఎంతవరకు నిజం ?

ఎందుకు ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు  ఎందుకు తెర వెనుకకు వెళ్లారు ?

(సిహెచ్ వి ప్రభాకర్ రావు)  

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన డబుల్ ఇంజన్ సర్కార్ రెండు దశల పోలింగ్ పూర్తి కావడంతో, ప్రస్తుత క్షేత్ర స్థాయి నుండి వస్తున్న వార్తలు బిజేపి అధినాయకత్వంలో ఆందోళన పెంచుతుందనే పచారం జరుగుతుంది. ఏమాత్రం బలంలేని, సరియైన నాయకత్వం, ఐక్యత లేని ప్రతిపక్షాన్ని సులువుగా ఓడించి, నెహ్రూ తరువాత మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడి ప్రధాని అవుతాడాని అనుకున్న బిజేపి నాయకత్వానికి ఇప్పటి పరిస్థితులు అంతుపట్టడం లేదని, వివిధ కారణాల వల్ల పార్టీ కింది స్థాయి కార్యకర్తలలో అంతగా ఉత్సాహం కనబడక పోవడంతోనే పోలింగ్ శాతం తగ్గిందనే ప్రచారం జరుగుతుంది.

మొదటి దశ పోలింగ్ రోజు మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ లో రాత్రి పూట బస చేసి, పార్టీ నాయకులను కాదని, ఆర్ ఎస్ ఎస్ నాయకులను కలిసినట్లు, దాని తరువాతనే, రాజస్థాన్ లో మళ్ళీ హిందూ – ముస్లింల అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పుకొంటున్నారు. నిజానికి నాగపూర్ లో ఎం జరిగిందో ఎవరికి తెలియదు. రాజ్ భవన్ లో బస చేసిన ప్రధాని మోడి, కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను మాత్రమే కలిసినట్లు, చివరికి  స్థానిక అభ్యర్థి, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ;ఆంటీ వారిని కూడా కలవ లేదనే తెలుస్తుంది.

వచ్చే సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనున్న  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎంతో ఘనంగా టన శతావార్షికోత్సవాలను నిర్వహిస్తునట్లు మోద చెప్పుకొన్నా, ఇటీవలి కాలంలో, సర్ సంఘ చాలక మోహన్ భాగవత్, అలాంటి ఆలోచనలు ఏమి లేవని, శతావార్షికోత్సవాలు జరుపోకవ్వడం లేదని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  పదేళ్ళ బిజేపి పాలనలో ఆర్ ఎస్ ఎస్ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, కొంత మంది పెట్టుబడిదారుల చేతిలో బిజేపి బందీ అయిందనే భావం ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వంలో నాటుకొనడాని అనుకొంటున్నారు. పార్టీ సిద్దాంతలకు, ఆచరణకు ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేచుకొని, దశాబ్దాలపాటు తమ జీవితాలను పార్టీకి అంకితం చేసిన కార్యకర్తలనుపట్టించుకోకుండా, నాయకులను మోడి- అమిత్ షా లు తమ స్వంత ఏజండాతో పార్టీని నడుపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.  

అధికారం ఎవరిదైనా, ఆర్ ఎస్ ఎస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, తనడంటూ ప్రత్యేక మార్గం ఎంచుకోంటుందని అందులోని పెద్దలు చెపుతుంటారు. అందుకే 1977 వరకు పరోక్షంగా ఆర్ ఎస్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు అందించిందని, కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో సహకరించిందని చెప్పుకొంటారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు, నాయకులు గత పదేళ్ళ అధికారంలో ఎలాంటి లబ్ది పొందకపోవడమే కాకుండా, ఇన్నాళ్ళూ ఎవరైతే తమను ఇబ్బందుల పాలు చేశారో వారినే తెచ్చి, ప్రభుత్వంలో కూచోబెట్టడం కూడా కింది స్థాయి కార్యకర్తలలో నిరుత్సాహం పెనహిందాని, అందుకే ఎసయారీ ఎన్నికల్లో పూర్తిగా ఏమి పట్టనట్లు ఉన్నారని పార్టీలోని ఒక వర్గం చెప్పుకొంటుంది.

 తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?

సాధారణంగా, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని, పెరిగిన వోట్లన్నీ ప్రతిపక్షాలవే అనే ఒక ప్రహకారం ఉండి. కానీ 2004, 2014 లలో కూడా ఓటింగ్ శాతం గతం కంటే తక్కువగానే నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్న బిజేపి (2004), కాంగ్రెస్ -యు పి ఏ (2014) లలో అధికారం కోల్పోయాయి. ప్రభుత్వాన్ని సమర్థించే సాంప్రదాయ వోటర్లు నిర్లిప్తతో ఓటింగ్ కు దూరం కావడం, ప్రతిపక్షాలకు రావలసిన వోట్లు రావడంతో ప్రభుత్వాలు కూలిపోయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

మళ్ళీ ఈ సారి కూడా తక్కువ ఓటింగ్ నమోదు కావడం కూడా గత అనుభవాలను పునరావృతం చేస్తుందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. మొదటిదశ అనుభవంతో మోడి-షా లు ఎంత గట్టిగా కార్యకర్తలను ప్రోత్సహించినా, బెదిరించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. హిందీ రాష్ట్రాలలో కోల్పోయిన సీట్లను నాల్గవ దశలో జరగబోయే తేఊగు రాష్ట్రాలలో కొంత మేర భారతి చేసుకోవాలని భావిస్తున్న బిజేపి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.  

Tags
Join WhatsApp

More News...

Local News 

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు    కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు...
Read More...
Local News 

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్  పూజలు

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్  పూజలు   జగిత్యాల సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని రెడ్ బుల్స్ గణేశ మండపం వద్ద గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు సందర్శించి వినాయకునికి పూజలు చేశారు. రుద్రాంగి గోపాలకృష్ణ తీర్థప్రసాద్ అందజేసి స్వామి వారి శేష వస్తుందో సత్కరించి ఆశీర్వచనం చేశారు.
Read More...
Local News 

జగిత్యాలలో  అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు

జగిత్యాలలో  అయోమయంలో     " జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది. విశ్వహిందూ పరిషత్తు...
Read More...
Local News 

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి లో గల రెడ్ బుల్స్ గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా భక్తబృందం వారిచే లలితా సహస్రనామం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు.
Read More...
Local News 

భార్యను చున్నీతో బిగించి హత్య చేసిన భర్త

భార్యను చున్నీతో బిగించి హత్య చేసిన భర్త కోరుట్ల, సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త చున్నీతో మెడకు బిగించి హత్య చేసిన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డులో నివాసముంటున్న అన్నం నరేష్, లక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. నరేష్...
Read More...
Local News  Entertainment  

కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి

కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి జగిత్యాల, సెప్టెంబర్ 13(ప్రజా మంటలు): శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన జిల్లా స్థాయి కూచిపూడి నాట్యపోటీలలో జగిత్యాల నాట్యగురువు శ్రీమతి గుండి యమునకు చెందిన శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం విద్యార్థిని చిన్నారి మహాదేవుని నిత్యాశ్రీ ద్వితీయ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ...
Read More...
Local News 

పద్మ చక్ర అవార్డు గ్రహీత ఎల్లాల సరిత గోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందనలు

పద్మ చక్ర అవార్డు గ్రహీత ఎల్లాల సరిత గోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందనలు జగిత్యాల, సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఎల్లాల సరిత గోపాల్ రెడ్డిని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. శ్రీ లలిత ఆల్టర్నేటివ్ థెరపీ సెంటర్ ద్వారా ప్రజలకు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మందులు లేని వైద్య విధానాన్ని అందిస్తూ, సామాజిక సేవలు చేస్తున్నందుకు...
Read More...
Local News 

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్    జగిత్యాల, సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)  తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి యూ డబ్ల్యూ జె  ఎఫ్) జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జగిత్యాలలోని స్పైసీ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు ఉర్దూ జర్నలిస్టులు హాజరయ్యారు.    ఈ సందర్భంగా మిర్జా ఫజలుల్లా బేగ్ను తెలంగాణ...
Read More...
Local News 

గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం

గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం   కీసర సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) కుందన్ పల్లి లోని గౌరీ ప్రియ కాలనీలో శనివారం కాలనీలో నూతనంగా గణేష నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆదివారం ఉత్సవ కమిటీ వారు గణేశ  ఉత్సవాలు నిర్వహించడానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించి ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు గూర్చి చర్చించి విధివిధానాలు ఖరారు...
Read More...
National 

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి కేరళ, సెప్టెంబర్ 11: జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ. దేవిక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవిక మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె...
Read More...
Local News 

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి జగిత్యాల, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు): 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...
Read More...
State News 

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు    బీహార్‌లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్‌ రాష్ట్రానికి చెందిన గ్రూప్‌-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని...
Read More...