యోగా సాధన జీవితంలో భాగం కావాలి - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్, జూన్ 09 (ప్రజామంటలు) :
శారీరకంగా, మానసికంగా ప్రతిరోజు ఉల్లాసంగా ఉండాలంటే యోగ సాధన దైనందిన జీవితంలో భాగం కావాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం కవాడిగూడలోని సీజీవో టవర్స్ పీ.ఐ.బీ సెమినార్ హాల్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగ డే కు ఒక రోజు ముందుగా జూన్ 20వ తేదీ ఉదయం 6 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో 50 వేల మందితో భారీ ఎత్తున సామూహిక యోగ సాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మనం తింటున్నా ఆహారం, పీల్చుతున్న గాలి, తాగుతున్న నీరు అన్ని కలుషితం అవుతున్నాయని, అనవసరంగా ఆసుపత్రులకే సంపాదనంతా ఖర్చు పెట్టాల్సి వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. శారీరక శ్రమ తగ్గడం వల్ల అత్యధిక ప్రజలు ఊబకాయం బారిన పడుతున్నారని, ఇది ఆరోగ్యానికి అనర్ధదాయకమని అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమేనని అన్నారు. కుల, మత, వర్గ, లింగ, వయోభేదం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ ఒక్కరూ నిత్యం ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏ.వీ.ఎన్.రెడ్డి,కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యాదగిరి శేఖర్ రావు,ట్రస్మా స్టేట్ అడ్వయిజర్ శ్రీనివాసరెడ్డి, ట్రస్మా స్టేట్ పెసిడెంట్ లు శివరాత్రి యాదగిరి,ఎస్ ఎన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బిస్మాట్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్.శేఖర్ రెడ్డి, ట్రస్మా ప్రతినిధులు పి ఎల్ శ్రీనివాస్, శ్యామ్ సుందర్ గౌడ్, గౌతమ్ రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వీరేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.
