త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు
*
భీమారం జులై 30 (ప్రజా మంటలు)
త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం కానున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం మేడిపల్లి కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్,ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక రివ్యూ ఏర్పాటు చేశారు .
వారు మాట్లాడుతూ. కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను ముమ్మరంగా కొనసాగించవలసిందిగా కాంట్రాక్టర్ కు సూచించడం జరిగింది అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన 3 ఎకరాల భూ సేకరణ నష్ట పరిహారాన్ని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి ఇవ్వడం జరిగింది అన్నారు . స్టేజి 2 ఫేస్ 1 శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 2005లో 1731 కోట్లతో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు..
రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుందని తెలిపారు...
ఆనాడే నిధులు మంజూరు అయిన పనులు పూర్తి చేయలేదన్నారు.. 2018 ఎన్నికల్లో 200 కోట్లతో ఆనాడు అప్పటి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఫౌండేషన్ ఏసి ఈ దసరా కే నీళ్లు ఇస్తామని చెప్పి అలాంటి దసరాలు ఎన్ని పోయినా కానీ ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున అనేక ఆందోళనలు చేశామని గుర్తు చేశారు.. గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం చేయకుండా నిర్లక్ష్యం చేశారు..
మేము 37 సార్లు ప్రాజెక్ట్ నిర్మన్ పూర్తి చేయాలని అనేక చేశామని, ప్రాజెక్టు సందర్శనలో భాగంగా అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులు ప్రాజెక్టును సందర్శించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శిరవేగంగా పూర్తి చేస్తామని మాట ఇచ్చారని, నేడు ఎమ్మెల్యేగా తను పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు కొనసాగుతాయని తెలిపారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కాలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికార్లకు సూచించి రాష్ట్రంలోని మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తీ చేసే వాటిలో చేర్చి 350 కొట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందని ఇప్పటికే మొత్తం నిర్మాణం పూర్తయిందని తెలిపారు..
2018 లో బిఆర్ఎస్ వారు కనీసం భూ సేకరణ కోసం కూడా డబ్బులు లేకుండా ఎన్నికల్లో ఓట్ల కోసమే శంకుస్థాపన చేశారు.. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే కూడి ఎడమ కాలువల నిర్మాణానికి 500 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.. మొదటి దఫా భూసేకరణ కు 10 కోట్ల నిధులు మంజూరీ అయి జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో త్వరలోనే కుడి ఎడమ కాలువల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. గత ప్రభుత్వ హయాంలో 75 కోట్ల కాంట్రాక్టర్కు బకాయి పెడితే ప్రజా ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లించడం జరిగింది అని తెలిపారు...
గత ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధి చేస్తానని చెప్పి మోసం చేసిందన్నారు.. రానున్న రోజుల్లో వేములవాడ నియోజవర్గన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
