బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి (బుగ్గారం) జూలై 31 (ప్రజామంటలు):
బుగ్గారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
బుగ్గారం మండలానికి మంజూరు అయిన 369 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం 21 లక్షల రూపాయల విలువ గల 21 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తోంది. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా మహిళలఆర్థిక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అన్నారు.
పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు రేషన్ కార్డుల కల నెరవేరిందని, ఇకపై రేషన్ కార్డులు రానివారు మీసేవా కేంద్రాలు లేదా ప్రజాపాలన శిబిరాల్లో దరఖాస్తు చేయవచ్చని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తక్షణమే కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డుల్లో పేర్ల జోడింపు ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఆర్డీఓ మధుసూదన్, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, నగునూరి నర్సగౌడ్,బత్తుల తిరుపతి, బీర్పూర్ తిరుపతి, కండ్లె మదన్, కుంట మహేష్,గలిపెల్లి వెంకన్న, నంది తిరుపతి, సమిత్ పెద్దనవేని శంకర్, కోడిమ్యల రాజన్న, జంగ శ్రీనివాస్, తడేపూ లింగన్న,బండారి మహేష్, గడ్డం నారాయణ, తెనుగు గంగన్న,బుర్ర రమేష్, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్
