సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"
ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారు.
విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత, పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు
సెంట్రల్ లైబ్రరీలోనికి వెళ్లకుండా పోలీసుల అడ్డగింత
చిక్కడపల్లి హైదరాబాద్ అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో చర్చించేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్ళారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
సెంట్రల్ లైబ్రరీ ప్రధాన ద్వారం లోపలికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడదానికి వెళుతుండగా, పోలీసులు అడ్డగించడంతో,. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా జాగృతి నాయకుల నినాదాలు చేశారు.సెంట్రల్ లైబ్రరీ గేటు వద్దనే బైఠాయించి కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు ఆందోళనకు దిగారు.
అనంతరం మీడియాతో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను.. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.కేసీఆర్ పరిపాలనలో కూడా అవకతవకలు జరిగాయని విద్యార్థులు చెప్పారు.ఆనాడైనా, ఈనాడైనా విద్యార్థులకు న్యాయం జరగాలనే నేను కోరుతున్నానాని అన్నారు.
విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టండి. ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించారు.
మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది. ప్రతిభ, ధైర్యం ఉన్న విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదనీ అన్నారు.
అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే మేము కోరుతున్నాం.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.మేము ఆంధ్రోళ్లకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలే. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేశాం.
రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదు.రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలి. లేదంటే మేము బీహార్ కు వస్తాం. ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరుతున్నా.
రేపు కోర్టులో ఈ అంశంపై విచారణ ఉంది. న్యాయమూర్తులు కూడా ఆలోచన చేయాలని కోరుతున్నా.తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం చేశారు. గ్రూప్ -1 రాసిన వాళ్లలో పోలీసోళ్ల పిల్లలు కూడా ఉన్నారు.
మీ పిల్లలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని పోలీసులను అడుగుతున్నా. తెలుగు, ఉర్ధూ మీడియం లో రాసిన అభ్యర్థులకు అన్యాయం చేశారు.
ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారు.
2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ పాత 50 వేల ఉద్యోగాలే ఇచ్చారు తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదు.
తెలంగాణలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పై పార్లమెంట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు?
గ్రూప్-1 విషయంలో డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ప్రభుత్వం బేషజాలకు పోకుండా గ్రూప్ -1 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా.
విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులతో కలిసి కల్వకుంట్ల కవిత చాయ్ తాగారు.జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, గ్రూప్ - 1లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు
*పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు*
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసులు పలువురు జాగృతి నాయకులను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న పలువురు జాగృతి నాయకులపై పోలీసులు దాడి చేశారు.
గత ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామినే మా వల్ల తప్పు జరిగి ఉండవచ్చు.మనలో మనం తెలంగాణ వాళ్లం తప్పు సరిదిద్దుకోవాలి. అంతేగానీ ఆంధ్రవాళ్ల కోసం ఈ ప్రభుత్వం తలవంచింది. ఆంధ్రోళ్లకు ఎట్ల ఉద్యోగాలు ఇస్తారన్న విషయాన్ని అందరు గమనించాలి.
తప్పులు మనం చేస్తే మనమే సరిదిద్దుకుందాం.గ్రూప్-1 ఉద్యోగాలు కచ్చితంగా అమ్ముకొని అవినీతి చేశారు. ఇవ్వాళ కాకపోయిన సరే రేపు ఈ విషయం బయటపడుతుంది. వీటిని ఎదుర్కొనే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు.
పేద విద్యార్థులతో ఈ ప్రభుత్వం తలపడుతోంది. ఇది న్యాయమా?లక్షలు ఇచ్చి లాయర్లను తీసుకొచ్చి పేద విద్యార్థులపై ప్రయోగిస్తారా?అని ప్రశ్నించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... 