అంబేద్కర్ భవనాన్ని నిర్మించి, లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తాం - విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 14:
ధర్మపురి పట్టణంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించి, లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని, జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ పని చేశారని, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలకు గాను ఆ మహనీయుడి మరణాంతరం' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనీ గుర్తు చేశారు.
ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయిందని, ధర్మపురిలో అంబేద్కర్ భవనం కావాలని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే అనువైన స్థలాన్ని చూసి 20 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తామని, అందులోనే ఒక లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు
