అనుమతి పత్రాలు లేకుండా పశువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మే 29 (ప్రజా మంటలు) అనుమతి పత్రాలు లేకుండా
పశువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు
పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంతరoగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.ఈ చెక్పోస్టుల లో 24 గంటలూ నిరంతర నిఘాలో ఉంటాయనీ, పోలీసు శాఖ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది షిఫ్టుల వారీగా సమన్వయంతో పనిచేస్తారని ఎస్పీ వివరించారు. పశువుల రవాణా అనేది నియమ నిబంధనల ప్రకారమే జరగాలని, అనుమతి పత్రాలు లేకుండా ఆవులు, దూడలను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పశువులను రవాణా చేసే ప్రతి వాహనంతో చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలనీ, ఎవ్వరు తమ ఆధారాలు లేకుండా రవాణాలో పాల్గొనరాదని సూచించారు. ఏ వ్యక్తి లేదా సంస్థ స్వయంగా వాహనాలను ఆపకూడదనీ, ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద రవాణా గమనించిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సూచించారు.
అదేవిధంగా సోషల్ మీడియాలో ద్వేషపూరిత, రెచ్చగొట్టే మరియు అసభ్యకరమైన పోస్టులు పెడితే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
