అనుమతి పత్రాలు లేకుండా పశువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మే 29 (ప్రజా మంటలు) అనుమతి పత్రాలు లేకుండా
పశువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు
పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంతరoగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.ఈ చెక్పోస్టుల లో 24 గంటలూ నిరంతర నిఘాలో ఉంటాయనీ, పోలీసు శాఖ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది షిఫ్టుల వారీగా సమన్వయంతో పనిచేస్తారని ఎస్పీ వివరించారు. పశువుల రవాణా అనేది నియమ నిబంధనల ప్రకారమే జరగాలని, అనుమతి పత్రాలు లేకుండా ఆవులు, దూడలను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పశువులను రవాణా చేసే ప్రతి వాహనంతో చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలనీ, ఎవ్వరు తమ ఆధారాలు లేకుండా రవాణాలో పాల్గొనరాదని సూచించారు. ఏ వ్యక్తి లేదా సంస్థ స్వయంగా వాహనాలను ఆపకూడదనీ, ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద రవాణా గమనించిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సూచించారు.
అదేవిధంగా సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టే మరియు అసభ్యకరమైన పోస్టులు పెడితే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)
కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల
