పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు
జగిత్యాల జూలై 31(ప్రజా మంటలు)
రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలపై పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలని రాష్ట్ర సిసిఎల్ఎ.. కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు లు ఆయా జిల్లా కలెక్టర్ లను ను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన (రీ-సర్వే) పై గురువారం రాష్ట్ర సిసిఎల్ఎ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), బీ ఎస్ లత ఆర్డీవో మధుసూదన్, ఏడి ఎస్ & ఎల్ ఆర్ ఎస్ బీర్పూర్ తహసీల్దార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికారులకు పలు, సూచనలు సలహాలు అందజేశారు. బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద (రీ-సర్వే)కు సంబంధించి తీసుకున్నామని తెలిపారు. రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలు ఎంక్వైరీ చేసి 2 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ. సర్వే సిబ్బందికి ఫీల్డ్ వెళ్ళి విచారణ జరిపి రిపోర్టు సమర్పించాలని సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులు పూర్తి పారదర్శకంగా.. చట్టం ప్రకారం.. నిబంధనల మేరకు వ్యవహరించాలని కమిషనర్ పేర్కొన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించినా అధికారులదే పూర్తి బాధ్యత అని.. ఇందుకు బాధ్యతయుతంగా పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్టు తెలిస్తే చర్యలు తప్పవని కమిషనర్ పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, సామూహికంగా మహిళలచే కుంకుమార్చన పూజలు

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక
.jpeg)
BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు
