125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత
రామ్గోపాల్ పేట పీఎస్ భవనం మరమ్మతులు పూర్తి
త్వరలో తిరిగి జేమ్స్ స్ర్టీట్ లోని హిస్టరికల్ బిల్డింగ్ లోకి పీఎస్
*సిటీ పోలీస్ కమిషనర్ సందర్శన
సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ రామ్గోపాల్ పేట డివిజన్ జేమ్స్ స్ర్టీట్ లోని పురాతన చారిత్రక ప్రాధాన్యం కలిగిన భవనాన్ని మరమ్మతుల అనంతరం తిరిగి హైదరాబాద్ సిటీ పోలీసులకు అప్పగించినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన జేమ్స్ స్ర్టీట్ లోని రామ్గోపాల్ పేట పోలీస్ స్టేషన్ భవనాన్ని సందర్శించారు. జేమ్స్ స్ర్టీట్ పోలీస్ స్టేషన్ భవనాన్ని 1900 సంవత్సరంలో నిర్మించారని, అప్పటినుంచి 2016 వరకు అంటే 116 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రామ్గోపాల్ పేట పోలీస్ స్టేషన్ ఇందులోనే ఉందన్నారు.
ఈ పురాతన భవనానికి మరమ్మతులు అవసరం పడటంతో తొమ్మిది ఏండ్లక్రితం ఈ భవనంలో ఉన్న పీఎస్ ను మినిస్టర్ రోడ్డులోని మరో భవనంలోకి షిప్ట్ చేశామన్నారు. ఇప్పుడు మరమ్మతులు పూర్తి చేసిన హెచ్ఎమ్డీఏ తిరిగి ఈ భవనాన్ని సిటీ పోలీసులకు అప్పగించిందన్నారు. ఈ భవనానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని సీపీ గుర్తు చేసుకున్నారు.త్వరలో రామ్గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు సంబందించిన వస్తువులను తిరిగి ఈ భవనంలోకి తరలించి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు.
అయితే ప్రస్తుతం పీఎస్ కు సంబంధించిన వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినందున వాటి పార్కింగ్ సదుపాయం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. సిటీలోని పురాతన కట్టడాలను భావితరాల కోసం కాపాడవలసిన భాద్యత అందరిపై ఉందన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కు సంబందించిన పురాణి హవేలీ కమిషనర్కార్యాలయానికి గత మూడు ఏండ్ల నుంచి రిపేర్లు జరుగుతున్నాయని, త్వరలో దీన్ని కూడ పున:ప్రారంభిస్తామన్నారు.
పురాణి హవేలీ లోని కమిషనర్ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ప్రతి శుక్రవారం అక్కడి నుంచే తాను విధులు నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. నార్త్ జోన్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాల్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
