సఖి అవగాహనా కార్యక్రమం
ఇందిరానగర్ గ్రామంలో మహిళలకి చట్టపరమైన అవగాహన
ఎల్కతుర్తి, జూన్ 15 (ప్రజామంటలు) :
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీలో సఖి సెంటర్ ఆధ్వర్యంలో మహిళల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి మేడం పాల్గొని, సఖి సెంటర్ ప్రధాన లక్ష్యాలు, మహిళలకు అందించే సేవల గురించి వివరించారు.
ఆమె మాట్లాడుతూ, "గృహహింస, లైంగిక వేధింపులు, పనిస్థల వేధింపులు, అత్యాచారాలు వంటి ఘటనల్లో బాధిత మహిళలు న్యాయ పరంగా ఎలా రక్షణ పొందవచ్చో తెలియజేయడమే సఖి ఉద్దేశం" అని చెప్పారు. మహిళలు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణ సహాయానికి ఉమెన్ హెల్ప్లైన్ నంబర్ 181, చైల్డ్ లైన్ నంబర్ 1098 కు ఫోన్ చేయొచ్చని, అదేవిధంగా 08702452112, 7382983088 నంబర్లకు కాల్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చని వివరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సఖి కేస్ వర్కర్లు భారతి, జ్యోతి, సుమలత, రాధికలు పాల్గొన్నారు. అలాగే గ్రామంలోని ఎస్హెచ్జీ సభ్యులు కూడా హాజరై చట్టపరంగా తమ హక్కులపై సమాచారాన్ని పొందారు.ఈ అవగాహన కార్యక్రమం గ్రామ మహిళల్లో చట్టపరమైన చైతన్యాన్ని కలిగించిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)