ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన
-పదేళ్ళ అభివృద్ధిని చెప్పుకోలేని బిజేపి నాయకత్వం ?
-రెండవ దశలలో తగ్గిన ఓటింగ్
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
-బిజేపి ప్రభావిత ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్
-నిరాసక్తతగా బిజేపి కార్యకర్తలు
-ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
బిజేపి అధినాయకత్వం తీరుపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల తిరుగుబాటు
రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో గుబులు పెంచిన ప్రజలు
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
18 వ లోకసభకు జరుగుతున్న ఎన్నికల్లో 190 లోక సభ స్థానాలలో పోలింగ్ పూర్తయింది. గతంలో ఎంతో బలంగా ఉండి, అధిక స్థానాలు గెలుచుకొన్న రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రెండు దశల పోలింగ్ లో ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడం, ముఖ్యంగా బిజేపి గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలలో బిజేపి కార్యకర్తలు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అంతగా ఉత్సాహం చూపడం లేదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆండాలనకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో, బిజేపి మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ యాంటీ ముట్టనట్లుగా ఉందనే వార్తలు హిందీ రాష్ట్రాలలోని బిజేపి నాయకత్వాన్ని తొలచివేస్తుంది.
రెండు దశల పోలింగ్ తరువాత, మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటున్న బిజేపి డబుల్ ఇంజన్ నాయకత్వానికి, ఆర్ ఎస్ ఎస్ కు మధ్యలో అంతరం పెరగిందనే వార్తల నేపథ్యంలో పూర్తి విశ్లేషణ
తగ్గిన పోలింగ్ శాతం తో బిజేపి అధికారంలోకి రావడం కష్టమేనా ?
ఎన్నికల క్షేత్రంలో ఆర్ ఎస్ ఎస్ కనబడమలేదనే వార్తలు ఎంతవరకు నిజం ?
ఎందుకు ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు తెర వెనుకకు వెళ్లారు ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన డబుల్ ఇంజన్ సర్కార్ రెండు దశల పోలింగ్ పూర్తి కావడంతో, ప్రస్తుత క్షేత్ర స్థాయి నుండి వస్తున్న వార్తలు బిజేపి అధినాయకత్వంలో ఆందోళన పెంచుతుందనే పచారం జరుగుతుంది. ఏమాత్రం బలంలేని, సరియైన నాయకత్వం, ఐక్యత లేని ప్రతిపక్షాన్ని సులువుగా ఓడించి, నెహ్రూ తరువాత మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడి ప్రధాని అవుతాడాని అనుకున్న బిజేపి నాయకత్వానికి ఇప్పటి పరిస్థితులు అంతుపట్టడం లేదని, వివిధ కారణాల వల్ల పార్టీ కింది స్థాయి కార్యకర్తలలో అంతగా ఉత్సాహం కనబడక పోవడంతోనే పోలింగ్ శాతం తగ్గిందనే ప్రచారం జరుగుతుంది.
మొదటి దశ పోలింగ్ రోజు మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ లో రాత్రి పూట బస చేసి, పార్టీ నాయకులను కాదని, ఆర్ ఎస్ ఎస్ నాయకులను కలిసినట్లు, దాని తరువాతనే, రాజస్థాన్ లో మళ్ళీ హిందూ – ముస్లింల అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పుకొంటున్నారు. నిజానికి నాగపూర్ లో ఎం జరిగిందో ఎవరికి తెలియదు. రాజ్ భవన్ లో బస చేసిన ప్రధాని మోడి, కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను మాత్రమే కలిసినట్లు, చివరికి స్థానిక అభ్యర్థి, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ;ఆంటీ వారిని కూడా కలవ లేదనే తెలుస్తుంది.
వచ్చే సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎంతో ఘనంగా టన శతావార్షికోత్సవాలను నిర్వహిస్తునట్లు మోద చెప్పుకొన్నా, ఇటీవలి కాలంలో, సర్ సంఘ చాలక మోహన్ భాగవత్, అలాంటి ఆలోచనలు ఏమి లేవని, శతావార్షికోత్సవాలు జరుపోకవ్వడం లేదని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పదేళ్ళ బిజేపి పాలనలో ఆర్ ఎస్ ఎస్ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, కొంత మంది పెట్టుబడిదారుల చేతిలో బిజేపి బందీ అయిందనే భావం ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వంలో నాటుకొనడాని అనుకొంటున్నారు. పార్టీ సిద్దాంతలకు, ఆచరణకు ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేచుకొని, దశాబ్దాలపాటు తమ జీవితాలను పార్టీకి అంకితం చేసిన కార్యకర్తలనుపట్టించుకోకుండా, నాయకులను మోడి- అమిత్ షా లు తమ స్వంత ఏజండాతో పార్టీని నడుపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అధికారం ఎవరిదైనా, ఆర్ ఎస్ ఎస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, తనడంటూ ప్రత్యేక మార్గం ఎంచుకోంటుందని అందులోని పెద్దలు చెపుతుంటారు. అందుకే 1977 వరకు పరోక్షంగా ఆర్ ఎస్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు అందించిందని, కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో సహకరించిందని చెప్పుకొంటారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు, నాయకులు గత పదేళ్ళ అధికారంలో ఎలాంటి లబ్ది పొందకపోవడమే కాకుండా, ఇన్నాళ్ళూ ఎవరైతే తమను ఇబ్బందుల పాలు చేశారో వారినే తెచ్చి, ప్రభుత్వంలో కూచోబెట్టడం కూడా కింది స్థాయి కార్యకర్తలలో నిరుత్సాహం పెనహిందాని, అందుకే ఎసయారీ ఎన్నికల్లో పూర్తిగా ఏమి పట్టనట్లు ఉన్నారని పార్టీలోని ఒక వర్గం చెప్పుకొంటుంది.
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
సాధారణంగా, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని, పెరిగిన వోట్లన్నీ ప్రతిపక్షాలవే అనే ఒక ప్రహకారం ఉండి. కానీ 2004, 2014 లలో కూడా ఓటింగ్ శాతం గతం కంటే తక్కువగానే నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్న బిజేపి (2004), కాంగ్రెస్ -యు పి ఏ (2014) లలో అధికారం కోల్పోయాయి. ప్రభుత్వాన్ని సమర్థించే సాంప్రదాయ వోటర్లు నిర్లిప్తతో ఓటింగ్ కు దూరం కావడం, ప్రతిపక్షాలకు రావలసిన వోట్లు రావడంతో ప్రభుత్వాలు కూలిపోయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మళ్ళీ ఈ సారి కూడా తక్కువ ఓటింగ్ నమోదు కావడం కూడా గత అనుభవాలను పునరావృతం చేస్తుందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. మొదటిదశ అనుభవంతో మోడి-షా లు ఎంత గట్టిగా కార్యకర్తలను ప్రోత్సహించినా, బెదిరించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. హిందీ రాష్ట్రాలలో కోల్పోయిన సీట్లను నాల్గవ దశలో జరగబోయే తేఊగు రాష్ట్రాలలో కొంత మేర భారతి చేసుకోవాలని భావిస్తున్న బిజేపి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎనికైనా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి... బీఆర్ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో మరియు శాసనమండలిలో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా
శ్రీ... రవీంద్రభారతిలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
తెలంగాణ రాష్ర్టంలో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఇటీవల ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్,
ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.బుర్ర జ్ఞానేశ్వర్... వైకుంఠ ఏకాదశి వేళ...భక్తుల రద్దీతో పోటెత్తిన ఆలయాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస నగర్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు... గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు_ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు అని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యం లో కాసుగంటి సుధాకర్ రావు సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే డా... ఆలయాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు : ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు
ఇబ్రహింపట్నం డిసెంబర్ 30(ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని గోదుర్, తిమ్మపుర్, యామపుర్, పకిర్ కోండా పుర్, వేములకుర్తి, ఎర్దండి, కోమటీకోండాపుర్, వర్షకోండ, ఇబ్రహీంపట్నం, డబ్బ గ్రామాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గ్రామలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గోపాలకృష్ణ స్వామి తదితర
ఈకార్యక్రమంలో... ఓదార్చే మాటలకన్నా ముందుకు వచ్చిన సహాయ హస్తం – రాఘవపట్నంలో మానవత్వానికి నిదర్శనం
గొల్లపల్లి, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన చాతల్ల పోషవ్వ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వానికి మారు పేరు... జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... 