కార్కాన లో దారుణం..అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య - ఆలస్యంగా వెలుగులోకి..
వివాహం కాకపోవడంతో పాటు మానసిక సమస్యలు?
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు):
కార్కాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్ మెంట్ లోని ప్లాట్ లో అక్కా చెల్లెళ్ళ ఇద్దరి మృతి ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు...కార్కాన పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనిధి అపార్ట్ మెంట్ లోని ప్లాట్ నెంబర్ డీ 4 లో వీణ, మీనాలు నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో ఎవరితో వీరు పెద్దగా మాట్లాడేవారు కాదు. మంగళవారం వీరి ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు ప్లాట్ కు వచ్చిన పోలీసులు లోనికి వెళ్ళి చూడగా వీణ,మీనా లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
వీరికి వివాహం కాకపోవడం, మానసిక స్థితి బాగ లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. వీళ్ళు మొత్తం ఏడుగురు అక్కాచెల్లెళ్ళు కాగా, తండ్రి ఆర్మీలో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. బహుశా ఆదివారం అక్కాచెల్లెళ్ళు సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)