గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం
అభా ఐడి తో రోగుల రికార్డులు డిజిటల్ నమోదుపై అధ్యయనం
స్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపి పై ఆరా...
సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు):
ఆయుష్మాన్ భారత్(అభా) డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో భాగంగా, 18 రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రల నోడల్ అధికారులు శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ సౌకర్యాలు, నూతనంగా వేగవంతమైన ఓపీడీసేవలు , స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్ లో డిజిటల్ సేవలు అందించే విషయాలను ఈసందర్బంగా గాంధీ హాస్పిటల్ నోడల్ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వారికి వివరించారు. క్రాస్-లెర్నింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారికి గాంధీ ఆసుపత్రిలో నందు అందుతున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి , సి యస్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్యులు, నోడల్ అధికారులు వారి సందేహాలను నివృత్తి చేశారు. వారు మాట్లాడుతూ రోగుల రికార్డులు డిజిటల్ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు వారి మొబైల్ నెంబర్ ద్వారా వారి అకౌంట్ లో ఉంటాయని దీని ద్వారా వివరాలు, ల్యాబ్ రిపోర్టులు జీవితాంతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. 100శాతం డిజిటల్ చేయాలని ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. స్కాన్ అండ్ షేర్ ద్వారా త్వరగా ఓపి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి మెడికల్ బృంద సభ్యులు డాక్టర్ పంకజ్ అరోరా, సౌరభ్ సింగ్, రితిక, బబిత, అబ్యుధయ్ తో పాటు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి, సి యస్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి, ఓపి ఆర్ యం ఓ డాక్టర్ రజని, నోడల్ ఆఫీసర్ ఫర్ అభా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆర్. యం ఓ లు డాక్టర్ మీనాక్షి , డాక్టర్ నజీమ్, డాక్టర్ సుధీర్, డాక్టర్ యోగి, డాక్టర్ నవీన్, డాక్టర్ సరిత, యూసుఫ్, కిరణ్, జగదీష్, చిరంజీవి, సుప్రియ, నరేష్ , రాష్ట్ర బృందం దివ్య , డాక్టర్ విమల, సురేష్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నోడల్ అధికారులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
