ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
రైలు ఎక్కబోయి జారి పడి...నవ వరుడు మృతి
విషాదంగా ముగిసిన గోవా టూర్...
సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు) :
మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ప్రస్తుత రోజుల్లో అయితే రాత్రి పడుకున్న మనిషి, ఉదయం లేస్తాడో లేడో కూడా నమ్మకం లేదు. ఇలానే కొత్తగా పెళ్లైన ఓ జంట రైలులో హనుమూన్ కు వెళుతుండగా ట్రైన్ ఆలస్యం వరుడి ప్రాణాలు బలిగొంది. దీంతో గమ్యం చేరకుండానే వారి ప్రయాణం విషాదంగా ముగిసింది.
ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగింది. సికింద్రాబాద్ జీఆర్ పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ పట్టణంలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతానికి చెందిన రమేశ్ కుమారుడు ఉరగొండ సాయి (28) స్థానికంగా గిప్ట్ ఆర్టికల్స్ తయారీ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి మూడు నెలల క్రితం వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కొత్త జంట హనీమూన్ ప్లాన్ చేసుకొని గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు రైల్వే టికెట్లు కూడా రిజర్వేషన్ చేసుకున్నారు.
శుక్రవారం ఉదయం భార్య, బావమరిది, నలుగురు స్నేహితులతో కలిసి గోవా వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. అప్పటికే రైలు రైల్వేస్టేషన్ లో 9 వ నంబరు ప్లాట్ ఫాం పై ఆగి ఉంది. అందరూ వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ఎక్కి తమ తమ సీట్లలో కూర్చోగా, రైలు బయలుదేరడానికి ఆలస్యం కావడంతో ప్లాట్ ఫాం పై ఉన్న స్టాల్ లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి రైలు దిగాడు. అతడు దిగి వాటర్ బాటిల్ కొంటుండగా, అంతలోనే రైలు బయలుదేరడంతో బోగీలో ఉన్న స్నేహితులు చైన్ లాగారు. దీంతో రైలు ఆగింది. ఏం జరిగిందోనని ఆర్పీఎఫ్ పోలీసులు బోగీలోకి వెళ్లి ప్రశ్నించారు. వారంతా విషయం చెప్పారు. దీంతో సాయి స్నేహితులైన ఇద్దరు యువకులను పోలీసులు ప్లాట్ ఫాం పైకి తీసుకువచ్చారు. అప్పుడే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని తిరిగి ప్లాట్ ఫాం మీదకు చేరుకున్నాడు. అక్కడున్న పోలీసులకు ఫైన్ కడతామని, రైలు వెళ్లిపోతుందని వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు.
ఇంతలోనే రైలు బయలుదేరింది.రైలులో భార్య, బావమరిది, మరో ఇద్దరు స్నేహితులు ఉండగా, అతడు వేగంగా వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు, ప్లాట్ ఫాం మధ్యలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
