ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన - ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
ఆర్ ఎస్ ఎస్ నిరాసక్తత బిజేపిలో పెంచిన ఆందోళన
-పదేళ్ళ అభివృద్ధిని చెప్పుకోలేని బిజేపి నాయకత్వం ?
-రెండవ దశలలో తగ్గిన ఓటింగ్
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
-బిజేపి ప్రభావిత ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్
-నిరాసక్తతగా బిజేపి కార్యకర్తలు
-ఫలించని మోడి హిందూ హిందూ ధృవీకరణ మంత్రం
బిజేపి అధినాయకత్వం తీరుపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల తిరుగుబాటు
రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో గుబులు పెంచిన ప్రజలు
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
18 వ లోకసభకు జరుగుతున్న ఎన్నికల్లో 190 లోక సభ స్థానాలలో పోలింగ్ పూర్తయింది. గతంలో ఎంతో బలంగా ఉండి, అధిక స్థానాలు గెలుచుకొన్న రాజస్తాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రెండు దశల పోలింగ్ లో ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు కావడం, ముఖ్యంగా బిజేపి గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలలో బిజేపి కార్యకర్తలు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అంతగా ఉత్సాహం చూపడం లేదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆండాలనకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో, బిజేపి మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ యాంటీ ముట్టనట్లుగా ఉందనే వార్తలు హిందీ రాష్ట్రాలలోని బిజేపి నాయకత్వాన్ని తొలచివేస్తుంది.
రెండు దశల పోలింగ్ తరువాత, మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటున్న బిజేపి డబుల్ ఇంజన్ నాయకత్వానికి, ఆర్ ఎస్ ఎస్ కు మధ్యలో అంతరం పెరగిందనే వార్తల నేపథ్యంలో పూర్తి విశ్లేషణ
తగ్గిన పోలింగ్ శాతం తో బిజేపి అధికారంలోకి రావడం కష్టమేనా ?
ఎన్నికల క్షేత్రంలో ఆర్ ఎస్ ఎస్ కనబడమలేదనే వార్తలు ఎంతవరకు నిజం ?
ఎందుకు ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు తెర వెనుకకు వెళ్లారు ?
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన డబుల్ ఇంజన్ సర్కార్ రెండు దశల పోలింగ్ పూర్తి కావడంతో, ప్రస్తుత క్షేత్ర స్థాయి నుండి వస్తున్న వార్తలు బిజేపి అధినాయకత్వంలో ఆందోళన పెంచుతుందనే పచారం జరుగుతుంది. ఏమాత్రం బలంలేని, సరియైన నాయకత్వం, ఐక్యత లేని ప్రతిపక్షాన్ని సులువుగా ఓడించి, నెహ్రూ తరువాత మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడి ప్రధాని అవుతాడాని అనుకున్న బిజేపి నాయకత్వానికి ఇప్పటి పరిస్థితులు అంతుపట్టడం లేదని, వివిధ కారణాల వల్ల పార్టీ కింది స్థాయి కార్యకర్తలలో అంతగా ఉత్సాహం కనబడక పోవడంతోనే పోలింగ్ శాతం తగ్గిందనే ప్రచారం జరుగుతుంది.
మొదటి దశ పోలింగ్ రోజు మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ లో రాత్రి పూట బస చేసి, పార్టీ నాయకులను కాదని, ఆర్ ఎస్ ఎస్ నాయకులను కలిసినట్లు, దాని తరువాతనే, రాజస్థాన్ లో మళ్ళీ హిందూ – ముస్లింల అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పుకొంటున్నారు. నిజానికి నాగపూర్ లో ఎం జరిగిందో ఎవరికి తెలియదు. రాజ్ భవన్ లో బస చేసిన ప్రధాని మోడి, కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను మాత్రమే కలిసినట్లు, చివరికి స్థానిక అభ్యర్థి, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ;ఆంటీ వారిని కూడా కలవ లేదనే తెలుస్తుంది.
వచ్చే సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎంతో ఘనంగా టన శతావార్షికోత్సవాలను నిర్వహిస్తునట్లు మోద చెప్పుకొన్నా, ఇటీవలి కాలంలో, సర్ సంఘ చాలక మోహన్ భాగవత్, అలాంటి ఆలోచనలు ఏమి లేవని, శతావార్షికోత్సవాలు జరుపోకవ్వడం లేదని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పదేళ్ళ బిజేపి పాలనలో ఆర్ ఎస్ ఎస్ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, కొంత మంది పెట్టుబడిదారుల చేతిలో బిజేపి బందీ అయిందనే భావం ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వంలో నాటుకొనడాని అనుకొంటున్నారు. పార్టీ సిద్దాంతలకు, ఆచరణకు ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేచుకొని, దశాబ్దాలపాటు తమ జీవితాలను పార్టీకి అంకితం చేసిన కార్యకర్తలనుపట్టించుకోకుండా, నాయకులను మోడి- అమిత్ షా లు తమ స్వంత ఏజండాతో పార్టీని నడుపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అధికారం ఎవరిదైనా, ఆర్ ఎస్ ఎస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, తనడంటూ ప్రత్యేక మార్గం ఎంచుకోంటుందని అందులోని పెద్దలు చెపుతుంటారు. అందుకే 1977 వరకు పరోక్షంగా ఆర్ ఎస్ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు అందించిందని, కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో సహకరించిందని చెప్పుకొంటారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు, నాయకులు గత పదేళ్ళ అధికారంలో ఎలాంటి లబ్ది పొందకపోవడమే కాకుండా, ఇన్నాళ్ళూ ఎవరైతే తమను ఇబ్బందుల పాలు చేశారో వారినే తెచ్చి, ప్రభుత్వంలో కూచోబెట్టడం కూడా కింది స్థాయి కార్యకర్తలలో నిరుత్సాహం పెనహిందాని, అందుకే ఎసయారీ ఎన్నికల్లో పూర్తిగా ఏమి పట్టనట్లు ఉన్నారని పార్టీలోని ఒక వర్గం చెప్పుకొంటుంది.
తగ్గిన వోట్ల వల్ల ఎవరికి లాభం ?
సాధారణంగా, ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని, పెరిగిన వోట్లన్నీ ప్రతిపక్షాలవే అనే ఒక ప్రహకారం ఉండి. కానీ 2004, 2014 లలో కూడా ఓటింగ్ శాతం గతం కంటే తక్కువగానే నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్న బిజేపి (2004), కాంగ్రెస్ -యు పి ఏ (2014) లలో అధికారం కోల్పోయాయి. ప్రభుత్వాన్ని సమర్థించే సాంప్రదాయ వోటర్లు నిర్లిప్తతో ఓటింగ్ కు దూరం కావడం, ప్రతిపక్షాలకు రావలసిన వోట్లు రావడంతో ప్రభుత్వాలు కూలిపోయి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మళ్ళీ ఈ సారి కూడా తక్కువ ఓటింగ్ నమోదు కావడం కూడా గత అనుభవాలను పునరావృతం చేస్తుందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. మొదటిదశ అనుభవంతో మోడి-షా లు ఎంత గట్టిగా కార్యకర్తలను ప్రోత్సహించినా, బెదిరించినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. హిందీ రాష్ట్రాలలో కోల్పోయిన సీట్లను నాల్గవ దశలో జరగబోయే తేఊగు రాష్ట్రాలలో కొంత మేర భారతి చేసుకోవాలని భావిస్తున్న బిజేపి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయం లో త్రయానిక ఏక కుండాత్మక ,దేవాలయ సంప్రోక్షణ పూజా కార్యక్రమం..
జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయం లో త్రయానిక ఏక కుండాత్మక దేవాలయ సంప్రోక్షణ, మరియు నూతన ఉత్సవ మూర్తుల ప్రతిష్టా మహోత్సవం సందర్బంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు.
ఉత్సవ మూర్తులను స్థానిక వైశ్య భవన్ నుండీ మేళ తాళాలతో, మహిళలు మంగళహారతులతో స్వామివారి... సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ
మహిళల భద్రత కోసం గళం వినిపిస్తున్న సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ!
హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు.... ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ కారు పేలుడు ఉగ్రదాడి – ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రం అధికారిక ప్రకటన
న్యూ ఢిల్లీ నవంబర్ 12 (ప్రజామంటలు):
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమావేశం అనంతరం,... అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు
అంగన్వాడీ విద్యార్థులకు ఆటవస్తువుల పంపిణీ సికింద్రాబాద్,నవంబర్ 12 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ పరిధిలో రాణిగంజ్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారుల మధ్యలో స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమారి. ఓ.పావని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులకు ఇష్టమైన వివిధ రకాల తినుబండారాలను, ఆటవస్తువులను అందజేశారు.
ఈ కార్యక్రమములో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరిత, ప్రెసిడెంట్ వై.... పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి.. : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి
యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా... తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు):
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగదారుల డిజిటల్ భద్రత బలోపేతం చేస్తూ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని టెలికాం అదనపు డీజీ నాగేష్ రావు తెలిపారు. బుధవారం సీటీవోలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు పొగొట్టుకున్న,... నిమోనియా ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడవచ్చు
మెడికవర్ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి మళ్లూ ప్రపంచ నిమోనియా దినోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీస్తుందని సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ పల్మనాలజిస్ట్ డా. గంగాధర్రెడ్డి మళ్లూ అన్నారు. ప్రపంచ నిమోనియా దినోత్సవం––... సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు):
దేశంలోనే మొదటిసారిగా కిమ్స్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్కు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు లభించింది. రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు పదివేలకు పైగా చేయడం, పరిశోధన పత్రాలు, హాస్పిటాలిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్ట్రైకర్ కంపెనీ ఈ అవార్డును అందజేసింది.ఈ సందర్భంగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్... 'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ –
సినిమా విడుదలను నిలిపివేయాలని శత్రియ సంద్రోర్ పడై సంస్థ స్థాపకుడు హరి నాదర్ హైకోర్టును ఆశ్రయించారు
చెన్నై నవంబర్ 12,(ప్రజా మంటలు)
మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజర్ ను అపఖ్యాతి పాల్జేస్తోందని ఆరోపిస్తూ, ఒక రాజకీయ పార్టీ ‘దేశియా తలైవార్ (Desiya Thalaivar)’ సినిమా విడుదలను నిషేధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
సిలైవ్ లాకి నివేదిక... మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్
కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం
హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు):
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని... టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్
డీఎంకే నాయకత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, తమ పార్టీ విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఉన్నాయని విజయ్ వ్యాఖ్య
చెన్నై నవంబర్ 12,
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రగులుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం (నవంబర్ 12) డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.స్పష్టంగా పేరు చెప్పకపోయినా, తమిళనాడు... ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి
సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్మల్యాల /కొడిమ్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)బుధవారం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల మండల పరిధిలోని రైతులు మరియు రైస్ మిల్లర్ లతో జేఎన్టీయు లో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి... 