ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన
-పదేళ్ళ అభివృద్ధిని చెప్పుకోలేని బిజేపి నాయకత్వం ?
-రెండవ దశలలో తగ్గిన ఓటింగ్
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
-బిజేపి ప్రభావిత ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్
-నిరాసక్తతగా బిజేపి కార్యకర్తలు
-ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
బిజేపి అధినాయకత్వం తీరుపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల తిరుగుబాటు
రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో గుబులు పెంచిన ప్రజలు
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
18 వ లోకసభకు జరుగుతున్న ఎన్నికల్లో 190 లోక సభ స్థానాలలో పోలింగ్ పూర్తయింది. గతంలో ఎంతో బలంగా ఉండి, అధిక స్థానాలు గెలుచుకొన్న రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రెండు దశల పోలింగ్ లో ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడం, ముఖ్యంగా బిజేపి గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలలో బిజేపి కార్యకర్తలు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అంతగా ఉత్సాహం చూపడం లేదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆండాలనకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో, బిజేపి మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ యాంటీ ముట్టనట్లుగా ఉందనే వార్తలు హిందీ రాష్ట్రాలలోని బిజేపి నాయకత్వాన్ని తొలచివేస్తుంది.
రెండు దశల పోలింగ్ తరువాత, మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటున్న బిజేపి డబుల్ ఇంజన్ నాయకత్వానికి, ఆర్ ఎస్ ఎస్ కు మధ్యలో అంతరం పెరగిందనే వార్తల నేపథ్యంలో పూర్తి విశ్లేషణ
తగ్గిన పోలింగ్ శాతం తో బిజేపి అధికారంలోకి రావడం కష్టమేనా ?
ఎన్నికల క్షేత్రంలో ఆర్ ఎస్ ఎస్ కనబడమలేదనే వార్తలు ఎంతవరకు నిజం ?
ఎందుకు ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు తెర వెనుకకు వెళ్లారు ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన డబుల్ ఇంజన్ సర్కార్ రెండు దశల పోలింగ్ పూర్తి కావడంతో, ప్రస్తుత క్షేత్ర స్థాయి నుండి వస్తున్న వార్తలు బిజేపి అధినాయకత్వంలో ఆందోళన పెంచుతుందనే పచారం జరుగుతుంది. ఏమాత్రం బలంలేని, సరియైన నాయకత్వం, ఐక్యత లేని ప్రతిపక్షాన్ని సులువుగా ఓడించి, నెహ్రూ తరువాత మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడి ప్రధాని అవుతాడాని అనుకున్న బిజేపి నాయకత్వానికి ఇప్పటి పరిస్థితులు అంతుపట్టడం లేదని, వివిధ కారణాల వల్ల పార్టీ కింది స్థాయి కార్యకర్తలలో అంతగా ఉత్సాహం కనబడక పోవడంతోనే పోలింగ్ శాతం తగ్గిందనే ప్రచారం జరుగుతుంది.
మొదటి దశ పోలింగ్ రోజు మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ లో రాత్రి పూట బస చేసి, పార్టీ నాయకులను కాదని, ఆర్ ఎస్ ఎస్ నాయకులను కలిసినట్లు, దాని తరువాతనే, రాజస్థాన్ లో మళ్ళీ హిందూ – ముస్లింల అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పుకొంటున్నారు. నిజానికి నాగపూర్ లో ఎం జరిగిందో ఎవరికి తెలియదు. రాజ్ భవన్ లో బస చేసిన ప్రధాని మోడి, కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను మాత్రమే కలిసినట్లు, చివరికి స్థానిక అభ్యర్థి, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ;ఆంటీ వారిని కూడా కలవ లేదనే తెలుస్తుంది.
వచ్చే సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎంతో ఘనంగా టన శతావార్షికోత్సవాలను నిర్వహిస్తునట్లు మోద చెప్పుకొన్నా, ఇటీవలి కాలంలో, సర్ సంఘ చాలక మోహన్ భాగవత్, అలాంటి ఆలోచనలు ఏమి లేవని, శతావార్షికోత్సవాలు జరుపోకవ్వడం లేదని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పదేళ్ళ బిజేపి పాలనలో ఆర్ ఎస్ ఎస్ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, కొంత మంది పెట్టుబడిదారుల చేతిలో బిజేపి బందీ అయిందనే భావం ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వంలో నాటుకొనడాని అనుకొంటున్నారు. పార్టీ సిద్దాంతలకు, ఆచరణకు ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేచుకొని, దశాబ్దాలపాటు తమ జీవితాలను పార్టీకి అంకితం చేసిన కార్యకర్తలనుపట్టించుకోకుండా, నాయకులను మోడి- అమిత్ షా లు తమ స్వంత ఏజండాతో పార్టీని నడుపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అధికారం ఎవరిదైనా, ఆర్ ఎస్ ఎస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, తనడంటూ ప్రత్యేక మార్గం ఎంచుకోంటుందని అందులోని పెద్దలు చెపుతుంటారు. అందుకే 1977 వరకు పరోక్షంగా ఆర్ ఎస్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు అందించిందని, కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో సహకరించిందని చెప్పుకొంటారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు, నాయకులు గత పదేళ్ళ అధికారంలో ఎలాంటి లబ్ది పొందకపోవడమే కాకుండా, ఇన్నాళ్ళూ ఎవరైతే తమను ఇబ్బందుల పాలు చేశారో వారినే తెచ్చి, ప్రభుత్వంలో కూచోబెట్టడం కూడా కింది స్థాయి కార్యకర్తలలో నిరుత్సాహం పెనహిందాని, అందుకే ఎసయారీ ఎన్నికల్లో పూర్తిగా ఏమి పట్టనట్లు ఉన్నారని పార్టీలోని ఒక వర్గం చెప్పుకొంటుంది.
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
సాధారణంగా, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని, పెరిగిన వోట్లన్నీ ప్రతిపక్షాలవే అనే ఒక ప్రహకారం ఉండి. కానీ 2004, 2014 లలో కూడా ఓటింగ్ శాతం గతం కంటే తక్కువగానే నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్న బిజేపి (2004), కాంగ్రెస్ -యు పి ఏ (2014) లలో అధికారం కోల్పోయాయి. ప్రభుత్వాన్ని సమర్థించే సాంప్రదాయ వోటర్లు నిర్లిప్తతో ఓటింగ్ కు దూరం కావడం, ప్రతిపక్షాలకు రావలసిన వోట్లు రావడంతో ప్రభుత్వాలు కూలిపోయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మళ్ళీ ఈ సారి కూడా తక్కువ ఓటింగ్ నమోదు కావడం కూడా గత అనుభవాలను పునరావృతం చేస్తుందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. మొదటిదశ అనుభవంతో మోడి-షా లు ఎంత గట్టిగా కార్యకర్తలను ప్రోత్సహించినా, బెదిరించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. హిందీ రాష్ట్రాలలో కోల్పోయిన సీట్లను నాల్గవ దశలో జరగబోయే తేఊగు రాష్ట్రాలలో కొంత మేర భారతి చేసుకోవాలని భావిస్తున్న బిజేపి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
శతాధిక ఆచార్యుని పరమపదం
లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు.
ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు... హైదరాబాద్లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్కు చెందిన చేట్పల్లి సంజయ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్కు బయలుదేరాడు. అయితే... కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.
గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ... చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి... ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి... పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం
స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం
యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.
పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146... ఇండియా టుడే రౌండ్టేబుల్లో అన్నామలై–కార్తీ చిదంబరం
మర్యాదకు, రాజకీయ పరిణితకు అద్దం
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
ఇండియా టుడే నిర్వహించిన రౌండ్టేబుల్ చర్చలో తమిళనాడు రాజకీయాలకు చెందిన ప్రముఖ నాయకులు అన్నామలై కుప్పుస్వామి మరియు కార్తీ చిదంబరం పాల్గొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణంగా టెలివిజన్ డిబేట్లలో కనిపించేలా అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలు... ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్
వాషింగ్టన్ ఫిబ్రవరి 12:
:వైట్ హౌస్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.... మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఉత్సాహం
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)
(శ్రీధర గణపతి జగిత్యాల)జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బుధవారం యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియా ముందు సంకేతాన్ని ప్రదర్శించారు.
39వ వార్డుకు చెందిన గోలి... డాలర్ బలహీనమైనా రూపాయి ఎందుకు మరింత పడిపోయింది?
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12:
జనవరి నెలలో అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడింది. అయితే సాధారణంగా ఒక కరెన్సీ బలహీనపడితే, దాని ఎదురు కరెన్సీలు బలపడటం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. డాలర్ బలహీనత కనిపించిన సమయంలోనే భారత రూపాయి మరింత క్షీణించింది. దీని వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి.
1️⃣ ... RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది.
1. RBI తెలిపిన... మధ్యప్రదేశ్పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి
భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం... 