గాంధీలో తాగునీటి ప్లాంట్ ప్రారంభం
సికింద్రాబాద్, జూన్ 09 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రిలో పేషంట్ల కోసం మంచుకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధి చేసిన మంచినీటి ప్లాంట్ ను సోమవారం సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, మంచుకొండ ఫౌండేషన్ ట్రస్టీ ఎం.వరుణ్ కుమార్ లు ప్రారంభించారు. ఆరు 300 లీటర్ల ప్లాంట్ లు, ఇరవై వంద లీటర్ల వాటర్ కూలర్లను తమ ఫౌండేషన్ ద్వారా సమకూర్చినట్టు మంచుకొండ వరుణ్ కుమార్ తెలిపారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా తమ ఫౌండేషన్ తీసుకున్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. రోగులకు శుద్ధిచేసిన మంచినీటి వసతి కల్పించిన మంచుకొండ ఫౌండేషన్ సంస్థ సేవాభావాన్ని అభినందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి శేఖర్ రావు, ఆర్ఎంఓ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ నవీన్, అడ్మిన్ మేనేజర్ శివరామి రెడ్డి, మంచుకొండ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, సిబ్బంది మల్లేష్, సతీష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.
