ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు
ఆర్మీ ఏరియాలో ఫైర్ ఇన్సిడెంట్ తో ఆర్మీ సిబ్బంది అలర్ట్..
సికింద్రాబాద్, అక్టోబర్ 09 (ప్రజామంటలు) :
కంటోన్మెంట్ లో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఏఓసి రోడ్డు లో విద్యార్థులతో వెళుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది అలర్ట్ అయి, విద్యార్థులను బస్సు నుంచి దింపి ప్రమాదం నుండి కాపాడారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. దీంతో అటు పిల్లలు ఇటు సైనికులు ఊపిరి పీల్చుకు న్నారు. ప్రమాద సంఘటన జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే వాహనాల్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలను తెలుసుకొనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పిల్లల తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)